కామారెడ్డి జిల్లాలో వరద బీభత్సం.. గ్రామాలకు గ్రామాలే ఖాళీ..!
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణలోని కామారెడ్డి జిల్లా విలవిల్లాడుతోంది. జిల్లాలోని ప్రధాన జలాశయాలైన నిజాంసాగర్, కౌలాస్ నాలా ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. డోంగ్లి మండలంలో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. సిర్పూర్, పెద్దటాక్లి, హాసన్ టాక్లి గ్రామాలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో…

