CINEMA

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సింగర్ చిన్మయి భర్తకు కి మధ్య సంబంధం ఏంటి..?

కెరటం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది రకుల్ ప్రీత్ సింగ్. కానీ మొదటి సినిమా ఈమెకు అంత స్టార్డం తీసుకురాలేదట.ఆ తర్వాత వచ్చిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో ఈమెకు స్టార్ స్టేటస్ వచ్చింది. ఇక ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావడంతో ఒక్కసారి గా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమెకు ఆఫర్లు రావడం లేదు. ఇక సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం రకుల్ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలతో కుర్ర కారు మతులు పోగొడుతుంది. ఇక తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి వార్తల్లో నిలిచింది. రకుల్ ఓ మీడియా సంస్థ ఇచ్చిన అవార్డు తీసుకుంటూ చాలా సంతోష పడింది. అలాగే ఆ అవార్డు రావడానికి కారణమైన వాళ్లందరికీ రకుల్ ప్రీత్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేసింది. అయితే రకుల్ కృతజ్ఞతలు చెబుతూ చేసిన ట్వీట్ పై చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ స్పందించాడు. రకుల్ వేసిన ట్వీట్ కి కంగ్రాట్స్ రకుల్ అంటూ నవ్వుతూ ఉండే ఎమోజీలను పెట్టాడు. ఇక అతను పెట్టిన ట్వీట్ కు వెంటనే రకుల్ స్పందిస్తూ థాంక్యూ బడే భయ్యా అంటూ రెడ్ హార్ట్ సింబల్స్ ని షేర్ చేయడంతో వెంటనే రాహుల్ రవీంద్రన్ మళ్లీ స్పందిస్తూ హగ్గింగ్ ఉండే ఎమోజీలను షేర్ చేశాడు.

అయితే వీరిద్దరి ట్వీట్లు చూసిన నెటిజన్స్ రకుల్ కి చిన్మయి భర్త బడే భయ్యా అవుతాడా.. వీళ్ళిద్దరి మధ్య అన్నా చెల్లెల్ల అనుబంధం ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే సింగర్ చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన నాగార్జున హీరోగా వచ్చిన మన్మధుడు-2 సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కి చిన్మయి డబ్బింగ్ చెప్పింది. అలాగే ఈ సినిమాకి అక్కినేని మాజీ కూడా సమంత స్పెషల్ అప్పీయరెన్స్ చేసింది. కానీ మన్మధుడు-2 కథ అవుట్ డేటెడ్ అవడంతో ఈ సినిమా చాలా దారుణంగా డిజాస్టర్ అయింది. అలాగే ఈ సినిమాలో రకుల్ పాత్ర కి చాలా నెగటివ్ కామెంట్లు కూడా వచ్చాయి.