TELANGANA

TELANGANA

ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలి సాగు భూములకు పట్టాలివ్వాలి

పార్వతీపురం మన్యం జిల్లా : గిరిజనల భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం(అయార్ల) జిల్లా కార్యదర్శి పి .సంఘం కోరారు. ఈ మేరకు శుక్రవారం పార్వతీపురం మండలం, పెదమరికి పంచాయితి , శివం దొరవలస, చినమరికి గ్రామాలకు చెందిన పలువురు గిరిజనులుతో ఆయన స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు . అనంతరం తహశీల్దార్ శివన్నారాయన కు వినతిపత్రం అందజేసి సమస్యను వివరించారు. పట్టణానికి చెందిన మాజీ…

TELANGANA

ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని కేసీఆర్ కు సర్వే

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సంవత్సరం కూడా టైమ్ లేదు. దీంతో ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు వ్యూహాలు రచించే పనిలో పడ్డాయి. ఇక.. అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది. రెండు సార్లు గెలిచి సత్తా చాటిన సీఎం కేసీఆర్.. ముచ్చటగా మూడోసారి కూడా గెలవాలన్న ఆశతో ఉన్నారు. మూడోసారి కూడా గెలిచి తెలంగాణలో చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోవాలని సీఎం…

TELANGANA

అన్‌ స్టాపబుల్‌ ఐటీ దాడులతో 24 గంటలుగా ఉక్కిరి బిక్కిరి మంత్రి మల్లారెడ్డి

అన్‌ స్టాపబుల్‌ ఐటీ దాడులతో 24 గంటలుగా ఉక్కిరి బిక్కిరి అవుతున్న తెలంగాణ కార్మిక శాఖ మంత్రి, వ్యాపారవేత్త, మెడికల్, ఇంజినీరింగ్‌ కళాశాలల అధినేత, రియల్టర్‌ చేమకూర మల్లారెడ్డి తన మార్కు డ్రామాకు తెర తీశారు. ఐటీ దాడుల సమయంలో అక్రమాల గుట్టు రట్టు కాకుండా తన ఫోన్‌ను ఓ గోనె సంచిలో వేసి పక్కింట్లో దాచిన మల్లారెడ్డి.. దాడుల మొదలై 24 గంటలు గడిచిన తర్వాత కొత్త డ్రామా షురూ చేశారని తెలుస్తోంది. మంగళవారమంతా ఎవరితోనూ…

TELANGANA

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి…KCR Survey సర్వేలో షాకింగ్‌ ఫలితాలు

  తెలంగాణలో మూడోసారి అధికారం చేపట్టి.. 2024లో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీని దెబ్బకొట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈమేరకు ఇప్పటికే వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే అక్టోబర్‌ 5న టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చారు. తాజాగా 2023లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిపెట్టారు. ఈ మేరకు అంతర్గత సర్వేల ఆధారంగా పార్టీ పరిస్థితి, నేతల పనితీరును అంచనా వేస్తున్నారు. ఈమేరకు ఇప్పటినుంచే ప్రణాళిక రచిస్తున్నారు. పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలను డేంజర్‌ కేటగిరీగా పరగణించారు. ఈ…

TELANGANA

తనపై పోటీ చేయాలంటూ ఎంపీ అర్వింద్ ఎమ్మెల్సీ కవితకు సవాల్

తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. బీజేపీ ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దీంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అయితే బీజేపీ ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి జరిగిన ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సీరియస్ అయ్యారు. ఘటనకు సంబంధించిన నివేదిక వెంటనే సమర్పించాల్సిందిగా డీజీపీని ఆదేశించారు. ఎంపీ కుటుంబ సభ్యులను బెదిరించడం…ఇంట్లో వస్తువులను పగులగొట్టడం చట్టవిరుద్దమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు తమ ఇంటిపై దాడి చేయడాంపై ఎంపి అర్వింద్ తల్లి…

