TELANGANA

TELANGANA

హైదరాబాద్‌ శివార్లలోని ఓ వైన్‌షాప్‌లో దోపిడీ దొంగలు బీభత్సం

హైదరాబాద్‌ శివార్లలోని ఓ వైన్‌షాప్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఉద్యోగుల నుంచి రూ.2 లక్షలకుపైగా నగదు ఎత్తుకెళ్లేందుకు దుండగులు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉద్దమర్రిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. దుకాణం మూసి నగదుతో బయటకు వెళ్తుండగా ముగ్గురు ముసుగు ధరించిన వ్యక్తులు క్యాషియర్‌తో పాటు ఇతర ఉద్యోగులపై దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైన్ షాపు ఉద్యోగులపై దుండగులు…

TELANGANA

తెలంగాణకు త్వరలో మరో మూడు వందే భారత్ రైళ్లు

ఇటీవలే సికింద్రాబాద్- విశాఖపట్నం వందేభారత్ రైలు (Vande Bharat Train) ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ రైలుకు ప్రయాణికుల నుండి అనూహ్య రీతిలో ఆదరణ లభిస్తోంది. కాగా హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాలకు త్వరలో మరో మూడు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. కాచిగూడ- బెంగళూరు, సికింద్రాబాద్- తిరుపతి, సికింద్రాబాద్-పూణే మధ్య మూడు రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. మరో మూడు ఇలాంటి రైళ్లను త్వరలో ప్రారంభించాలని భారతీయ రైల్వే యోచిస్తోందని అధికారులు తెలిపారు. అదనపు…

APTELANGANA

భీమారం లో పిచ్చి కుక్కల స్వైర విహారం..

4 H D మంచిర్యాల జిల్లా// భీమారం లో పిచ్చి కుక్కల స్వైర విహారం.. పిల్లలు ఇంటి ముంగిట ఆడుకుంటుండగా పిచ్చి కుక్కల దాడి.. దాడిలో తీవ్రంగా గాయపడ్డ నలుగురు పిల్లలు.. పాక లో కట్టి ఉంచిన పశువులను కూడా వదలని పిచ్చి కుక్కలు.. పనులకు వెళ్లకుండా కర్రలతో ఇంటికి కాపలా కాస్తున్న పలు కాలనీవాసులు.. రెండురోజులుగా విన్నవించినా పట్టించుకోని సర్పంచ్ మరియు అధికారులు..

TELANGANA

తెలంగాణ ఎన్నికల్లో జనసేన, టీడీపీ పొత్తుపై `వీర విజేత` ఆశలు

`ఉట్టికి ఎక్కలేనమ్మ, ఆకాశానికి ఎగిరినట్టు..` అనే సామెత. దాన్ని జనసేనకు వర్తింప చేస్తే అతికినట్టు సరిపోతుంది. ఎనిమిదేళ్లుగా ఆ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో (Pawan Varaahi) ఆ పార్టీకి ఇప్పటి వరకు గుర్తింపు లేదు. పైగా ఆ పార్టీ సింబల్(Symbol) తిరుపతి లోక్ సభ ఎన్నికల్లోనే స్వతంత్రులకు కేటాయించారు. ఇటీవల ఎన్నికల కమిషన్ ప్రకటించిన గుర్తింపు కలిగిన పార్టీల జాబితాలో జనసేన లేదు. ఈసారి ఆ పార్టీకి కామన్ సింబల్ ఉంటుందన్న…

TELANGANAWorld

హైదరాబాద్ వచ్చిన చేగువేరా కూతురు, మనుమరాలు

విప్లవ యోధుడు చేగువేరా (Cheguvera) కుమార్తె డాక్టర్ అలైదా గువేరా హైదరాబాద్ వచ్చారు. ఆమెతో పాటు చేగువేరా మనవరాలు ప్రొఫెసర్ ఎస్తెఫానియా గువేరా కూడా నగరానికి వచ్చారు. వీరికి అధికారులు, ప్రజాసంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు రవీంద్రభారతిలో జరిగే ‘క్యూబా సంఘీభావ సభ’కు అలైదా గువేరా, ఎస్తెఫానియా ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ సమావేశంలో బీజేపీ, ఎంఐఎం మినహా ఇతర పార్టీల నేతలు పాల్గొన్నారు. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా చాలా…

