National

National

బీబీసీ డాక్యుమెంటరీ పై నిషేధం

ప్రధాని మోదీపై బీబీసీ (BBC)రూపొందించిన డాక్యుమెంటరీ (BBC documentary) ని షేర్ చేయకుండా బ్లాక్ చేయాలని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ట్విటర్, యూట్యూబ్ లను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆ డాక్యుమెంటరీ (BBC documentary) దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా, దేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉందని, అందువల్ల ఆ డాక్యుమెంటరీ (BBC documentary)ని షేర్ చేయడాన్ని బ్లాక్ చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో బీబీసీ రూపొందించిన ఆ డాక్యుమెంటరీ (BBC…

National

భారత సరిహద్దుకు అత్యంత సమీపంలో చైనా ‘డ్యామ్​’!

భారత సరిహద్దుల్లో చైనా చేసిన మరో పని తలనొప్పిగా మారింది! ఇండియా- నేపాల్​​ సరిహద్దుల్లో ఓ డ్యామ్​ను నిర్మిస్తోంది చైనా. ఇందుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు తాజాగా బయటకొచ్చాయి. డ్యామ్​.. ఎందుకు- ఎక్కడ? టిబెట్​లోని వాస్తవాధీన రేఖకు సమీపంలో.. ఇండియా- నేపాల్​తో సరిహద్దును పంచుకుంటోంది చైనా. కాగా.. ఈ ట్రై-జంక్షన్​కు కొంత దూరం నుంచి గంగా నదికి చెందిన ఉపనది మబ్జా జాంగ్బో ప్రవహిస్తోంది. ఈ మబ్జా జాంగ్బో.. నేపాల్​లోని కర్నాలీ నదిలో కలుస్తుంది. చివరికి అది…

National

ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ.. ఆగ్రహం వ్యక్తం చేసిన భారత ప్రభుత్వం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై, 2002 గుజరాత్ అల్లర్లపై అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ పట్ల భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అపఖ్యాతి పాలుచేసేందుకు రూపొందించిన, పక్షపాత ధోరణితో కూడిన ప్రచారమని ఆక్షేపించింది. వివరాలివే.. “దీన్ని గుర్తుంచుకోండి. ఇండియాలో ఇది ప్రసారం కాలేదు. కాబట్టి నేను దాని గురించి విన్నది, నా సహచరులు చూసి చెప్పిన దాన్ని బట్టి నేను వ్యాఖ్యానిస్తున్నా. అపకీర్తి పాలుచేసేందుకు ఈ కథనాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చిందని మేం…

National

పంజాబ్‌లో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ

పంజాబ్‌లో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్‌ నేత, పంజాబ్‌ మాజీ రాష్ట్ర ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్‌ సింగ్‌ బాదల్‌ (Manpreet Badal) బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ‘అంతర్గత కుమ్ములాటలు, ఫ్యాక్షనిజంతో నిండిన కాంగ్రెస్‌లో ఉండలేనంటూ.. మోదీ హయాంలో దేశం ప్రపంచంలో దౌత్యపరంగా, ఆర్థికంగా ఎంతో పురోగమించింది’ అని బీజేపీలో చేరాక బాదల్‌ వ్యాఖ్యానించారు. తన రాజీనామా లేఖను రాహుల్‌ గాంధీకి పంపించారు. మన్‌ప్రీత్ బాదల్ బుధవారం బీజేపీలో చేరారు. తన కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించే…

NationalTechnology

మైక్రోసాఫ్ట్‌ బిగ్‌ షాక్‌.. 11 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన

ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఏకంగా 11 వేల మంది ఉద్యోగస్తులను తొలగించేందుకు సిద్ధం అయ్యింది. ఈ మధ్య కాలంలోనే అమెజాన్, మెటా, ట్విట్టర్ ఇలా ప్రముఖ టెక్ కంపెనీలు లే ఆఫ్ చేపట్టడం ద్వారా భారీ ఎత్తున ఉద్యోగస్తులను తొలగించిన విషయం తెలిసిందే. నేటి నుండి మైక్రోసాఫ్ట్ కూడా అదే బాటలో నడవబోతోంది. హెచ్ ఆర్, ఇంజనీరింగ్ విభాగాల్లో అత్యధికంగా తొలగింపులు ఉంటాయని సంస్థ యొక్క ప్రతినిధులు పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభంతో పాటు…