TELANGANA

మునుగోడు ఉపఎన్నిక ఫలితమే కేసీఆర్ నిర్ణయాన్ని మార్చేసిందని కామెంట్లు

2018 సంవత్సరంలో ముందస్తు ఎన్నికలపై తెగ ఆసక్తి చూపిన సీఎం కేసీఆర్ ఇప్పుడు మాత్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. మునుగోడు ఉపఎన్నిక ఫలితమే కేసీఆర్ నిర్ణయాన్ని మార్చేసిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. భారీ స్థాయిలో ఖర్చు చేసినా కేవలం పదివేల మెజారిటీ రావడంతో కేసీఆర్ ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్ పై ప్రజల్లో ఒకింత వ్యతిరేకత ఉంది. అదే సమయంలో…

POLITICSTELANGANA

కేసీఆర్‌ ఈటలతో రహస్య చర్చలు..?

బీజేపీతో ఢీ అంటే ఢీ అని కొట్లాడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. ఎక్కడా తగ్గేదే లే అంటున్నారు. ఒకవైపు రాష్ట్రంలో ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్నా.. కమలం నేతలకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. త్వరలో కాషాయ దళానికి మరో ఝలక్‌ కూడా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. KCR- Etela Rajender ఈటల బహిష్కరణతో టీఆర్‌ఎస్‌కు భారీ నష్టం.. తెలంగాణ ఉద్యమకారుడు, సౌమ్యుడిగా పేరు ఉన్న ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌లో నంబర్‌ 2 గా ఎదిగారు. తన పార్టీలో…

NationalPOLITICSTELANGANA

ఎక్కడైతే కేంద్ర సంస్థలు దాడులు చేస్తాయో అక్కడే ధర్నాలు…..సీఎం కేసీఆర్..

తెలంగాణభవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షత టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నకున్నట్లుగానే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయన్న కేసీఆర్, పార్టీ మారాలని ఒత్తిళ్లు చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. తన కూతురు ఎమ్మెల్సీ కవితను కూడా పార్టీ మారాలని అడిగినట్లు కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో ఎట్టిపరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలు జరగబోవని తేల్చి చెప్పారు. తన కూతురుని బీజేపీలో చేరాలని ఒత్తిడి చేశారంటూ వ్యాఖ్యానించారు. దీనికంటే ఘోరం ఏమైనా ఉంటుందా అని…

TELANGANA

హైదరాబాద్ లో జనాలకి 5జి అందుబాటులోకి తెచ్చిన జియో

దేశవ్యాప్తంగా హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, వారణాసి, కోల్ కతా, ఢిల్లీ, నట్వారాలకు జియో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చేశాయి. ఈ పట్టణాల్లోని కస్టమర్లు మై జియో యాప్ లో ఇన్విటేషన్ వచ్చిన తర్వాత 5జీ నెట్ వర్క్ కు కనెక్ట్ కావడానికి అవకాశం ఉందని జియో ప్రకటించింది. పోటీ సంస్థ భారతీ ఎయిర్ టెల్ సైతం హైదరాబాద్ పరిధిలో 5జీ సేవలను ఇప్పటికే ప్రారంభించడం తెలిసిందే. ఎంపిక చేసిన కస్టమర్లకు అన్ లిమిటెడ్ గా 5జీ…

TELANGANA

తెలంగాణలో భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ

తెలంగాణలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సోమవారం ముగిసింది. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూరులో రాహుల్ గాంధీ ముగింపు సభ నిర్వహించారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణలో చాలా మందితో మాట్లాడానని, రాష్ట్ర ప్రజలను కలవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈరోజు భారత్ జోడో యాత్ర తెలంగాణ నుంచి మహారాష్ట్రలో ప్రవేశిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం విడిచి వెళ్లడం బాధాకరం – రాహుల్ తెలంగాణలో రాహుల్ చేపట్టిన భారత్ జోడో…