TELANGANA

హెచ్ జి ఇన్ ఫ్రా ఇంజనీరింగ్ లిమిటెడ్ వారి 21 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్

4 H D మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్ లోని ఠాగూర్ స్టేడియంలో హెచ్ జి ఇన్ ఫ్రా ఇంజనీరింగ్ లిమిటెడ్ వారి 21 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు.. ఇందులో కంపెనీకి చెందిన టెక్నికల్ టీం, అడ్మినిస్ట్రేషన్ టీం జట్ల మధ్య మ్యాచ్ నిర్వహించారు.. మానసికొల్లాసానికి క్రీడాలెంతగానో తోడ్పాడతాయని ప్రాజెక్ట్ హెడ్ వికే సింగ్ ఈ సందర్బంగా తెలిపారు.. జిల్లా లో హెచ్ జి ఇన్ ఫ్రా ఆధ్వర్యంలో…

TELANGANA

రేవంత్ తో కోమటిరెడ్డి భేటీ.. గొడవ సర్ధుమనిగినట్లేనా?

మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి దూరం అవ్వబోతున్నాడు అనే ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కోమటిరెడ్డి మాట్లాడడం.. ఆయనకు పార్టీ అధినాయకత్వం షోకాజ్ నోటీసు పంపించడం కూడా అయింది. కోమటిరెడ్డి ప్రస్తుతం ఎంపీగా ఉన్న కారణంగా ఆయనని వదులుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. అందుకే ఆయన బుజ్జగించి పార్టీలో కొనసాగేలా చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు చేపట్టిన మాణిక్రావు ఠాక్రే ఫోన్ చేసిన…

TELANGANA

ప్రజల ఆరోగ్యమే మా లక్ష్యం రామకృష్ణ మిషన్.

రామ కృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్య శాల రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం స్థానిక దేవిపట్నం మండలం పోతవరం గ్రామం లో వైద్య శిబిరం నిర్వహించినట్లు రామ కృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి వినిశ్చలానందజీ మహారాజ్ తెలియ చేసినారు. అలాగే నీరుపేద కుటుంబాల వృద్దులకు, వితంతువులకు, వికలాంగులకు, సుమారు వంద మందికి రగ్గులు, లుంగీలను, రామ కృష్ణ మఠం మేనేజర్ స్వామి రఘువీరా నందజీ మహారాజ్ పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరం…

TELANGANA

కిష్టంపేట్ గ్రామంలో సెంట్రల్ టస్సర్ రీసెర్చ్ మరియు,ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, సెంట్రల్ సిల్క్ బోర్డు ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వర్క్ షాప్

4 H D మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని కిష్టంపేట్ గ్రామంలో సెంట్రల్ టస్సర్ రీసెర్చ్ మరియు,ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, సెంట్రల్ సిల్క్ బోర్డు ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ( పట్టు పరిశ్రమపై అవగాహన సదస్సు) ఏర్పాటు చేశారు..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ భారతి హొలీ కెరీ, ఐటిడిఎ పిఓ హాజరయ్యారు..ఈ ప్రాంత రైతులు వ్యవసాయం పైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయంగా దసలి పట్టు పెంపకంపై మొగ్గు చూపాలని కలెక్టర్ పేర్కొన్నారు..ఈ ప్రాంతంలో దట్టమైన…

TELANGANA

నెరవేరని ఎన్టీఆర్ కల ‘భారతదేశం’, ఆ దిశగా కేసీఆర్ BRS !

‘భారతదేశం’ అనే పార్టీ స్థాపించి, దేశాన్నీ ఏలాలని ఎన్టీఆర్ (NTR) సంకల్పం చేసుకున్నారు. ఆయన జీవితంలో అదొక్కటే సాధించలేక పోయారు. ఆ ఒక్కటి తప్ప ఆన్నీ సాధించిన మేరునగధీరుడు ఆయన. ఎన్టీఆర్ ప్రధానమంత్రి కాలేకపోయినప్పటికీ వి.పి. సింగ్ ను ప్రధానిగా(PM) కూర్చోబెట్టడం ద్వారా కింగ్ మేకర్ అయ్యారు. దేశంలోని కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఒక్కచోటకు చేర్చి, నేషనల్ ఫ్రంట్ స్థాపించి దానికి కన్వీనర్ గా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఏడు సంవత్సరాలపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సంచలన…