రైతుబంధు నిధుల విడుదలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్..
రైతుబంధు ఎప్పడిస్తారంటూ మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించిన నేపథ్యంలో వరుసగా మంత్రులు స్పందిస్తున్నారు. రైతుకు పెట్టుబడి 100 శాతం ఇస్తామని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం డిసెంబర్ ఆఖరిలో ఇచ్చేదని.. తాము కూడా అలాగే ఇస్తామని తెలిపారు. బీఆర్ఎస్ప్రతిపక్షంలోకి రాగానే రైతుబంధు ఎప్పుడు ఇస్తారని మాజీ మంత్రులు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా గజ్వేల్కు వచ్చిన పొన్నం ప్రభాకర్కు డీసీసీ అధ్యక్షుడు…

