పోలీసులు ఇచ్చే టీలో విషం ఉందన్న అఖిలేష్ యాదవ్..
ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మరోసారి వార్తల్లో నిలిచారు. పోలీసు ఉన్నతాధికారులు ఆయనకు టీ ఇస్తే తాగలేదు. ఆ టీలో విషం కలిపి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేయడంతో ప్రస్తుతం ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. సమాజ్వాదీ పార్టీకి చెందిన మీడియా వ్యవహారాలు పర్యవేక్షించడంతోపాటు, పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాను నిర్వహించే మనీష్ జగన్ అగర్వాల్ను నేడు పోలీసులు అరెస్ట్ చేశారు. మనీష్ అరెస్టును నిరసిస్తూ ఎస్పీ కార్యకర్తలు…

