National

NationalTELANGANA

నిన్న అరెస్టైన ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చింది ఓవైసీయే: బండి సంజయ్

హైదరాబాద్: నగరం ఉగ్రవాదులకు షెల్టర్ జోన్ గా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. బాంబులపైన హైదరాబాద్ ప్రజలు నివసిస్తున్నారని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఎంఐఎం పార్టీ ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తోందని, నిన్న అరెస్టయిన సలీం ఒవైసీకి చెందిన డెక్కన్ మెడికల్ కాలేజీలో శాఖాధిపతిగా పనిచేస్తుండటమే ఇందుకు నిదర్శనమన్నారు. 2016 జులైలో అరెస్టయిన ఐసిస్ ఉగ్రవాదులకు బెయిల్ ఇప్పిస్తానని, న్యాయపోరాటం చేస్తానని ఒవైసీ చేసిన ప్రకటనను…

National

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్‌ నమోదయ్యే ఛాన్స్

    బెంగళూరు: 224 మంది సభ్యుల కర్ణాటక అసెంబ్లీకి ప్రస్తుతం జరుగుతున్న ఓటింగ్‌లో భాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వెలుపల పెద్ద క్యూలు దర్శనమిస్తున్నాయి. హోరాహోరీగా సాగుతున్న పోలింగ్‌లో భారీ ఓటింగ్‌ నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాకముందే ప్రజలు కేంద్రాల వెలుపల బారులు తీరారు. పోలింగ్‌ కేంద్రాలు ఓటర్లతో కళకళలాడగా, ఓటింగ్ ప్రక్రియను సమన్వయం చేయడంలో సిబ్బంది బిజీబిజీగా కనిపించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి…

NationalSPORTS

పెంపుడు జంతువులను తీసుకెళ్లే వారికి ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు

రైల్లో ప్రయాణాల్లో తమ పెంపుడు జంతువులను తీసుకెళ్లే వారికి ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని రైల్వే శాఖ యోచిస్తోంది. త్వరలోనే ఈ విధానం అమలులోకి రానుంది. దీంతో పెట్స్ లవర్స్ కి ఉపశమనం కలిగించినట్లైంది. పెంపుడు జంతువులను చాలా మంది ఇష్టపడతారు. ఇంట్లో మనుషులతో సమానంగా వాటిని ట్రీట్ చేశారు. వాటికేదైనా అయితే అస్సలు తట్టుకోలేరు. పొరపాటున పెంపుడు జంతువులు తప్పిపోతే కోలుకోవడానికి చాలా సమయం తీసుకుంటారు. అయితే ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు పెంపుడు…

NationalPOLITICS

కర్నాటకలో ఎన్నికల ప్రచారం జోరు

కర్నాటకలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వివిధ పార్టీ అభ్యర్థుల్లో క్రిమినల్స్ కూడా ఎక్కువమందే ఉన్నారు. వారి క్రిమినల్ హిస్టరీని దాచి పెట్టి వారికి మద్దతుగా అగ్రనాయకులు ప్రచారం కూడా బాగానే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాలు, బియ్యం దొంగతనం కేసులో శిక్ష పడ్డ ఓ బీజేపీ అభ్యర్థి తరపున ఈ రోజు ప్రధాని మోడీ ప్రచారం చేయాల్సి ఉండింది. అయితే హఠాత్తుగా ఆ సభను పార్టీ రద్దు చేసుకుంది. కలబురగి జిల్లాలోని చిత్తాపూర్ నియోజకవర్గంలో బీజేపీ…

National

బీజేపీకి బ్రహ్మానందం ప్రచారం.. కండిషన్స్ అప్లయ్‌

ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం మొదలు పెట్టారు. పోలింగ్ కి మరో ఐదురోజులే టైమ్ ఉండగా.. బ్రహ్మానందాన్ని ప్రచారంలోకి దించారు కమలనాథులు. చిక్ బళ్లాపూర్ లో ఆయన ప్రచారం చేపట్టారు. బీజేపీ అభ్యర్తి సుధాకర్ కి ఓటు వేయాలంటూ అభ్యర్థించారు. ఆ ఒక్క నియోజకవర్గమే..! బ్రహ్మానందం కేవలం చిక్ బళ్లాపూర్ నియోజకవర్గంలోనే ప్రచారం నిర్వహిస్తారని తెలుస్తోంది. నియోజకవర్గంలోని పుర, గిడగానహళ్లి, మంచెనహళ్లి, పోశెట్టిహళ్లి, కనగానగొప్ప, జోడి బొమ్మనహళ్లి తదితర…

