TELANGANA

TELANGANA

తెలంగాణలో కరోనా కలకలం.. ఒకరు మృతి..

2020లో కరోనా వ్యాప్తి ప్రారంభమైంది. 2021లోనూ కొనసాగింది. వేలాదిమంది మృత్యువాత పడ్డారు. ప్రపంచాన్ని వణికించింది ఈ మహమ్మారి. వ్యాక్సినేషన్ ప్రారంభం కావడంతో వైరస్ వ్యాప్తి తగ్గింది. గత రెండు సంవత్సరాలుగా ఎటువంటి ప్రభావం చూపలేదు. కానీ తాజాగా కొత్త సబ్ వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉంది. దీంతో దేశవ్యాప్తంగా కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా కేరళలో మాత్రం పరిస్థితి విషమంగా ఉంది. అక్కడ వందలాది కేసులు నమోదవుతుండడంతో ప్రభుత్వం అలెర్ట్ అయింది.   తాజాగా తెలంగాణలో కేసులు…

TELANGANA

రేవంత్ రెడ్డి మరో సంచలనం.. ప్రజలకు మరో రెండు గ్యారెంటీలు..

తెలంగాణలో కాంగ్రెస్‌ను పదేళ్ల తర్వాత అధికారంలోకి తీసుకురావడంలో కీలకంగా మారాయి ఆరు గ్యారంటీలు. తుక్కుగూడ వేదికగా సోనియాగాంధీతో ఈ ఆరు గ్యారంటీలను ప్రకటింపజేసింది టీకాంగ్రెస్‌. మరోవైపు 42 పేజీల మేనిఫెస్టో, జాబ్‌ క్యాలెండర్‌ హామీ, పెన్షన్ల పెంపు, రుణమాఫీ, రైతుభరోసా లాంటి హామీలు అన్నివర్గాలను కాంగ్రెస్‌ వైపు మళ్లించాయి. దీంతో 64 సీట్లతో కాంగ్రెస్‌ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. సీఎంగా రేవంత్‌రెడ్డి, మరో 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలో ఆరు గ్యారంటీల అమలుపై…

TELANGANA

కేటీఆర్‌ సంచలన ట్వీట్‌..కాంగ్రెస్‌తో ఫైట్‌కు కేటీఆర్‌ సై.. వైరల్ వీడియో

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమితో ప్రతిపక్షానికి పరిమితమైన బీఆర్‌ఎస్‌.. అధికార కాంగ్రెస్‌తో సమరానికి సై అంటోంది. అసెంబ్లీ తొలి సమావేశంలోనే ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌.. తన ప్రసంగంలో దూకుడు ప్రదర్శించారు. గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే క్రమంలో అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. తమకు 57 మంది బలం ఉందని, మీకు 65 మంది ఉన్నారని, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని…

APTELANGANA

చలి గుప్పిట్లో తెలుగు రాష్ట్రాలు..

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. వచ్చే మూడు రోజులు చలి మరింత ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 2, 4 డిగ్రీలకు పడిపోయాయని వెల్లడించారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే ఉదయం పూట కురుస్తున్న పొగ మంచు కారణంగా వాహనదారులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

TELANGANA

రైతుబంధులో కీలక మార్పులు.. కండీషన్స్ అప్లై.. వీరే అర్హులు..!!

పథకంపై పునఃసమీక్ష.. ప్రభుత్వం రైతుబంధు పథకం పునఃసమీక్షిస్తోంది. ఈ యాసంగి సీజన్‌ వరకూ గతంలో మాదిరిగానే ఎలాంటి పరిమితులూ లేకుండా రైతుబంధు పంపిణీ చేసి.. వచ్చే వానాకాలం(ఖరీఫ్‌) సీజన్‌ నుంచి 10 ఎకరాల పరిమితితో రైతుభరోసా పేరిట నగదు పంపిణీ చేసేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు సమాచారం. పదికి మించి ఎన్ని ఎకరాలు ఉన్నా.. పది ఎకరాలకు మాత్రమే రైతుభరోసా ఇవ్వనున్నట్టు సమాచారం.   అంటే ఒక రైతుకు 15 ఎకరాలుంటే.. 10 ఎకరాలకే రైతు భరోసా వస్తుంది.…

TELANGANA

మేడారం కోసం ప్రత్యేక బస్సులు.. ఆర్టీసీ ప్లానింగ్ ఇదీ..

