TELANGANA

TELANGANA

తెలంగాణ నూతన డీజీపీగా రవి గుప్తా..

అంజనీకుమార్‌పై సస్పెన్షన్ వేటుపడిన నేపథ్యంలో తెలంగాణ నూతన డీజీపీగా రవిగుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రవిగుప్తా 1990 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన విజిలెన్స్ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంతో పాటు ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.   కాగా, ఇప్పటి వరకు తెలంగాణ డీజీపీగా ఉన్న అంజనీకుమార్‌పై కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు…

TELANGANA

ఎన్నికల ఫలితాలపై బాధలేదంటూ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆశించిన విధంగా రాలేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చిన నేపథ్యంలో ఆయన తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజలు ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తామని కేటీఆర్ తెలిపారు. ప్రజా తీర్పును శిరసావహిస్తూ.. కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేశారని చెప్పారు.   పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసినప్పటికీ ఆశించిన ఫలితం…

TELANGANA

గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు..సోమవారమే ప్రమాణ స్వీకారోత్సవం..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం కాంగ్రెస్ నేతల బృందం ఆదివారం రాత్రి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసింది. సోమవారం శాసనసభాపక్ష సమావేశం అనంతరం సీఎల్పీ నేత పేరును నివేదిస్తామని నేతలు చెప్పినట్లు సమాచారం. గవర్నర్‌ను కలిసిన వారిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తోపాటు ఆ పార్టీ ముఖ్య నేతలు డీకే శివకుమార్, మాణిక్ రావ్ ఠాక్రే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు రవి తదితరులు ఉన్నారు.   సోమవారం సాయంత్రం…

TELANGANA

కేసీఆర్ కు వైఎస్ షర్మిల అదిరిపోయే గిఫ్ట్!!

మరికొద్ది గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి . ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ఒక ఆసక్తికరమైన గిఫ్ట్ ను పంపుతున్నానని ప్రకటించారు. కెసిఆర్ ఇక ఇంటికి వెళ్ళే సమయం వచ్చిందంటూ ప్యాకప్ చేసుకునేందుకు బై బై కేసీఆర్ అని రాసి ఉన్న ఒక ట్రాలీ బాక్స్ ను పంపుతున్నట్టుగా ఆమె వెల్లడించారు.   తెలంగాణ రాష్ట్ర ప్రజలు బై బై కేసీఆర్…

TELANGANA

వైన్స్, రెస్టారెంట్లు బంద్, 144 సెక్షన్: ఎన్నికల ఫలితాల వేళ తెలంగాణ వ్యాప్తంగా ఆంక్షలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఆదివారం (డిసెంబర్ 3) ఉదయం 6 నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకూ రాష్ట్ర వ్యాప్తంగా నిషేధాజ్ఞలు అమల్లో ఉండనున్నాయి. శాంతిభద్రతల నిర్వహణలో భాగంగా నగరంలో 3వ తేదీ ఉదయం 6 నుంచి 4వ తేది ఉదయం 6 గంటల వరకూ మద్యం విక్రయాలు నిలిపివేయాలని, రెస్టారెంట్లు, క్లబ్బులు, స్టార్‌ హోటళ్లకూ ఈ నిబంధన వర్తిసుందని అధికారులు ఆదేశించారు.   రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న వేళ…

TELANGANA

సీఆర్ఎఫ్ ఆధీనంలోకి నాగార్జున సాగర్.. కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం..

తెలుగు రాష్ట్రాల మధ్య వివాదంగా మారిన నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణా జలాల విడుదల విషయంలో నవంబర్ 28న ముందు ఉన్న పరిస్థితి కొనసాగించాలని కేంద్రహోంశాఖ కార్యదర్శి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు అంగీకారం తెలిపాయి. డ్యామ్ నిర్వహణను కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు అప్పగించడంతోపాటు సీఆర్పీఎఫ్ దళాల పర్యవేక్షణకు అప్పగించాలని కేంద్రం ప్రతిపాదించింది.   నాగార్జునసాగర్‌ వివాదంపై కేంద్ర హోంశాఖ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది.…

TELANGANA

ప్రభుత్వ నిధుల మళ్లింపు.. ఈసీకి ఫిర్యాదు చేయనున్న టీ కాంగ్రెస్ నేతలు. !

ఎన్నికల అధికారులను తెలంగాణ కాంగ్రెస్ నేతలు రేపు కలవనున్నారు. ప్రభుత్వ నిధుల మళ్లింపుపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయనున్నారు. ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డ తర్వాత బీఆర్ఎస్ సర్కార్ నిర్ణయాలపై అనుమానాలున్నాయని ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనేక సందేహాలను లేవనెత్తారు.   కమీషన్‌ల కోసం రైతు బంధు నిధులను కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని.. కేసీఆర్ ఓటమి భయంతో నిధులను ఇతర మార్గాలకు మళ్లిస్తున్నారని ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అసైన్డ్ భూములను.. ఇతరుల పేర్ల మీదకు మార్చి..…

TELANGANA

ఘర్షణలు, నిరసన సెగలతో వరంగల్ జిల్లాలో ఉత్కంఠగా సాగిన పోలింగ్..!!

వరంగల్ జిల్లావ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ చిన్న చిన్న సంఘటనలు మినహాయించి ప్రశాంతంగా కొనసాగింది. వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట, నర్సంపేట నియోజకవర్గాల కంటే, అతి ముఖ్యమైన నియోజకవర్గంగా భావించిన వరంగల్ తూర్పు నియోజకవర్గం లో అత్యల్పంగా పోలింగ్ నమోదయింది. ఇది రాజకీయ పార్టీలకు నిరాశను కలిగించింది. తగ్గిన పోలింగ్ శాతం ఎవరికి ప్లస్ గా మారుతుంది అన్న చర్చ జరుగుతుంది.         ఇదిలా ఉంటే ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు…

TELANGANA

తెలంగాణలో ముగిసిన పోలింగ్..

తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియగా.. మిగతా నియోజకవర్గాల్లో 5 గంటలకు పోలింగ్ ముగిసింది. చిన్న చిన్న సంఘటనలు మినహాయిస్తే పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం హైదరాబాద్ లో అత్యల్పంగా పోలింగ్ నమోదు అయింది. మధ్యాహ్నం 3 గంటల వరకు సుమారు 51.89 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 69.33 శాతంగా నమోదు అయింది. కాసేపట్లో ఎగ్జిట్…

TELANGANA

తెలంగాణ ఎన్నికలపై ఏపీలో బెట్టింగ్..

కెసిఆర్ రెండుచోట్ల గెలుస్తారా? లేకుంటే ఓడిపోతారా? ఆయనకు లభించే మెజారిటీ ఎంత? అన్నదానిపై ఎక్కువగా బ్యాటింగ్ జరుగుతోంది. అటు కేటీఆర్ పోటీ చేస్తున్న సిరిసిల్లలో మెజారిటీ పై సైతం పెద్ద ఎత్తున నగదు జమ చేసి మరి బెట్టింగ్ కొడుతున్నారు. గ్రేటర్ లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? జనసేన ఎన్ని స్థానాల్లో గెలుపు పొందుతుంది? అన్న అంశాలపై సైతం బెట్టింగ్ జోరుగా సాగుతోంది. రాయలసీమతో పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ బెట్టింగ్ పర్వం బలంగా…