షిర్డీ వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్- సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు: తేదీలు ఇవే
సికింద్రాబాద్: సాయినాథుణ్ని దర్శించుకోవడానికి షిర్డీ వెళ్లే భక్తుల రద్దీ భారీగా ఉంటోంది. రోజువారీ రైళ్లల్లో వెయిటింగ్ లిస్ట్ పెరిగిపోతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సికింద్రాబాద్ నుంచి నాగర్సోల్కు ఆరు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తూ దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ సీహెచ్ రాకేష్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 14, 21, 28 తేదీల్లో సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్…

