National

NationalPOLITICS

పొత్తులపై పవన్ కళ్యాణ్ సూచనలపై బీజేపీ అధిష్టానం ఆలోచిస్తుంది: బీజేపీ ఎంపీ జీవీఎల్

ఏపీ మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకోవాలని, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే సహించమని హెచ్చరించారు. నేడు గన్నవరంలో సోము వీర్రాజు అధ్యక్షతన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏపీ బీజేపీ నేతలతో పాటు పాల్గొన్న ఎంపీ జీవీఎల్ నరసింహారావు వైసిపి అవినీతిపై మండిపడ్డారు. వైసిపి అవినీతిపై చార్జిషీట్, మోడీ పాలనలో జరిగిన మంచిని ప్రజల్లోకి తీసుకువెళ్లడం అజెండాగా…

National

వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ తోపాటు మెడ్ ట్రానిక్ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు

హైదరాబాద్: రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. తాజాగా, అమెరికాకు చెందిన ప్రొడక్ట్ ఇంజినీరింగ్, సొల్యూషన్స్ సంస్థ అయిన జాప్‌కామ్.. హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జాప్‌కామ్ సీఈవో కిషోర్ పల్లం రెడ్డి సహా ఆ సంస్థ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ జరిపిన సమావేశంలో ఈ మేరకు ఒప్పందం కుదిరింది. పర్యాటకం, ఆతిథ్యం, ఫిన్‌టెక్,…

National

మహారాష్ట్రలో ఎన్నికల్లో తొలి విజయం; ఖాతా తెరిచిన బీఆర్ఎస్ పార్టీ!!

తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా కాలంగా మహారాష్ట్ర రాజకీయాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించడానికి కెసిఆర్ చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయనే చెప్పాలి. తాజాగా మహారాష్ట్ర గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తొలి విజయం నమోదు చేసుకుంది. మహారాష్ట్రలోని అంబే లోహల్ గ్రామంలో జరిగిన గ్రామ పంచాయతీ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థి గఫూర్ పఠాన్ విజయం సాధించారు. 115 ఓట్ల తేడాతో…

National

దేవుడికి ఏ పండ్లు నైవేద్యంగా పెడితే ఎలాంటి ఫలితం వస్తుంది?

చాలామంది భగవంతుని పూజించే క్రమంలో పండ్లు భగవంతుడికి నైవేద్యంగా పెట్టి తమని అనుగ్రహించమని ప్రార్ధిస్తారు. వివిధ కాలాలలో వచ్చే పండ్లతో పాటు, అరటి పండ్లు, ఆపిల్స్ తదితరాలు భగవంతుడికి నైవేద్యంగా పెడతారు. అయితే ఏ పండ్లు పెడితే ఎటువంటి ఫలితం వస్తుంది? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. vastu tips: అప్పుల బాధలు మీకు తగ్గాలా? అయితే ఈ పరిహారాలు చేసి చూడండి!! చాలామంది సహజంగా భగవంతుడికి నైవేద్యంగా పూర్ణ ఫలమైన కొబ్బరికాయను సమర్పిస్తారు. భగవంతుడికి కొబ్బరికాయను…

National

“రూ.2వేల నోటు వెనక్కి” ప్రకటనతో ఆర్బీఐ వెబ్‌సైట్ క్రాష్..!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ఒక్కసారిగా క్రాష్ అయ్యింది. రూ.2000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటన నేపథ్యంలో అసలు విషయం తెలుసుకునేందుకు చాలామంది నెటిజెన్లు ఆర్బీఐ వెబ్‌సైట్‌ను సందర్శించారు. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైట్ క్రాష్ అయ్యింది.   రూ.2000 నోట్లు ఇకపై చెలామణిలోకి రావని వాటిని ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ శుక్రవారం ప్రకటన చేసింది. అయితే రూ.2000 నోట్లను పూర్తిగా రద్దు చేయడం లేదని స్పష్టం చేసిన ఆర్బీఐ…

