TELANGANA

TELANGANA

తెలంగాణ కాంగ్రెస్‌లో ఎన్నికల జోరు- టికెట్ల `స్టీరింగ్`వారి చేతుల్లో..!!

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గరపడుతోంది. అక్టోబర్/నవంబర్‌లల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. డిసెంబర్ నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావొచ్చు. ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి అన్ని పార్టీలు కసరత్తు సాగిస్తోన్నాయి. అధికార భారత్ రాష్ట్ర సమితి, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ.. సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని నిలుపుకోవడంతో పాటు మిగిలిన…

APTELANGANA

శంషాబాద్ విమానాశ్రయం కొత్త నిబంధనలు: తెలుసుకుని వెళ్లండి

హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలతోపాటు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కూడా భద్రతా అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. విమానాశ్రయం ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా సంస్థలు సెక్యూరిటీని అప్రమత్తం చేశారు. విదేశాలకు చదువుల నిమిత్తం వెళ్లే స్టూడెంట్స్ తమ వెంట సెండాఫ్ ఇవ్వడానికి ముగ్గురిని మాత్రమే తీసుకురావాలని.. ఎక్కువ మందిని తీసుకువస్తే లోపలికి రావడానికి పర్మిషన్ ఉండదని అదికారులు స్పష్టం చేశారు. సీఐఎస్ఎఫ్ స్పెషల్ పోలీస్, స్టేట్ పోలీసులను నిఘా…

TELANGANA

త్వరలోనే పీఆర్సీ, మధ్యంతరభృతి..

తెలంగాణ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. త్వరలోనే వేతన సవరణ కమిషన్(PRC)తో పాటు మధ్యంతర భృతిని కూడా ఇస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యోగుల సంఘాల జేఏసీ ఛైర్మన్ రాజేందర్, ప్రధాన కార్యదర్శి మమత, టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గురువారం సీఎం కేసీఆర్ ను కలిశారు. ఉద్యోఘా సంఘాల నేతల మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా సీఎం కలిశారు. ఈ సందర్భం ఉద్యోగ సంఘాల నాయకులు తమ సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగులకు రెండో…

TELANGANA

తెలంగాణకు చెందిన ఓ సినీ నిర్మాతతో కలిసి వెళ్లి జయసుధ బీజేపీ చేరికల కమిటీతో భేటీ

తెలంగాణ బీజేపీ సారధిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి పార్టీలోకి చేరికలను పెంచడంపై ఫోకస్ పెట్టారు. బీజేపీలోకి చేరేందుకు ఆసక్తి ఉన్న నాయకులతో ఆయన భేటీ అయి చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలిశారు. దీంతో జయసుధ బీజేపీలో చేరతారనే ప్రచారం మొదలైంది. ఇదే విషయంపై కిషన్ రెడ్డితో ఆమె చర్చించారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి…

TELANGANA

హైదరాబాద్‌లో భార్యను హత్య చేసిన కేసులో యువజన కాంగ్రెస్ నాయకుడిని పోలీసులు అరెస్ట్

హైదరాబాద్‌లో భార్యను హత్య చేసిన కేసులో యువజన కాంగ్రెస్ నాయకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వల్లభరెడ్డి అనే యూత్ కాంగ్రెస్ నేత తన భార్య లహరి(27) గుండెపోటుతో మరణించిందని పోలీసులకు తప్పుడు సమాచారం అందించాడు. అయితే విచారణలో ఆమె మృతికి కారణం భర్తే అని పోలీసులు అరెస్ట్ చేశారు. జులై 14న తలకు గాయమైన లహరిని ఆమె భర్త వల్లభరెడ్డి కార్పోరేట్ ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఇంటి పనులు చేస్తుండగా లహరి…

