హైదరాబాద్: తెలంగాణలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్లో మార్పులు
హైదరాబాద్: తెలంగాణలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్లో మార్పులు చేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులు వెల్లడించారు. కొత్త సీట్లకు అనుమతి, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో జాప్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో శుక్రవారం, శనివారం ధృవపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్ అవకాశం కల్పించారు. జులై 9న ఇంజినీరింగ్ అభ్యర్థుల ధృవపత్రాలు పరిశీలిస్తారు. వెబ్ ఆప్షన్లు నమోదు గడువు జులై 12 వరకు పొడిగించారు. జులై 16న తొలి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు…

