CINEMA

చిరంజీవినే అవమానించిన సుమ..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి గురించి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అలాంటి చిరంజీవికి కేవలం మామూలు జనాల్లోనే కాకుండా ఇండస్ట్రీలో కూడా చాలామంది సెలబ్రిటీలకు చిరంజీవి అంటే ఇష్టం. అలాంటి చిరంజీవిని ఓ యాంకర్ మాత్రం పట్టించుకోనట్టు చేసిందట. ఇంతకీ ఆ యాంకర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ని పట్టించుకోనట్లు చూసిన యాంకర్ ఎవరో కాదు సుమ కనకాల. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. సుమ (Suma) కనకాల తాజాగా సుమ అడ్డా అనే పేరుతో ఈటీవీ లో ఒక షోకి యాంకర్ గా వ్యవహరిస్తుంది. అయితే ఇందులో భాగంగా సుమ అడ్డా ప్రోగ్రాం కి మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబి,కమెడియన్ వెన్నెల కిషోర్ హాజరయ్యారు. ఇక ఇందులో భాగంగా చిరంజీవి సుమకి సంబంధించిన ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు. చిరంజీవి మాట్లాడుతూ.. నేను ఒక మూడు నాలుగు సంవత్సరాల నుండి హ్యాపీ బర్త్డే సుమ..

గాడ్ బ్లెస్స్ యు..స్టే బ్లెస్స్డ్ వంటి ఎన్నో మెసేజ్ లు నీకు పెడుతున్నాను. కానీ వాటిని నువ్వు చూసి కనీసం రిప్లై కూడా పెట్టడం లేదు. అసలు చిరంజీవే స్వయంగా మెసేజ్ లు పెడితే రిప్లై ఇవ్వని ఏకైక వ్యక్తివి నువ్వే అంటూ చిరంజీవి (Chiranjeevi) చెప్పుకొచ్చారు. ఇక దీనికి స్పందించిన సుమ సార్ నిజంగా మీ నెంబర్ నాకు తెలియదు.మీరు నాకు మెసేజ్ చేస్తారని కూడా నేను ఊహించలేదు.అందుకే ఆ మెసేజ్ ఎవరు పెట్టారో కూడా నెంబర్ చూడలేదు అని సుమ సారీ చెబుతూ అసలు విషయం బయట పెట్టింది. ఇక 2022లో జరిగిన ఒక ఈవెంట్ లో సుమా (Suma) చిరంజీవి నెంబర్ ని స్వయంగా తీసుకుందని వెల్లడించింది. ఇక ప్రస్తుతం చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య (Waltair Veerayya ) సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన జోష్ లో మూవీ యూనిట్ మొత్తం ఆనందంగా ఉంది.నెక్స్ట్ చిరంజీవి భోళా శంకర్ అనే సినిమాతో మన ముందుకు రానున్నారు. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తే, కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలు పాత్రలో నటిస్తోంది.