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరపై ఆర్టీసీ దృష్టి పెట్టింది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్‌ 9 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో తెలంగాణ మహిళలందరికీ ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు. దీంతో ఆర్టీసీ ఆదాయం బాగా తగ్గింది. ఈ క్రమంలో మరో రెండు నెలల్లో ప్రారంభం కానున్న మేడారం జాతర ద్వారా ఆదాయం పెంచుకోవాలని ఆర్టీసీ చూస్తోంది. ఈమేరకు ప్రణాళిక రూపొందిస్తోంది.  …

APTELANGANA

పవన్ కళ్యాణ్ పై బర్రెలక్క హాట్ కామెంట్స్..

ఏపీ సీఎం జగన్ ఆ తరహా ఆరోపణలు చేసేసరికి జనసేన సైతం స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. 2014 తెలంగాణ ఎన్నికలను ప్రస్తావిస్తూ.. అప్పుడు వైసీపీ నోటా కంటే తక్కువ ఓట్లు సాధించిన విషయాన్ని గుర్తుచేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఆ ఎన్నికల్లో వైసీపీ సాధించిన ఓట్లను గణాంకాలతో సహా జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో ఇరు పార్టీల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.   అయితే తాజాగా ఈ ఘటనపై బర్రెలక్క స్పందించారు. ఓ ప్రైవేటు…

TELANGANA

అంగన్వాడీలకు గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క..

కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే పనిలో నిమగ్నమైంది. తాజాగా, తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ధనసరి అనసూయ అలియాస్ సీతక్క బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఆ వెంటనే అంగన్వాడీ సిబ్బందికి తీపి కబురు చెప్పారు. అంగన్వాడీలకు సంబంధించిన ఫైల్ మీద మంత్రిగా తొలి సంతకం చేశారు సీతక్క.   ఇప్పటివరకు మినీ అంగన్వాడీలుగా ఉన్న కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందు కోసం రూపొందించిన…

TELANGANA

హెచ్ఎండీఏ జేసీగా ఆమ్రపాలి బాధ్యతలు..

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) జాయింట్ కమిషనర్‌గా ఆమ్రపాలి కాటా (Amrapali kata) శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. హెచ్ఎండీఏ కార్యదర్శి చంద్రయ్య, చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ బీ ప్రభాకర్ ఐఎఫ్ఎస్, ఎస్టేట్ ఆఫీసర్ కిషన్ రావు, ప్లానింగ్ డైరెక్టర్లు విద్యాధర్, శ్రీనివాస్, లీగల్ స్పెషలిస్ట్ యశస్వి సింగ్ లతోపాటు హెచ్ఎండీఏ అధికారులు, సిబ్బంది జాయింట్ కమిషనర్ ఆమ్రపాలిని కలిసి అభినందించారు.   ఈ సందర్భంగా ఆమ్రపాలి మాట్లాడుతూ.. హెచ్ఎండీఏ…

TELANGANA

ప్రజా భవన్ ముట్టడిస్తాం: రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అల్టిమేటం!!

తెలంగాణ రాష్ట్రంలో సీఎంగా బాధ్యతలు చేపట్టి దూకుడుగా పరిపాలన సాగించాలని ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డికి ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా ఆటోడ్రైవర్లతో నిరసన సెగ తగులుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో భాగంగా అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసేందుకు నిర్ణయించిన రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణాన్ని సౌకర్యాన్ని అందిస్తున్నారు.   ఈ క్రమంలో ఆటోలకు ఊహించని విధంగా గిరాకీ తగ్గింది. దీంతో ఈ పథకం ప్రారంభం…