TELANGANA

TELANGANA

భూములు తీసుకోవద్దంటూ పొలాల్లో సకినాలు చేస్తూ నిరసన

రింగ్ రోడ్డు కోసం తమ భూములు తీసుకోవద్దంటూ వరంగల్ జిల్లాలో కొందరు రైతులు సకినాలతో నిరసన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వరంగల్ నగరానికి కొత్త మాస్టర్ ప్లాన్‌ను రూపొందించింది. ఇందులో భాగంగా వరంగల్ మండలంలోని ఆరెపల్లి – పైడిపల్లి – కొత్తపేట గ్రామాల మీదుగా 200 అడుగుల ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసింది.   ఈ ప్రతిపాదన కారణంగా తాము విలువైన భూములను కోల్పోతున్నామంటూ వరంగల్ మండలం ఆరెపల్లి శివారులోని పంట భూముల్లో…

TELANGANA

కౌశిక్ రెడ్డి తీరుపై KCR, KTR స్పందించాలి: మంత్రి పొన్నం..

కరీంనగర్‌ జిల్లా సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడేందుకు లేచిన సమయంలో కౌశిక్ రెడ్డి ఆయనకు అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. దీంతో వివాదం మొదలైంది. నువ్వు ఏ పార్టీ అంటూ సంజయ్ కుమార్‌ను కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. ఇద్దరు ఎమ్మెల్యేలు పరస్పరం నెట్టుకున్నారు.   గొడవ ఎక్కువవ్వడంతో కౌశిక్ రెడ్డిని…

TELANGANA

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదు..

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయనపై మూడు కేసులు నమోదు చేశారు. పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పై దురుసుగా ప్రవర్తించారని.. అయన పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన 1 టౌన్ పోలీసులు. జిల్లా కలక్టరేట్ లో అధికారిక సమావేశంలో గందరగోళం సృష్టించి, మీటింగ్ ని పక్కదారి పట్టించారని…

TELANGANA

వారికి రైతు భరోసా బంద్.. కలెక్టర్లకు తేల్చి చెప్పిన సీఎం రేవంత్..

సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్ల లాంటివన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల వంటి కీలకమైన నాలుగు సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.   డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరిగింది. తెలంగాణలోని వ్యవసాయ యోగ్యమైన భూములకు…

TELANGANA

కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ.. ఏసీబీ విచారణకు సంబంధించిన విషయాలపై ఆరా..

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఆయన తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఎర్రవల్లి ఫాంహౌజ్‌లో భేటీ అయ్యారు. ఫార్ములా ఈ కార్ రేసులో గురువారం కేటీఆర్‌ను ఏడు గంటలపాటు విచారించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏసీబీ విచారణకు సంబంధించిన విషయాలను కేసీఆర్‌కు కేటీఆర్ వివరించారు.   ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలు పదే పదే అడిగారని, విచారణకు పూర్తిగా సహకరించానని కేటీఆర్.. కేసీఆర్‌కు వివరించారు. ఈ భేటీలో మాజీ మంత్రి హరీశ్ రావతోపాటు…

TELANGANA

‘భూ భారతి’కి గవర్నర్ ఆమోదం.. రానున్న మార్పులివే..

గత ప్రభుత్వంలో అస్తవ్యస్తమైన రెవెన్యూశాఖను ప్రక్షాళన చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన భూ భారతి బిల్లుకు గవర్నర్ బిష్ణుదేవ్ శర్మ ఆమోద ముద్ర వేశారు. గ‌వ‌ర్న‌ర్ ఆమోదించిన బిల్లు కాపీని గురువారం స‌చివాల‌యంలో రెవెన్యూశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి న‌వీన్ మిట్ట‌ల్.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. వీలైనంత త్వరలో ఈ బిల్లును అమల్లోకి తీసుకొస్తామని తెలిపారు. ఇందుకోసం అధికారులు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. తెలంగాణ ప్ర‌జానీకానికి మెరుగైన‌, స‌మ‌గ్ర‌మైన…

TELANGANA

హైదరాబాద్‌కు ధీటుగా మరో నగరం..? ఆ నగరం అభివృద్ది సీఎం రేవంత్ ఫోకస్..

హైదరాబాద్‌ తరహాలో వ‌రంగ‌ల్ మ‌హా న‌గ‌రంగా తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఆ విధంగా విమానాశ్ర‌యానికి రూప‌క‌ల్ప‌న చేయాల‌ని సూచించారు. మామూనూరు ఎయిర్‌పోర్టు భూ సేక‌ర‌ణ‌, ఇత‌ర ప్ర‌ణాళిక‌ల‌పై ఐసీసీసీలో సీఎం రేవంత్‌రెడ్డి గురువారం రాత్రి స‌మీక్ష నిర్వ‌హించారు.   ద‌క్షిణ కొరియాతో పాటు ప‌లు దేశాలు త‌మ పెట్టుబ‌డుల‌కు ఎయిర్‌పోర్టును ప్రాధాన్యంగా ఎంచుకుంటున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆయా దేశాల పెట్టుబ‌డులు ఆక‌ర్షించేలా వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యం ఉండాల‌న్నారు. కొచ్చి ఎయిర్‌పోర్టు అన్ని వ‌స‌తుల‌తో ఉంటుంద‌ని..…

TELANGANA

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి: రేవంత్ రెడ్డి..

స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో ఉంటాయని, కాంగ్రెస్ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నిన్న సాయంత్రం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో నిర్వహించిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు. మన పథకాలను ఇంటింటికి చెప్పాలని సూచించారు.   అధికారంలోకి వచ్చిన కొన్నిరోజుల్లోనే 55 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, రూ.21 వేల…

TELANGANA

లుచ్చాగాళ్ల ముందు తల వంచను.. విచారణకు వెళ్లే ముందు కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..

ఏసీబీ విచారణ కోసం తన నివాసం నుంచి ఏసీబీ కార్యాలయానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయలుదేరారు. తన ఇంటికి వచ్చిన బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన ఇంటి నుంచి వెలుపలకు వచ్చారు. అనంతరం అక్కడున్న మీడియాతో మాట్లాడి… ఏసీబీ కార్యాలయానికి బయల్దేరారు. తన లాయర్ రామచంద్రరావుతో కలిసి వెళ్లారు.   “తెలంగాణ బిడ్డగా, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన కార్యకర్తగా, కేసీఆర్ సైనికుడిగా రాష్ట్ర ప్రతిష్ఠ పెంచడానికి, హైదరాబాద్ ను ప్రపంచపటంలో నిలపడానికి మంత్రిగా…

TELANGANA

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు..

హైదరాబాద్‌ విపత్తు స్పందన, ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ ఏజెన్సీ (హైడ్రా) విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరింత పటిష్ఠ చర్యలకు దారితీసింది. ఈ క్రమంలో హైడ్రా కోసం ప్రత్యేక పోలీస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తూ మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. బుద్ధభవన్‌ భవనంలోని B-బ్లాక్‌లో ఈ పోలీస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. హైడ్రాకు విస్తృతమైన అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. నగరంలోని జలాశయాలు, చెరువులు,…