National

దిద్దుబాటు చర్యల్లో ప్రధాని మోడీ.. న్యాయ శాఖ సహాయ మంత్రి కూడా ఔట్

సుప్రీంకోర్టుకు, కేంద్ర న్యాయశాఖకు మధ్య చెలరేగిన వివాదం ప్రధాని నరేంద్ర మోడీ సర్కారుకు చెడ్డ పేరునే ఆపాదించిందని చెప్పొచ్చు. జడ్జీల నియామకం విషయంలో సుప్రీంకోర్టు కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధులకు కూడా చోటు కల్పించాల్సిందేనంటూ కేంద్ర న్యాయశాఖామంత్రిగా ఉన్న కిరణ్ రిజిజు పదేపదే వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. పైగా, సుప్రీంకోర్టును శాసించేందుకు ప్రధాని మోడీ సర్కారు ప్రయత్నిస్తుందనే విమర్శలు సైతం వచ్చాయి. అయినప్పటికీ ప్రధాని మోడీ లేదా కేంద్రం హోం మంత్రి అమిత్…

NationalTELANGANA

కరెంట్ బిల్లులు చెల్లించబోమంటున్న కర్ణాటక ప్రజలు.. తలలు పట్టుకుంటున్న విద్యుత్ సిబ్బంది

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించాక ఇంకా ప్రభుత్వాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయలేదు. అయినప్పటికీ ఆ రాష్ట్రంలోని కొన్ని గ్రామాల ప్రజలు విద్యుత్‌ బిల్లులు చెల్లించమంటున్నారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు తమ బిల్లులు చెల్లిస్తారని విద్యుత్‌ అధికారులకు చెబుతున్నారు. అయితే ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తామని కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. దీంతో కొప్పల్, చిత్రదుర్గ కలబురగి వంటి జిల్లాల్లోని పలు…

National

కర్ణాటకలో ముఖ్యమంత్రి గా సిద్ధరామయ్య

కర్ణాటకలో ముఖ్యమంత్రి గా సిద్ధరామయ్య దాదాపు ఖరారైనట్లే. ఈ విషయాన్ని కాంగ్రెస్ అంగీకరించింది. ఈ సాయంత్రంలోగా సిద్ధరామయ్య పేరును కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించనుంది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రేపు బెంగళూరులో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరులో ప్రమాణ స్వీకారానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. సిద్ధరామయ్యతో పాటు ముఖ్యమంత్రి పదవికి బలమైన అభ్యర్థిగా ఉన్న డికె శివకుమార్‌ను డిప్యూటీ సిఎంగా మరియు రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. అయితే 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో 135 సీట్లు…

National

భారతీయ వంటకాలపై ఎలాన్ మస్క్..! క్షణాల్లో ట్వీట్ వైరల్

భారతీయ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వీరిలో ఇప్పుడు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) చేరిపోయారు. దీంతో భారతీయ వంటకాలు మరోసారి హైలైట్ అయ్యాయి. ట్విట్టర్లో (Twitter) ఎలాన్ మస్క్ ఫాలోవర్ ఒకరు భారతీయ వంటకాలను (Indian food) మెచ్చుకుంటూ పోస్ట్ చేశారు. బటర్ చికెన్, నాన్, అన్నం ఉన్న ఫొటోలను పోస్ట్ చేస్తూ.. తనకు భారతీయ వంటకాలంటే చాలా ఇష్టమని కామెంట్ పెట్టాడు. దీనికి స్పందించిన ఎలాన్ మస్క్ ‘నిజం’ అంటూ రిప్లై…

National

గుజరాత్ ప్రయోగాలు చేస్తే గుండు కొట్టి పంపించిన కన్నడిగులు, 75లో !

బెంగళూరు/గుజరాత్/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇంతకాలం ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఏదో చెయ్యాలని అనుకున్న బీజేపీ హైకమాండ్ కు సినిమా కనపడింది. గుజరాత్ ప్రయోగాలు కర్ణాటకలో చెయ్యాలని ప్రయత్నించిన బీజేపీ నాయకులకు గుండు కొట్టిన కన్నడిగులు అందర్ని ఇంటికి పంపించేశారు. గుజరాత్ లో గత అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, బీజేపీ సీనియర్ నాయకులు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా అడ్డుకట్ట వేసిన బీజేపీ హైకమాండ్…