National

National

గాంధీ వర్ధంతి సందర్భంగా సర్పంచ్ మెండ ఝాన్సీ అధ్యక్షతన ఘనంగా నివాళులు

ఈరోజు గాంధీ వర్ధంతి సందర్భంగా సర్పంచ్ మెండ ఝాన్సీ అధ్యక్షతన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సురేష్ బాబు గారు, హెల్త్ సూపర్వైజర్, ఏఎన్ఎం గారు, అంగన్వాడి టీచర్లు, ఆశ వర్కర్లు, వాలంటీర్లు పాల్గొనడం జరిగింది.

National

ఝార్ఖండ్ (Jharkhand)లోని ధన్‌బాద్‌లోని ప్రసిద్ధ డాక్టర్ సిసి హజ్రా ఆసుపత్రిలో శుక్రవారం అర్థరాత్రి జరిగిన అగ్నిప్రమాదం

ఝార్ఖండ్ (Jharkhand)లోని ధన్‌బాద్‌లోని ప్రసిద్ధ డాక్టర్ సిసి హజ్రా ఆసుపత్రిలో శుక్రవారం అర్థరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు మరణించినట్లు తెలుస్తోంది. మృతుల్లో డాక్టర్ వికాస్ హజారా, అతని భార్య డాక్టర్ ప్రేమా హజారా సహా వీరి పనిమనిషి, మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా మంటల్లో కాలిపోవడం వల్ల కాదు, విషపు పొగలు రావడంతో ఊపిరాడక చనిపోయారు. డాక్టర్ హజారాకు చెందిన రెండు పెంపుడు కుక్కలు కూడా ఊపిరాడక చనిపోయాయి. డాక్టర్ వికాస్ హజారా హాస్పిటల్ వ్యవస్థాపకుడు…

National

ప్రతీ సంవత్సరం బడ్జెట్ అనగానే అందరి ఆశలు

ప్రతీ సంవత్సరం బడ్జెట్ అనగానే అందరి ఆశలు, కళ్ళు దానిపైనే ఉంటాయి. ఎందుకంటే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దేశ బడ్జెట్ ప్రతి ఒక్కరి జీవనాన్ని ప్రభావితం చేస్తుంది. ఇక ఈ వార్షిక సంవత్సరం ఆదాయపు వ్యయపు పద్దులు ప్రవేశపెట్టడానికి ఆర్ధిక శాఖ మంత్రి సిద్దం అయ్యారు. బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి రంగం సిద్దమైపోయింది. దీనితో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సారి బడ్జెట్ లో వందే భారత్ రైళ్లకు పెద్ద ఎత్తున కేటాయింపులు ఉంటాయని తెలియడంతో ప్రజలకు…

National

లోకేష్`యువగళం`కోలాహలం,సంప్రదాయబద్ధంగా పయనం

భావోద్వేగాల నడుమ హైదరాబాద్ నివాసం నుంచి లోకేష్ పాదయాత్రకు(Yuvagalam) బయలు దేరారు. తల్లి భువనేశ్వరి, తండ్రి నారా చంద్రబాబునాయుడు(CBN), మామ బాలక్రిష్ణ ఆశీస్సులు తీసుకున్నారు. అత్తమామలు, తల్లీదండ్రులకు పాదాభివందనం చేసి ఆశీర్వాదాలను అందుకున్నారు. సతీమణి బ్రాహ్మణి వీరతిలకం దిద్ది, హారతి ఇచ్చి సాగనంపారు. అభిమానుల కోలాహలం నడుమ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద తాత ఎన్టీఆర్ కు నివాళర్పించారు. ఆ తరువాత షెడ్యూల్ ప్రకారం కడపకు లోకేష్ బయలు దేరారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం…

NationalTELANGANA

ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌ (Sri Sri Ravishankar)కు చెందిన హెలికాప్టర్ తమిళనాడులోని ఈరోడ్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ ఇక్కడ ల్యాండ్ చేశారు. ఈ చాపర్‌లో శ్రీశ్రీ రవిశంకర్‌తో పాటు మరో నలుగురు ఉన్నారు. ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌ మరో నలుగురు వ్యక్తులతో కలిసి హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత ప్రతికూల వాతావరణం కారణంగా ఆయన హెలికాప్టర్‌ను ఉదయం 10.40…

NationalTELANGANA

బీబీసీ డాక్యుమెంటరీపై రాహుల్ గాంధీ కామెంట్స్

2002 నాటి గుజరాత్ అల్లర్లపై (Gujarat 2002 riots) బీబీసీ (BBC) రూపొందించిన డాక్యుమెంటరీ (BBC documentary) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ డాక్యుమెంటరీని షేర్ చేయకూడదని కేంద్రం ట్విటర్, యూట్యూబ్ తదితర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో భాగంగా జమ్మూలో…

National

మెరుపుదాడులపై దిగ్విజయ్, జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు

భారత్ జోడో యాత్ర సందర్భంగా సర్టికల్ స్ట్రైక్స్ వ్యవహారాన్ని దిగ్విజయ్ సింగ్ (Jodo Congress) బయటకు తీశారు. ఆ రోజున జరిగిన సర్టికల్ స్ట్రైక్ (Surgical strike)సరే, భారత సైన్యంలోని 19 మంది చనిపోయిన విషయం ఏమిటని ప్రశ్నించారు. అప్పట్లోనూ దిగ్విజయ్ సింగ్ ఇదే వ్యాఖ్యలను చేశారు. ఇప్పుడు కూడా ఆ వ్యాఖ్యల మీద ఉన్నారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా సింగ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ స్పందించారు. భారత జవాన్లను…

NationalTELANGANA

మోడీకి US, UK మద్ధతు,BBC డాక్యుమెంటరీ పక్షపాతమని తేల్చివేత

భారత ప్రధాని నరేంద్ర మోడీ మీద రెండు సిరీస్ డాక్యుమెంటరీలను (BBC Modi) బీబీసీ ప్రసారం చేసింది. కానీ, ఇండియాలో(India) మాత్రం దాన్ని బ్యాన్ చేస్తూ సోషల్ మీడియా, మీడియా వేదికలపై ఆంక్షలు పెట్టారు. కేంద్రం విధించిన ఆంక్షలతో డాక్యుమెంటరీని భారత ప్రజలు చూడలేకపోయారు. కేరళలోని కొన్ని ప్రాంతాలు, హైదరాబాద్ లో ఆ డాక్యుమెంటరీని ప్రదర్శించడానికి కమ్యూనిస్ట్‌, కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగాలు ప్రయత్నం చేశాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రత్యేక స్క్రీన్లతో డాక్యుమెంటరీని ప్లే చేయాలని…

National

కొత్త పార్టీ ఎంట్రీతో.. త్రిపురలో బీజేపీకి చిక్కులు!

త్రిపురలో ఎన్నికల హడావుడి తారస్థాయికి చేరింది. ప్రజలను ఆకర్షించేందుకు పార్టీలన్నీ తమ అస్త్రాలకు పదును పెడుతున్నాయి. ఈక్రమంలో అధికార బీజేపీని ఓడించేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. బద్ధ శత్రువులగా ఉండే కాంగ్రెస్​, వామపక్షాలు కలిసిపోయాయి. బీజేపీకి ఇదొక చిక్కు అయితే.. వీటి మధ్య ఈ దఫా ఎన్నికల్లో కొత్త పార్టీ పోటీచేస్తుండటం మరో సమస్య! అదే.. కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ప్రద్యుత్​ బిక్రమ్​ మానిక్య దేబ్​ బర్మ స్థాపించిన టిప్రా మోతా పార్టీ. కొత్త పార్టీ…

National

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తదుపరి డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ విక్రమ్ దేవ్ దత్

సీనియర్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ విక్రమ్ దేవ్ దత్ (Vikram Dev Dutt) డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తదుపరి డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. శనివారం ఆయన పేరును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ప్రస్తుత డీజీసీఏ చీఫ్ అరుణ్ కుమార్ స్థానంలో ఆయన ఫిబ్రవరి 28న బాధ్యతలు స్వీకరించనున్నారు. విక్రమ్ దేవ్ దత్ 1993 బ్యాచ్ IAS అధికారి. ప్రస్తుతం ఎయిర్ ఇండియా అసెట్ హోల్డింగ్ చైర్మన్. 1989 బ్యాచ్ ఐఏఎస్ అయిన…