National

మణిపూర్ లో ఆగని హింస.. బీజేపీ ఎమ్మెల్యేపై దాడి, పరిస్థితి విషమం

మణిపూర్ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయంతో ఆ రాష్ట్రం భగ్గున మండిపోతోంది. గిరిజనేతరులైన మైతీ వర్గానికి ఎస్టీ హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం.. కోర్టు కూడా ప్రభుత్వ నిర్ణయానికే మద్దతు తెలపడంతో మణిపూర్ లోని ఆదివాసులు తిరగబడ్డారు. బ్రాహ్మణులైన మైతీలను ఎస్టీల్లో చేర్చితే సహించేది లేదంటూ అనేక జిల్లాల్లో ఆందోళనలు ప్రారంభించారు. పోలీసులకు ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు రేగాయి. ఆదివాసులు ప్రార్థనా స్థలాలు, వాహనాలను తగలబెట్టారు. గురువారం నాటికి ఇంఫాల్‌, చురా చంద్‌పూర్‌, కంగ్‌పోక్కి ప్రాంతాల్లో…

National

అధ్యక్ష పదవికి రాజీనామా ఉపసంహరించుకున్న శరద్ పవార్

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధ్యక్ష పదవికి మూడు రోజుల క్రితం రాజీనామా చేసిన శరద్ పవార్ ఈ రోజు తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు.   కార్యకర్తల భావోద్వేగ నిరసనలు,తన రాజీనామాను పార్టీ అగ్రనేతలు తిరస్కరించిన కొన్ని గంటల తర్వాత… “అన్నింటిపై పునరాలోచన తర్వాత, నేను పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతానని ప్రకటిస్తున్నాను. నా మునుపటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాను” అని శరద్ పవార్ కొద్దిసేపటి క్రితం చెప్పారు.దీంతో మహారాష్ట్ర లో మూడు రోజుల నాటకానికి తెరపడింది. పవార్…

National

మిలటరీ, పారా మిలటరీ మధ్య ఘర్షణల్లో 200 మందిమృతి, 1800 మందికి గాయాలు

అంతంత మాత్రంగా సూడాన్ ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారిపోతోంది. సైన్యం, పారామిలిటరీల మధ్య జరుగుతున్న పోరులో దేశం అతలాకుతలమవుతోంది. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 200 మంది మృతి చెందగా 1800 మంది గాయాలపాలయ్యారు. ఇందులో అత్యధికులు పౌరులే ఉన్నారు.మరణించిన వారిలో పిల్లలు, స్త్రీలు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 2021 తిరుగుబాటులో అధికారాన్ని చేజిక్కించుకున్న సుడాన్ ఆర్మీ చీఫ్ అబ్దెల్ ఫత్తా అల్-బుర్హాన్, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (RSF)కు నాయకత్వం వహిస్తున్న మొహమ్మద్ హమ్దాన్…

National

సూడాన్ పోరులో 400 మందికి పైగా మరణం , 3,500 మందికి గాయాలు

సూడాన్ లో మిలటరీ, పారా మిలటరీకి మధ్య జరుగుతున్న సాయుధ పోరులో ఇప్పటి వరకు 413 మంది మరణిం చారని 3,500 మంది తీవ్ర గాయాలపాలయ్యారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది.   WHO ప్రతినిధి మార్గరెట్ హారిస్ UN విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ,ఈ పోరులో పిల్లలు అధిక మూల్యాన్ని చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. కనీసం తొమ్మిది మంది పిల్లలు మరణించగా,50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని ఆమె చెప్పారు. ఏప్రిల్ 15 నుండి ఇప్పటి వరకు…

National

భారత్ కి గుడ్ బై.. తిరిగి రాలేమంటున్న ప్రవాసులు

ప్రవాస భారతీయులంటే.. ఆరు నెలలకో, ఏడాదికో ఒకసారి భారత్ కి వచ్చి కుటుంబ సభ్యుల్ని, బంధువుల్ని చూసి వెళ్లేవారు. ఇదంతా గతం. ఇప్పుటి ఎన్నారైలు నేరుగా కుటుంబంతోనే ఫ్లైటెక్కుతున్నారు. అక్కడికి వెళ్లాక ఇక తిరిగి రాలేమంటున్నారు. భారత పౌరసత్వం వదిలేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. కుటుంబంతో సహా విదేశాల్లోనే స్థిరపడిపోవాలని ఆలోచిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇంకా చెప్పాలంటే ఏడాదికేడాది భారత్ ని వీడిపోతున్న ప్రవాసుల సంఖ్యలో గణనీయమైన మార్పు వస్తోంది. విద్య,…