APCINEMA

రైతు బిడ్డ విషయంలో బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్న బిగ్ బాస్‌.. సెకండ్ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

బిగ్ బాస్ సీజన్ సెవెన్ తెలుగు ఇటీవల ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. గత సీజన్ తో పోలిస్తే ఈసారి షో కాస్త ఎంటర్టైనింగ్ గా మరియు ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

ఇప్పటికే బిగ్ బాస్ 7 ఫస్ట్ వీక్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ సారి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. తమ తమ స్టేటజీలతో గేమ్ ఆడుతూ ముందుకు సాగుతున్నారు. తొలివారం హీరోయిన్ కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయింది.

 

రెండో వారం నామినేషన్ లో పల్లవి ప్రశాంత్, హీరో శివాజీ, గౌతమ్ కృష్ణ, శోభా శెట్టి, , అమర్ దీప్ చౌదరి, రతిక రోజ్, షకీల, టేస్టీ తేజ, ప్రిన్స్ యావర్ ఉన్నారు. అయితే నామినేషన్ సమయంలో హౌస్ మేట్స్ అందరూ రైతు బిడ్డ అయిన పల్లవి ప్రశాంత్ ను టార్గెట్ చేశారు. అతన్ని ఓ రేంజ్ లో ఏకేశారు. అదే అతనికి ప్లస్ అయింది. ప్రేక్షకులకు ఓటింగ్ లో అతన్ని ముందు నిలబెట్టారు. అయితే ఈవారం బిగ్ బాస్ ప్రశాంత్‌ విషయంలో బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నారు.

 

అతన్ని ఎలిమినేట్ చేసినట్లు చేసి సీక్రెట్ రూమ్ లో ఉంచబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ప్రశాంత్ కు మరింత ఆదరణ పెరుగుతుంది. ఇక నామినేషన్స్ లో ఉన్న వారిలో ఈ వారం షకీలా ఎలిమినేటర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనినిస్తున్నాయి. వయసురీత్యా ఆమె హౌస్‍లో ఏ మాత్రం యాక్టివ్‍గా ఉండలేకపోతున్నారు. టాస్కుల్లో కూడా చురుగ్గా ఉండటం లేదు. ఈ నేపథ్యంలోనే ఆమె రెండో వారం ఎలిమినేట్ అవ్వొచ్చని అంటున్నారు. ఒకవేళ ఆమె సేఫ్ అయితే.. టేస్టీ తేజ ఇంటి బాట పట్టడం పక్కా అవుతుంది.