TELANGANA

TELANGANA

మరో మూసిలా గండిపేట చెరువు

విశ్వనగరంగా చెప్పుకుంటున్న హైదరాబాద్‌ దాహారి‍్త తీర్చే జల వనరుల్లో గండిపేట సరస్సు – ఉస్మాన్‌సాగర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. 46 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న గండిపేట సరసుస క్రమంగా మురికి కూపంగా మారుతోంది. చెత్తచెదారం నిర్వహణలో అధికారులు విఫలం కావడంతో కాలుష్యమయమవుతోంది. సరస్సు పరిసర గ్రామాలు పరీవాహక ప్రాంతాలలో నిర్మాణాలు చేపట్టడంతో నీటి వనరులోని ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్ ఆక్రమణలతో నిండిపోయాయి. గండిపేట సరస్సు చుట్టూ చెత్తను డంపింగ్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌…

TELANGANA

అక్కడి నుండే పోటీ.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్లారిటీ!

తెలంగాణలో ఎన్నికల సమరం మోగనుంది.. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల బరిలో నిలిచే వారు ఒక్కొక్కరిగా క్లారిటీ ఇస్తూ ప్రజల్లోకి వస్తున్నారు.. ఇక తాజాగా తాను పోటీ చేసే స్థానంపై మాజీ ఐపీఎస్ అధికారి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. ఈయన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నట్టు క్లారిటీ ఇచ్చేసారు. తాజాగా కాగజ్నగర్ టౌన్ లోని బిఎస్పి కార్యాలయంలో…

TELANGANA

గ్రామీణ, పట్టణ ప్రయాణికుల ఆర్థికభారం తగ్గించేందుకు ‘టి-9 టికెట్‌’

టీఎస్ఆర్టీసీ ఇటీవల ప్రవేశపెట్టిన టీ9 టిక్కెట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. గ్రామీణ, పట్టణ ప్రయాణికుల ఆర్థికభారం తగ్గించేందుకు ‘టి-9 టికెట్‌’ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్‌ సిటిజన్ల కోసం తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన టీ9 టిక్కెట్ ప్రయాణ సమయాన్ని పెంచింది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వర్తిస్తుందని టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. గతంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఈ…

TELANGANA

హైదరాబాద్ నగరంతోపాటు పలు జిల్లాల్లోనూ వర్షాలు

నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పనుల నిమిత్తం బయటకు వెళ్లిన ప్రజలు తడిసిముద్దయ్యారు. రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కార్యాలయాల్లో విధులు ముగించుకుని ఇళ్లకు చేరుకునే ఉద్యోగులు వర్షంతో ఇబ్బందులు పడ్డారు. వర్షంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, హైదర్‌నగర్, కుత్బుల్లాపూర్, సూరారం, జీడిమెట్ల, బాలానగర్, సుచిత్ర, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, సికింద్రాబాద్, చిలకలగూడ, మారేడ్‌పల్లి,…

TELANGANA

రాజకీయ కోణంలో ఉస్మానియా ఆసుపత్రి పరిశీలనకు రాలేదు- గవర్నర్ తమిళి సై

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సోమవారం హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రిని ఆకస్మికంగా పరిశీలించారు. ఉస్మానియా ఆస్పత్రిపై సచివాలయంలో మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహిస్తుండగానే, గవర్నర్‌ ఉస్మానియా ఆస్పత్రిని పరిశీలించడం చర్చనీయాంశమైంది. ఉస్మానియా పురాతన భవనమైన కులి కుతుబ్ షా బ్లాక్ ను గవర్నర్ పరిశీలించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ ఆసుపత్రిలో ఎలా ఉంటున్నారని ప్రశ్నించారు. ఉస్మానియా ఆసుపత్రిని పరిశీలించి రోగుల ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నట్లు గవర్నర్ తమిళి సై చెప్పారు. అయితే గవర్నర్ ఉస్మానియా…

TELANGANA

పుస్తెలమ్మి పోటీ చేసిన బండి సంజయ్ కు వంద కోట్లు ఎలా వచ్చాయ్- రఘునందర్ రావు

తెలంగాణ బీజేపీలో అగ్గిరాజుకుంది. అసంతృప్త నేతలు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. తాజాగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్లుగా పార్టీ కోసం తాను కష్టపడుతుంటే పట్టించుకోవడం లేదంటూ విమర్శలు చేశారు. దిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన…బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో బీజేపీ అధ్యక్షుడు మారిపోతున్నాడంటూ వస్తున్న వార్తలు వాస్తవమేనన్నారు. మునుగోడు ఉపఎన్నికలో వంద కోట్లు ఖర్చు…

TELANGANA

అంతర్గత కుమ్ములాటలతో అట్టడుగుకు బీజేపీ, పుంజుకున్న కాంగ్రెస్!

తెలంగాణ బీజేపీలో జరుగుతున్న సంఘటనలు “లాస్ట్ ది ప్లాట్” అనడానికి సరిగ్గా సరిపోయాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాటల దృష్ట్యా, ఇప్పటివరకు అంతగా లెక్కల్లో లేని కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా బీజేపీని అధిగమించినట్లు భావిస్తున్నారు. కేసీఆర్‌కు, బీఆర్‌ఎస్‌కు గట్టి పోటీదారుగా కాంగ్రెస్ మారిందంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్ వర్గంలోని నేతలకు మధ్య విభేదాలు తలెత్తాయి. నేతల…

TELANGANA

రాహుల్ గాంధీ కారులో భట్టి, పార్టీలోని పరిస్థితులపై మంతనాలు!

ఖమ్మం సభ సక్సెస్ అయిందని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. సభ నిర్వహణ పైన రాహుల్ గాంధీ ఖుషీ అయ్యారని నేతలు తెలిపారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేసిన భట్టి విక్రమార్కను భజం తట్టి అభినందించారు రాహుల్ గాంధీ. లక్షలాది మంది ప్రజల సమక్షంలో పార్టీ తరపున భట్టిని సత్కరించారు. కీపిట్ అప్ అంటూ ప్రశంసించారు. భట్టి విక్రమార్క పాదయాత్రలో ప్రస్తావించిన అంశాలను పరిశీలించి మేనిఫెస్టోలో అవకాశం కల్పించాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఆదివారం రాత్రి సభ ముగిసిన…

TELANGANA

మహిళా వీసీని దుర్భాషలాడిన గోషామహల్ బీఆర్ఎస్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్

హైదరాబాద్: మహిళా వీసీని దుర్భాషలాడిన గోషామహల్ బీఆర్ఎస్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోఠి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ విజ్జులత ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీనివాస్‌పై సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత గురువారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జులై 1న తనకు తాను సామాజిక కార్యకర్తనంటూ.. బాలికలకు ఉచిత విద్య, స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నట్లు గడ్డం శ్రీనివాస్ యాదవ్ వీసీకి తెలిపారు. తనకు…

TELANGANA

హైదరాబాద్: తెలంగాణలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో మార్పులు

హైదరాబాద్: తెలంగాణలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులు వెల్లడించారు. కొత్త సీట్లకు అనుమతి, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో జాప్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో శుక్రవారం, శనివారం ధృవపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్ అవకాశం కల్పించారు. జులై 9న ఇంజినీరింగ్ అభ్యర్థుల ధృవపత్రాలు పరిశీలిస్తారు. వెబ్ ఆప్షన్లు నమోదు గడువు జులై 12 వరకు పొడిగించారు. జులై 16న తొలి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు…