కాంగ్రెస్ ప్రభుత్వాల వల్లే సింగరేణి నష్టాలు.. హస్తానికి ఓటు వేస్తే 60 ఏళ్లు వెనక్కి : సీఎం కేసీఆర్ .
సింగరేణి (Singareni) సంస్థకు నష్టాలు రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని, బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో తీసుకున్న నిర్ణయాల వల్లే సింగరేణి లాభాలబాట పట్టిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఆదివారం బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ఆ సభలో మాట్లాడుతూ.. “సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి.. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు దానిని కేంద్రం చేతిలో పెట్టాయి. సింగరేణిలో 49 శాతం వాటా కేంద్రానికి అప్పగించి.. సంస్థ నష్టాల్లో…

