TELANGANA

TELANGANA

అక్రమ టోల్ గేట్ కేసు.. మ‌ళ్లీ పోలీస్ కస్ట‌డీకి మాజీ మంత్రి కాకాణి..

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. అక్రమ టోల్ గేట్ నిర్వహణకు సంబంధించిన కేసులో ఆయన్ను విచారించేందుకు న్యాయస్థానం పోలీసులకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈరోజు, రేపు ఆయనను పోలీసులు విచారించనున్నారు.   వివరాల్లోకి వెళితే… కాకాణి గోవర్ధన్ రెడ్డిపై నమోదైన అక్రమ టోల్ గేట్ కేసులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో మరింత లోతైన విచారణ జరిపేందుకు, ఆయన్ను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు…

TELANGANA

తెలంగాణ బీజేపీకి కొత్త చీఫ్ ఎవరు..?

తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షులు ఎవరు? పార్టీ నేతల్లో ఇదే చర్చ జరుగుతోంది. బీజేపీ కొత్త చీఫ్ ఎవరేది ఆసక్తికరంగా మారింది. బలమైన రేవంత్ సర్కార్‌ని ఎదుర్కొని నిలబడడమేంటే ఆషామాషీ కాదు. పోటీపడుతున్న వారిలో ముగ్గురు ఎంపీలే కావడంతో త్రిముఖ పోటీ నెలకొంది.   బీజేపీ నిర్ణయాలు చాలామంది రాజకీయ నేతలకు అంతుబట్టవు. రాష్ట్రాల అధ్యక్షులు, ముఖ్యమంత్రి ఎంపికలో కొత్త వ్యక్తులు తెరపైకి వస్తారు. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరనేది కేవలం 48 గంటల్లో తేలిపోనుంది.…

TELANGANA

టీవీ చానెల్ ఆఫీస్‌‌పై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి..!

వార్తలు చెప్పే వాళ్ల మీదే ఇప్పుడు వార్తలే వస్తున్నాయంటే పరిస్థితి ఎంత ఘర్షణాత్మకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్‌లోని మహా టీవీ కార్యాలయం వద్ద ఊహించని ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ అంశంలో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ పేరును ప్రస్తావిస్తూ ప్రసారం చేసిన కథనాలకు నిరసనగా BRS కార్యకర్తలు రోడ్డెక్కారు. కానీ అది నిరసనతో ఆగకుండా.. ఏకంగా ఆఫీసులోకి జొరబడి, అద్దాలు పగులగొట్టారు, కార్లను ధ్వంసం చేశారు, స్టూడియోకు హాని కలిగించారు. కొన్ని నిమిషాల్లోనే…

TELANGANA

ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఏసీబీ వల.. లంచం తీసుకుంటుండగా ఇద్దరి అరెస్ట్..!

ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టేందుకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. తాజాగా, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం కలకలం రేపింది. కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన బిల్లుల మంజూరు కోసం వారు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలున్నాయి.   ఆదిలాబాద్ పురపాలక సంఘ కార్యాలయంలో అకౌంట్స్ అధికారిగా పనిచేస్తున్న బట్టల రాజ్ కుమార్, కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కొండ్ర…

TELANGANA

ఎండిపోతున్న పంటపొలానికి బకెట్లతో నీళ్లు..! రైతు పడుతున్న ఆవేదన చూపరులను కలచివేస్తోంది..!

ఆశగా ఆకాశం వైపు చూస్తూ, ఎండిపోతున్న పంటను ఎలాగైనా బతికించుకోవాలని ఒక రైతు పడుతున్న ఆవేదన చూపరులను కలచివేస్తోంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో, ఉన్న కొద్దిపాటి నీటితోనే పంటను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన ఆముదాల రమేష్ అనే రైతు ఎదుర్కొంటున్న పరిస్థితి ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.   ఆముదాల రమేష్ ఐదు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని మొక్కజొన్న పంట సాగుచేశాడు. ఈ ఏడాది…

TELANGANA

బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం.. స్పందించిన మహేశ్ కుమార్ గౌడ్..

బీఆర్ఎస్ సామాజిక మాధ్యమాల ద్వారా చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు ఎంతమాత్రం విశ్వసించవద్దని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. బుధవారం గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు.   “కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో సాగుతున్న సామాజిక న్యాయం మరే ప్రభుత్వ హయాంలోనూ జరగలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే పథకాలను ప్రవేశపెట్టింది. దీనికి…

TELANGANA

స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ భయపడుతోందని.. డీకే అరుణ సంచలన వాఖ్యలు..!

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే ధైర్యం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని ఆమె ఎద్దేవా చేశారు. రైతు సంక్షేమంపై గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, రెండు ఎకరాల భూమి ఉన్న చిన్న రైతులకు కూడా రైతు భరోసా అందించడంలో విఫలమైందని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతు భరోసా పేరుతో సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని, ఇది కాంగ్రెస్ నేతలకే తెలియాలని…

TELANGANA

కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. అయితే, ఇదే సమయంలో పార్టీ కార్యకర్తలు మాత్రం కొంత అసంతృప్తితో ఉన్నారని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం జరిగిన తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశంలో జగ్గారెడ్డి ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.   రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన గత బీఆర్ఎస్ ప్రభుత్వం…

TELANGANA

రైల్ రోకో కార్యక్రమానికి వామపక్షాల మద్దతు కోరిన కవిత..

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో రాష్ట్రంలో విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జులై 17న నిర్వహించ తలపెట్టిన రైల్ రోకో నిరసన కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని వామపక్ష పార్టీలను కల్వకుంట్ల కవిత కోరారు.   ఈ మేరకు సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్…

TELANGANA

ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్.. సిట్ చేతికి కీలక ఆధారాలు..

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తు పురోగమిస్తున్న కొద్దీ దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో జరిగిన పలు ఎన్నికల సమయంలో ప్రత్యర్థుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసి, సమాచారం సేకరించి, కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులకు కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో అప్పటి ఉన్నతాధికారుల పాత్రపై కూడా సిట్ దృష్టి సారించింది.సమాచారం ప్రకారం, 2018 నాటి సార్వత్రిక ఎన్నికల సమయంలో ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్…