TELANGANA

TELANGANA

తాసిల్దార్ కార్యాలయం ఎదుట కుల వృత్తుల వారు ధర్నా కుల. ఆదాయ. నివాస ధ్రువపత్రాల జాప్యం పై నిరసన

  అల్లాదుర్గం. తెలంగాణ ప్రభుత్వం బిసి కుల వృత్తుల వారికి ఆర్థిక సహాయం అందించే పథకంపై సర్టిఫికెట్ల జారీ లో జాప్యంపై లబ్ధిదారులు తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. వీరికి అల్లాదుర్గం అసెంబ్లీ నియోజకవర్గ సాధన సమితి అధ్యక్షులు కంచరి బ్రహ్మం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కుల వృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించడం మంచి ఉద్దేశమైనా. ధ్రువపత్రాలు అందించడంలో తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది. జాప్యం వల్ల…

APTELANGANA

మరో భారీ షాక్- సిలబస్ కోతలపై నిరసన-తమ పేర్లూ తీసేయాలని 33 మంది నిపుణుల లేఖ..

నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT)కి మరో షాక్ తగిలింది. కరోనా తర్వాత విద్యార్ధులపై భారం తగ్గిస్తున్నామన్న పేరుతో పాఠ్యపుస్తకాల్లో చరిత్రలో పలు పాఠ్యాంశాలను తొలగిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న NCERTకి నిపుణులు, సలహాదారులు వరుసగా షాక్ లు ఇస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా మరో 33మంది నిపుణులు పాఠ్యపుస్తకాల్లో తమ పేర్లు కూడా తీసేయాలని కోరుతూ NCERTకి ఓ సంచలన లేఖ రాశారు. టెక్స్ట్‌బుక్ డెవలప్‌మెంట్ కమిటీలో వివిధ దశల్లో భాగస్వాములుగా ఉన్న…

HealthTELANGANA

స్ట్రోక్ తప్పించుకోవాలంటే, మందులతో కాదు- వైద్య నిపుణుల కీలక సూచనలు..!

ఈ మధ్య కాలంలో స్ట్రోక్స్ పెరిగాయి. వయసుతో సంబంధం లేకుండా ప్రాణాలు తీస్తున్నాయి. ఇందుకు వైద్యులు అనేక కారణాలను విశ్లేషిస్తున్నారు. అయితే, సమస్య వచ్చిన సమయంలో చికిత్స.మందులు ఎంత అవసరమో..సమస్య రాకుండా ఉండేలా ముందస్తు జాగ్రత్తలు బిగ్ రిలీఫ్ ఇస్తాయంటున్నారు వైద్యులు. ఒత్తిడి.. నిద్ర లేమి..శారీరక శ్రమ లేకపోవటం..ఆహారపు అలవాట్లు..ఇలా ఎన్నో కారణాలు సైలెంట్ గా ప్రాణాలను హరించటానికి కారణాలు అవుతున్నాయి. ఈమధ్య కాలంలో ఆరోగ్య సమస్యలు చాలా పెరిగిపోయాయి. కరోనా తరువాత గుండె, నాడీ వ్యవస్థకు…

TELANGANA

ఆడబిడ్డలకు అన్నలా,తమ్ముడిలా,మేనమామలా,కంటికి రెప్పలా మారిన కేసిఆర్.!సీఎంపై కవిత ప్రశంసలు.!

హైదరాబాద్: మహిళా సంక్షేమానికి సీఎం చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఆడబిడ్డలను పైకి తీసుకురావాలన్న తపనతో సీఎం చంద్రశేఖర్ రావు అనేక పథకాలను అమలు చేస్తూ దేశానికి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. మహిళా సంక్షేమానికి ఏ రాష్ట్రం చేయనన్ని పనులు తెలంగాణలో జరుగుతున్నాయని వివరించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జరుపుకుంటున్న మహిళా సంక్షేమ దినోత్సవం సందర్భంగా మహిళాలోకానికి కవిత శుభాకాంక్షలు తెలిపారు. షీ టీమ్…

