TELANGANA

TELANGANA

హైదరాబాద్‌లో ఫైర్ సేఫ్టీ పాఠాలు: రంగంలోకి దిగిన హైడ్రా (HYDRAA)

హైదరాబాద్ నగరంలో ఇటీవల చోటుచేసుకున్న వరుస అగ్ని ప్రమాదాల నేపథ్యంలో ‘హైడ్రా’ (HYDRAA) అప్రమత్తమైంది. ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించే లక్ష్యంతో నగర ప్రజలకు, వ్యాపారులకు అగ్ని భద్రతా నిబంధనలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను ప్రారంభించింది. ముఖ్యంగా జనసాంద్రత ఎక్కువగా ఉండే వాణిజ్య సముదాయాల్లో భద్రతా ప్రమాణాలను కఠినతరం చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టింది. ఈ అవగాహన సదస్సుల్లో భాగంగా అగ్నిమాపక పరికరాల వినియోగంపై అధికారులు ప్రాక్టికల్ డెమోలు నిర్వహిస్తున్నారు. మంటలను ఆర్పే ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు…

TELANGANA

జగిత్యాల జిల్లాలో విషాదం: ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు కూలీల మృతి

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో మంగళవారం సాయంత్రం ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లిన కూలీలు తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడటంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ముగిలిపేట గ్రామ శివార్లలో జరగడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే, మల్లాపూర్ మండలానికి చెందిన కొందరు వ్యవసాయ కూలీలు ఉదయం పసుపు కోత పనుల కోసం పొలానికి వెళ్లారు. పనులన్నీ…

TELANGANA

ఫోన్ ట్యాపింగ్ కేసు: సిట్‌పై కేసీఆర్ ఘాటు లేఖ – న్యాయపరమైన అంశాలతో 6 పేజీల సమాధానం!

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరుకావాలంటూ జూబ్లీహిల్స్ ఏసీపీ జారీ చేసిన నోటీసులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. తన నందినగర్ నివాసం గోడకు నోటీసులు అతికించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిట్ (SIT) అధికారులకు 6 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తికి ఇచ్చే నోటీసులను ఇలా బహిరంగంగా గోడకు అతికించడం చట్టవిరుద్ధమని, ఇది తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించడమేనని ఆయన మండిపడ్డారు. పోలీసుల ఈ చర్య…

TELANGANA

సీపీపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు.. భగ్గుమన్న ఐపీఎస్, ఐఏఎస్, పోలీస్ సంఘాలు..

కరీంనగర్ పోలీస్ కమిషనర్ (సీపీ) గౌస్ ఆలంను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్, ఐపీఎస్ అధికారుల సంఘం, ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించాయి. ఎమ్మెల్యే తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, కమిషనర్‌కు, ఇతర పోలీస్ అధికారులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి.   అసలేం జరిగింది?   గురువారం హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి…

TELANGANA

కేసీఆర్‌కు సిట్ మరోసారి నోటీసులు… ఫామ్‌హౌస్‌లో విచారణ జరపాలన్న విజ్ఞప్తి తిరస్కరణ..

అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని 160 సీఆర్‌పీసీ కింద ఈ నోటీసులు ఇచ్చారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కాకుండా, హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలోనే విచారణ జరపనున్నట్లు సిట్ స్పష్టం చేసింది.   ఇటీవల గురువారం సిట్ తొలిసారి నోటీసులు జారీ చేయగా, మున్సిపల్ ఎన్నికల ప్రచారం, అభ్యర్థుల ఖరారు…

TELANGANA

ఫోన్ ట్యాపింగ్… కేసీఆర్ అభ్యర్థనకు అంగీకరించిన సిట్..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా తాను విచారణకు హాజరు కాలేనన్న మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థనకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అంగీకరించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కోసం కేసీఆర్‌కు మరింత సమయం ఇవ్వాలని నిర్ణయించింది. అయితే కేసీఆర్ లేవనెత్తిన పలు అంశాలపై సిట్ న్యాయ సలహా తీసుకోనుంది.   న్యాయ నిపుణుల సలహా తీసుకున్న అనంతరం తదుపరి తేదీ, విచారణ చేసే ప్రాంతాన్ని పేర్కొంటూ సిట్ మరోసారి నోటీసులు జారీ చేయనుంది.…

TELANGANA

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు..! కార‌ణ‌మిదే..!

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, హుజూరాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్‌పై మతం పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఆయనపై 126 (2), 132, 196, 299 బీఎన్ఎస్ సెక్షన్లతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.   వివరాల్లోకి వెళితే… కరీంనగర్ జిల్లా వీణవంకలో సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతోంది. గురువారం ఈ జాతరకు ఎమ్మెల్యే…

APNationalTELANGANA

ఆధార్ సేవలపై కీలక అప్డేట్..! ఇకపై ఇంట్లోనే..!

ఆధార్ కార్డు వినియోగదారులకు భారత విశిష్ట ప్రాధికార సంస్థ (UIDAI) శుభవార్త చెప్పింది. ఆధార్ సేవలను మరింత సులభతరం చేస్తూ సరికొత్త ఫీచర్లతో కూడిన కొత్త ఆధార్ యాప్ పూర్తి వెర్షన్‌ను బుధవారం అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా పౌరులు ఇకపై ఇంటి నుంచే అనేక ఆధార్ సంబంధిత సేవలను సులభంగా పొందవచ్చు. ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే కీలకమైన మార్పులు చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు.   గతంలో ఉన్న mAadhaar యాప్ కంటే…

TELANGANA

గల్లీ నుంచి ఢిల్లీ వరకు కేసీఆర్ మీద చెప్పే అబద్ధం అదే: కేటీఆర్..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒకటే అబద్ధం చెబుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పదేళ్ల కాలంలో ఏడెనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారని వారు చెబుతున్నారని, కానీ పార్లమెంటులో బీజేపీ ఎంపీ ఒకరు అడిగిన ప్రశ్నకు స్పష్టమైన సమాధానం వచ్చిందని అన్నారు.   కేసీఆర్ హయాంలో రూ.3.5 లక్షల కోట్ల అప్పులు అయ్యాయని తేలిందని, అందులో కేసీఆర్ గద్దెను ఎక్కే…

TELANGANA

ఫిబ్రవరి 3 నుంచి సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్రంలో రాజకీయ కోలాహలం ఒక్కసారిగా ఊపందుకుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, జనవరి 28 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా, తొలిరోజే రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు భారీగా తరలివచ్చారు.   మున్సిపల్ పోరులో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతోంది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెలాఖరుకు స్వదేశానికి చేరుకోనున్నారు. అభ్యర్థుల ఉపసంహరణ…