TELANGANA

TELANGANA

తెలంగాణ ఎన్నికల్లో ఇప్పటివరకూ పోలైన 9174 ఓట్లు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సాధారణ పోలింగ్ కు సమయం దగ్గరపడుతోంది. ఈ నెల 30న తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 35 వేల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. అయితే ఆ లోపే వృద్ధులు, దివ్యాంగ ఓటర్ల నుంచి ఓట్లను ఇంటి నుంచే సేకరిస్తున్నారు. ఎన్నికల సంఘం నియమించిన సిబ్బంది ఆయా వర్గాల ఓట్లను వారి ఇళ్లకు వెళ్లి పోలింగ్ చేయిస్తున్నారు. ఇలా ఇప్పటివరకూ మొత్తం 9174 ఓట్ల పోలింగ్ జరిగినట్లు ఈసీ వర్గాలు…

TELANGANA

కరీంనగర్‌లో కమల వికాసం.. విజయం దిశగా సంజయ్‌..!

తెలంగాణలో ఉద్యమాల గడ్డ కరీంనగర్‌. మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదిన కరీంనగర్‌లో ఈసారి కాషాయ జెండా ఎగురబోతోందా.. ఇప్పటి వరకు మూడుసార్లు గెలిచిన మంత్రి గంగుల కమలాకర్‌కు షాక్‌ తప్పదా.. అంటే అవుననే అంటున్నారు ఓటర్లు. ఎన్నికల్లో ప్రజల నాడి తెలుసుకునేందుకు ఇప్పటికే వివిధ సంస్థలు ప్రీపోల్‌ సర్వేలు చేశాయి. తాజాగా ఎగ్జిట్‌ పోల్‌ సర్వే ఫలితాలు ప్రకటించేందుకు సర్వేలు చేస్తున్నాయి. పోలింగ్‌కు రెండు రోజుల ముందు పోల్‌ మేనేజ్‌మెంట్‌ చేసేవారే విజయం సాధిస్తారని తెలుస్తోంది.…

TELANGANA

ఓటరు పల్స్‌ : హుజూరాబాద్‌లో ‘ఈటల’ గట్టి పోటీ.. ఓట్లు చీల్చనున్న కాంగ్రెస్‌ అభ్యర్థి!

తెలంగాణలో కీలకమైన మరో నియోజకవర్గం హుజూరాబాద్‌. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే, బీజేపీ ఎలక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ సొంత నియోజకవర్గం ఇది. ఇక్కడి నుంచి ఈటల రాజేందర్‌ ఇప్పట ఇరకు ఏడుసార్లు విజయం సాధించారు. ప్రతీసారి తిరుగులేని మెజారిటీ సాధిస్తూ.. హుజూరాబాద్‌ గడ్డ.. ఈటల అడ్డా అన్నట్లుగా మార్చేశారు. కానీ, మూడు దశాబ్దాల తర్వాత ఇక్కడ ఈటల గట్టి పోటీ ఎదుక్కొంటున్నారు. బీజేపీ తరఫున హుజూరాబాగ్, గజ్వేల్‌ నుంచి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్‌…

TELANGANA

సిరిసిల్లలో కేటీఆర్ ఓటమి తప్పదా? షాకింగ్ పరిణామాలు..

భవిష్యత్తు ముఖ్యమంత్రిగా కేటీఆర్ వార్తల్లో పదేపదే నిలుస్తున్నారు. రాజకీయ జీవితం ఏ శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రారంభించారో.. అక్కడే ఓటమిపాలై శాసనసభకు మాత్రమే కాకుండా భవిష్యత్తు ముఖ్యమంత్రి పదవికి దూరమవుతారా? అంటే.. ఆ పరిస్థితికి అవకాశం ఉందని అక్కడి క్షేత్రస్థాయి విషయాలను బట్టి తెలుస్తోంది. కేటీఆర్ మొదటి సారి కేకే మహేందర్ రెడ్డి ని 177 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో ఓడించారు. ఈసారి కేకే మహేందర్ రెడ్డి అలాంటి ఓటమినే కేటీఆర్ కు రుచి చూపించినా ఆశ్చర్యపోవాల్సిన…

TELANGANA

తెలంగాణలో 3డీ టెక్నాలజీ ఆలయం.. .