TELANGANA

ఏపీ ఈఏపీసెట్ ఫలితాల తేదీ ఖరారు: ఎప్పుడంటే?, ఇలా తెలుసుకోండి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్(AP EAPCET) 2023 ఫలితాలు విడుదలకు తేదీ ఖరారైంది. జూన్ 14న ఉదయం 10.30 గంటలకు ఫలితాలు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేస్తారని ఏపీ ఈఏపీసెట్ ఛైర్మన్, అనంతపురం జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ జీ రంగ జనార్థన, కన్వీనర్ ప్రొఫెసర్ సీ శోభా బిందు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ ఫలితాల విడుదల కార్యక్రమానికి ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామల…

TELANGANA

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ నిందితులకు హైకోర్టులో ఊరట

హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట లభించింది. ప్రశ్నపత్రాల లీకేజీ నిందితులు గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇవ్వడంపై టీఎస్‌పీఎస్సీ అప్పీలు దాఖలు చేసింది. నలుగురు నిందితులను పరీక్షకు అనుమతించాలంటూ శుక్రవారం సింగిల్ జడ్జీ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ కమిషన్ అధికారులు హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శనివారం న్యాయమూర్తి ఇంట్లో జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి, జస్టిస్ ఎన్ రాజేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ…

NationalTELANGANA

ఖమ్మంలో అమిత్ షాతో బీజేపీ బలప్రదర్శన అందుకేనా?

ఖమ్మం రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పొంగులేటి బీజేపీలో చేరక పోవడం వెనక స్థానికంగా బీజేపీకి బలం లేదని కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే ఇదే సమయంలో ఖమ్మంలో బీజేపీ తన సత్తా చాటాలని, బలప్రదర్శనకు రెడీ అయింది. ఖమ్మం వేదికగా బీజేపీ అగ్రనేత అమిత్ షా తో బహిరంగ సభను నిర్వహించి ఖమ్మంలో కమలం పార్టీ తన బలాన్ని…

NationalTELANGANA

కేసీఆర్ పేరును పచ్చబొట్టుగా వేయించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్. కేసీఆర్ పేరును ఆమె తన చేతికి పచ్చబొట్టుగా వేయించుకున్నారు. గిరిజన యోధుడు కొమురంభీమ్ సహచరుని వారసులు ఆ పచ్చబొట్టు వేయడం విశేషం. జూన్ 2 నుంచి జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని బంజారాభవన్‌లో నిర్వహించిన గిరిజన సంస్కృతి ఉత్సవాల్లో మంత్రి సత్యవతి…

APTELANGANA

నిర్మలా సీతారామన్ అల్లుడు ఏం చేస్తారో తెలుసా?

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌(Niramala Sitharaman), పరకాల ప్రభాకర్‌ దంపతుల కుమార్తె వాజ్ఞ్మయి(Vangmayi) వివాహం ప్రతీక్‌(Pratik Doshi)తో నిరాడంబరంగా జరిగింది. స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో బెంగళూరులోని మంత్రి ఇంట్లోనే పెళ్లి వేడుక పూర్తిచేశారు. రాజకీయ ప్రముఖులు, వీవీఐపీలు ఎవరూ హాజరుకాలేదు. పెళ్లి సమాచారాన్ని సీతారామన్‌ కుటుంబసభ్యులు అధికారికంగా బయటకి వెల్లడించలేదు. అయితే వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిర్మలా సీతారామన్‌ అల్లుడు ప్రతీక్‌ వివరాల కోసం నెటిజన్లు గూగుల్‌లో…

APTELANGANA

వైసీపీలోకి ముద్రగడ చేరిక లాంఛనమేనా ? కాకినాడ ఎంపీగా పోటీపై చర్చలు !

కాపు ఉద్యమాలతో తెరపైకి వచ్చిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గత టీడీపీ ప్రభుత్వంలో తుని రైలు దహనం ఘటనతో చర్చల్లోకి వచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఆయన్ను టార్గెట్ చేయడంతో విపక్ష వైసీపీని ఆశ్రయించి మద్దతు పొందారు. ఇది కాస్తా ఎన్నికల్లో సైతం వైసీపీకి అనుకూలంగా పనిచేసింది. దీంతో గోదావరి జిల్లాల్లో వైసీపీ మెజారిటీ సీట్లను గెల్చుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక మౌనంగా ఉంటున్న ముద్రగడ తాజాగా కీలక ప్రకటన చేశారు.…