వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. కెంటకీలోని లూయిస్విల్లే డౌన్టౌన్లో స్లగ్గర్ ఫీల్డ్కు సమీపంలో సోమవారం జరిగిన కాల్పుల్లో ఐదుగురు వ్యక్తులు మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల అనంతరం గాయపడిన ఆరుగురిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో కాల్పులకు తెగబడిన దుండగుడు హతమైనట్లు పోలీసులు వెల్లడించారు. ఇకపై ఎలాంటి భయం లేదని చెప్పారు. ఈస్ట్ మెయిన్లోని ప్రజలు ప్రశాంతంగా ఉండవచ్చని సూచించారు. కాల్పులకు సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్గా…

