కర్ణాటకలో ఐఏఎస్ వర్సెస్ ఐపీఎస్.. వ్యక్తిగత ఫొటో షేర్ చేస్తూ తీవ్ర ఆరోపణలు
కర్ణాటకలో ఇద్దరు సీనియర్ మహిళా ఐఏఎస్, ఐపీఎస్ అధికారిణుల మధ్య పోరు చర్చనీయాశంగా మారింది. చివరికి ఆ రాష్ట్ర హోంమంత్రి జోక్యం చేసుకునే వరకు చేరింది. ఇద్దరు ఉన్నతాధికారిణులపై చర్యలు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి హెచ్చరించారు. ఇంతకు ఏం జరిగింది..? ప్రభుత్వ ఆగ్రహానికి కారణం ఏమిటి..? ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి ప్రస్తుతం రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్గా ఉన్నారు. ఐపీఎస్ అధికారిణి డి.రూప మౌద్గిల్ కర్ణాటక హస్తకళల అభివృద్ధి సంస్థలో ఐజీపీ ఎండీగా పనిచేస్తున్నారు. రోహిణి…

