SPORTS

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న ముంబై ఇండియన్స్

ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా మే 9వ తేదీన ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి.

ఈ సీజన్‌లో ఇది 54వ మ్యాచ్. వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. ఆర్సీబీ బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. ఆర్సీబీ, ముంబై జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకమైనది. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ పది మ్యాచ్‌లు ఆడిన ఈ ఇరుజట్లు.. ఐదు విజయాలు నమోదు చేశాయి. అయితే.. రన్ రేట్ బాగుండటంతో ఆర్సీబీ ఆరో స్థానంలో ఉండగా, ముంబై ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ ఇరు జట్లు ప్లేఆఫ్స్‌లో చోటు పొందాలంటే.. ఇప్పటి నుంచి ప్రతీ మ్యాచ్ తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. ఈ లెక్కన.. ఆర్సీబీ, ముంబై జట్లకు ఇది తాడోపేడో మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఈ రెండింటిలో ఏ టీమ్ గెలిచినా.. టాప్-3 స్థానాన్ని కైవసం చేసుకుంటాయి.