National

జూన్ 2024 వరకు నడ్డానే బీజేపీ చీఫ్

BJP జాతీయ కార్యవర్గ కమిటీ సమావేశాలు ఢిల్లీలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్ష ఎన్నిక విషయమై బీజేపీ సీనియర్ నేత అమిత్ షా స్పష్టతనిచ్చారు. కొరోనా మహమ్మారి కారణంగా పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయలేకపోయామన్నారు. పార్టీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా కొనసాగుతారని ఢిల్లీలో జరుగుతున్న జాతీయ కార్యవర్గ కమిటీ సమావేశాల్లో బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. జూన్ 2024 వరకు నడ్డా అధ్యక్షత కొనసాగుతుందన్నారు. జాతీయ కార్యవర్గ…

National

బంగాళాఖాతంలో చిక్కుకున్న 600 మంది భక్తులు

గంగాసాగర్‌లో పుణ్యస్నానానికి వెళ్లిన భక్తులు బంగాళాఖాతంలో చిక్కుకున్నారు. అలా రాత్రంతా అక్కడే గడిపారు. వారిని పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మకర సంక్రాంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన దాదాపు 600 మంది భక్తులు (600 Devotees) 24 పరగణాల జిల్లా గంగాసాగర్‌లో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సమయంలో దట్టమైన పొగమంచు, గాలి కారణంగా బంగాళాఖాతంలో రెండు పడవలు కూడా బురదలో కూరుకుపోయాయి. దీంతో యాత్రికులు రాత్రంతా సముద్రంలో గడపాల్సి వచ్చింది. కాక్‌ద్వీప్‌లో ఈ ఘటన జరిగినట్లు అధికారులు…

NationalTELANGANA

సంక్రాంతికి కోటి 20 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చిన టీఎస్ఆర్టీసీ

జనవరి 11 నుంచి 14 వరకు సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కోటీ 20 లక్షల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చిందని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. రాష్ట్రం నుండి కోటి మంది ప్రయాణికులు జిల్లాల మీదుగా వెళ్లి..తిరిగి రావడానికి బస్సు సేవలను ఉపయోగించారని తెలిపారు. ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి TSRTC 3203 ప్రత్యేక బస్సులను నడిపిందని.. .వివిధ ప్రాంతాల నుండి తిరిగి నగరానికి చేరుకోవడానికి…

National

సైన్యంలో ‘అగ్నిపథ్’ ఓ గేమ్ చేంజర్: ప్రధాని నరేంద్ర మోదీ

సైన్యాన్ని బలోపేతం చేయటంలో అగ్నిపథ్ పథకం ఒక గేమ్ ఛేంజర్‌గా ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లకు సైన్యం మరింత సిద్ధంగా ఉండేందుకు అగ్నిపథ్ ఎంతో ముఖ్యమని అన్నారు. త్రివిధ దళాల్లో చేరుతున్న తొలి బ్యాచ్ అగ్నివీరులతో (Agniveers) ప్రధాని మోదీ సోమవారం (జనవరి 16) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కీలకమైన మైలు రాయిగా నిలిచే అగ్నిపథ్ పథకానికి మార్గదర్శకులుగా నిలిచారని తొలి బ్యాచ్ అగ్నివీరులను ప్రశంసించారు. మరింత యూత్‍ఫుల్‍గా..…

National

ప్రైవేట్ ఉద్యోగుల జీతాలు ఈ ఏడాది భారీగా పెరుతాయా.. ?

ప్రైవేట్ ఉద్యోగం చేసే వాళ్లకు ఎవరికైనా జీతం ఎప్పుడు పెరుగుతుందా అనే ఎదురుచూపు ఉంటుంది. ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగులను కాపాడుకోవడానికి ప్రతి ఏడాది ఉద్యోగుల జీతాలను పెంచుకుంటే పోతుంటాయి.అయితే 2023లో ప్రైవేట్ ఉద్యోగుల జీతాలు 9.8శాతం మేర పెరగుతాయనే వార్త ఉద్యోగుల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. కోర్న్ ఫెర్రీ సర్వేలో ఇలాంటి ఆసక్తికర విషయాలు ఉండగా.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొత్త ఏడాదిలో కంపెనీలు ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచడానికి ముందుకు రానున్నట్లు కోర్న్ ఫెర్రీ సర్వేలో…