TELANGANA

ఉస్మానియా ఆస్పత్రిని కూల్చడానికి ప్రభుత్వం నిర్ణయం

ఉస్మానియా ఆస్పత్రిని (Demolish Osmania Hospital )కూల్చడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కోర్టులో ఉన్నప్పటికీ రోగులకు సురక్షితం కాదని మంత్రుల కమిటీ తేల్చింది. కొత్త భవనాన్ని నిర్మించడానికి రూ. 200కోట్లతో్ అంచనాలను తయారు చేశారు. ఆ ప్రకారం ఉస్మానియాకు కొత్త రూపం ఇవ్వాలని తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌లో, కొత్త ఆసుపత్రి భవనాన్ని నిర్మించడానికి ప్రస్తుతం ఉన్న నిర్మాణాన్ని కూల్చివేయాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. ఉస్మానియా ఆస్పత్రిని…

TELANGANA

కేసీఆర్ మొద్దు నిద్ర

తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇండ్లను ఖాళీ చేసి వెళ్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే పదుల సంఖ్యలో మరణాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రజల్ని పట్టించుకోవట్లేదని ఆరోపణలు చేస్తున్నారు విపక్ష నేతలు. తాజాగా వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్ పై ఘాటుగా విమర్శలు చేశారు. ఊర్లు మునిగినా,ఇండ్లు కూలినా,జనం వరదల్లో పడి కొట్టుకుపోతున్నా..దొర గడీ దాటి…

TELANGANA

గత కొన్ని రోజులుగా తెలంగాణ(Telangana) బీజేపీ(BJP)లో ఆసక్తికర పరిణామాలు చోటు

గత కొన్ని రోజులుగా తెలంగాణ(Telangana) బీజేపీ(BJP)లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇటీవల బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్న భువనగిరి నేత జిట్టా బాలకృష్ణ రెడ్డి(Jitta Balakrishna Reddy)ని సస్పెండ్ చేసింది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. పార్టీ వ్యతిరేక కార్యక్రమలకు పాల్పడుతున్నాడు అంటూ బాలకృష్ణని సస్పెండ్ చేశారు. అయితే అకారణంగా తెలంగాణ ఉద్యమకారుడినైనా తనను బీజేపీ నుండి సస్పెండ్ చేశారని, ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పాలని బీజేపీకి రెండు రోజులు సమయం ఇవ్వగా బీజేపీ…

TELANGANA

కిషన్ రెడ్డి నేడు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణాలో నడుస్తున్న ముక్కోణపు ప్రేమకథ

తెలంగాణ(Telangana) బీజేపీ(BJP) అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేడు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణాలో నడుస్తున్న ముక్కోణపు ప్రేమకథ గురించి చెప్పారు. అలాగే బీజేపీ పార్టీ గురించి, ఇటీవల బీజేపీ నుంచి సస్పెండ్ చేసిన జిట్టా బాలకృష్ణ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించారు.   కిషన్ రెడ్డి(Kishan Reddy) మాట్లాడుతూ.. తెలంగాణలో అనేక రకాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు బీజేపీ గురించి. తెలంగాణ గ్రామీణ యువతలో బీజేపీకి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. కేసిఆర్ అవినీతి, అహంకార, కుటుంబ…

TELANGANA

ఎలక్షన్స్(Elections) దగ్గర పడుతున్న తరుణంలో తెలంగాణ(Telangana)లో పార్టీల పోరు

ఎలక్షన్స్(Elections) దగ్గర పడుతున్న తరుణంలో తెలంగాణ(Telangana)లో పార్టీల పోరు రోజు రోజుకి పెరుగుతుంది. ఒక పార్టీపై ఇంకో పార్టీ విమర్శలు చేస్తున్నారు. యాత్రలు, ర్యాలీలు, సభలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తెలంగాణలో బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) లు ఎలాగైనా ఈ సారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తుంటే BRS వచ్చేసారి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. ఇటీవలే బీజేపీకి కొత్త అధ్యక్షులని ప్రకటించి జోష్ ఇచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు తర్వాత తెలంగాణలో సైలెంట్ అయిపోయిన…