తెలంగాణలో సిద్ధిపేట జిల్లా బూరుగుపల్లి శివారులోని వినాయకుడి ఆలయం గురించి ఇప్పుడంతా చర్చ సాగుతోంది. మిగతా ఆలయాలకంటే ఈ ఆలయంను భిన్నంగా నిర్మించారు. అంతేకాకుండా ప్రపపంచంలో ఎక్కడా లేని విధంగా 3డి టెక్నాలిజీని ఉపయోగించడం విశేషం. సింప్లిఫోర్జ్ క్రియేషన్ తో కలిసి అప్సుజా ఇన్ ఫ్రాటెక్ ఆధ్వర్యంలో దీనిని నిర్మంచారు. దీనికి శ్రీపాద కార్య సిద్దేశ్వరస్వామి దేవస్థానం గా పేరు పెట్టారు. వేద పండితుల ఆధ్వర్యంలో ఈ మంగళవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. దీంతో…

TELANGANA

రసమయి నోటిదురుసు.. ఏకంగా కేసీఆర్‌పై బుతుపురాణం..!

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్, బీఆర్‌ఎస్‌ మానకొండూర్‌ ఎమ్మెల్యే అభ్యర్థి రసమయి బాలకిషన్‌ మరో వివాదంలో ఇరుక్కున్నారు. రసమయికి మొదటి నుంచి నోటి దురుసు ఎక్కువే. దళితుడు కావడంతో ఎవరిని ఏమన్నా చెల్లుతుందనే భావనతో మాట్లాడుతుంటారు రసమయి. గతంలో సొంతపార్టీ ప్రజాప్రతినిధులను తీవ్ర పదజాలంతో దూషిస్తూ దొరికిపోయారు. తర్వాత క్షమాపణ చెప్పడం బాలకిషన్‌కు అలవాటే. అయితే ఇప్పటి వరకు ఒకెత్తు.. ఇప్పుడు ఒకెత్తు.. ఈసారి ఏకంగా తన పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల…

TELANGANA

సిట్టింగుల స్థానంలో క్లాస్‌మేట్‌లకు టికెట్‌ ఇప్పించుకున్న కేటీఆర్‌.. ఆ దోస్తులు ఎవరో తెలుసా?

‘తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగులందరికీ టికెట్‌ ఇస్తాం.. అందరూ నియోజకవర్గాల్లో ఉండే పనిచేసుకోండి. వారుసులెవరికీ ఈసారి టికెట్లు ఇవ్వం.. మీరే బరిలో నిలవాలి’’ ఇవీ ఆరు నెలల క్రితం సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు. ఈ క్రమంలో అందరికంటే ముందే కేసీఆర్‌ టికెట్లు ప్రకటించారు. కానీ, పది మంది సిట్టింగులను మార్చారు. ఈ పది మందిలో రెండు సిట్టింగ్‌ స్థానాల్లో కేటీఆర్‌ తన క్లాస్‌మేట్లకు టికెట్లు ఇప్పించుకున్నారు. ఈ విసయం చాలా మందికి తెలియదు. మరి టిక్కెట్లు…

TELANGANA

ఎక్కడ తగ్గాలో తెలుసుకున్న కేటీఆర్‌..

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు..’ ఇది పవర్‌ స్టార్, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సినిమాలోని పంచ్‌ డైలాగ్‌. జీవిత సత్యం కూడా ఇదే.. అధికారం ఉందికదా అని అహంకారం ప్రదర్శించినా.. పెత్తనం చెలాయించినా.. ఓవరాక్షన్‌ చేసినా మొదటికే మోసం వస్తుంది. ఈ జీవిత సత్యం తెలంగాణ ముఖ్యమైన మంత్రి కేటీఆర్‌కు ఆలస్యంగా బోధపడింది. వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గడంతో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్, ఆయన తనకుడు కేటీఆర్‌కు అహంకారం నెత్తికెక్కిందన్న…

NationalTELANGANA

కీలక హామీలు ప్రకటించిన అమిత్ షా..

ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఐదో స్థానానికి చేరిందని కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా (Amit Shah) తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్‍‌పల్లి, కోరుట్ల, జనగామ జిల్లాలో ఆయన సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభల్లో అమిత్ షా ప్రసంగిస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు.   Advertisement వల్లభాయ్ పటేల్ కృషి వల్లే రజాకార్ల నుంచి తెలంగాణ విముక్తి పొందిందని అమిత్…

TELANGANA

బీజేపీకి షాక్: హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన బాబు మోహన్ తనయుడు

హైదరాబాద్: అందోల్‌ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ మంత్రి బాబు మోహన్‌కు ఆయన తనయుడు షాక్ ఇచ్చాడు. బాబుమోహన్ కొడుకు ఉదయ్ బాబుతో పాటు జోగిపేట మున్సిపల్ ప్రెసిడెంట్ సాయి కృష్ణ, అందోల్ బీజేపీ మండల ప్రెసిడెంట్ నవీన్ ముదిరాజ్, చౌటకూర్ మండల ప్రెసిడెంట్ శేఖర్, ఇతర బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి బీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణను అన్ని…