ఎమ్మెల్యే కొడుకు జోక్యం: హనుమకొండలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో రూ.1 లక్ష వసూలు, గంజాయి కేసుతో వేధింపులు
వరంగల్ జిల్లాలోని హనుమకొండలో జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో పట్టుబడిన ఇద్దరు యువకుల్లో ఒకరిని విడుదల చేయించేందుకు ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకు నేరుగా జోక్యం చేసుకున్నట్లు సంచలన సమాచారం బయటపడింది. ఎస్సై తనిఖీలలో మద్యం సేవించి కారు నడుపుతూ పట్టుబడిన యువకులను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లగా, ఎమ్మెల్యే కుమారుడు ఫోన్ చేసి డ్రైవర్ను వదిలివేయాలని ఆదేశించాడు. అతడి ఆదేశంతో డ్రైవర్ను విడిచిపెట్టిన పోలీసులు, పక్క సీటులో ఉన్న మరో యువకుడిని మాత్రం రాత్రంతా…

