APTELANGANA

ఓల్డ్‌ సిటీ.. విద్యుత్‌ చోర్‌ సిటీ.. ఆ భారమంతా తెలంగాణపైనే!

ఓల్‌ సిటీ.. ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది హైదరాబాద్, ఎంఐఎం పార్టీ. ముస్లిం సామాజికవర్గం అధికంగా ఉండే ఈ ఓల్డ్‌ సిటీ పరిధిలోకి వచ్చే ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఐఎం పార్టీ అభ్యర్థులు దశాబ్దాలుగా ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు.

అక్కడ పోటీ చేసేందుకు కూడా కొన్ని పార్టీలు అభ్యర్థులను నిలపడం లేదు. నిలిపినా గెలవడం లేదు. దీంతో పాతబస్తీ ఎంఐఎం అడ్డాగా మారింది. నాయానో భయానో అక్కడి ఓటర్లు కూడా ఎంఐఎం అభ్యర్థులనే గెలిపిస్తూ వస్తున్నారు. అంతా బాగానే ఉన్నా.. పాతబస్తీ అక్రమ దందాలకు అడ్డాగా మారుతోందని ఎప్పుటి నుంచో ఉన్న ఆరోపణ. ఇందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంఐఎం ఎమ్మెల్యేలు అండగా ఉంటున్నారని అందరికీ తెలిసిన నిజం. దశాబ్దాలుగా గెలుస్తున్న ఎంఐఎం ఎమ్మెల్యేలు అక్రమాలకు కొమ్ము కాయడం, అడ్డుచెప్పేవారిపై మతం ముసుగులో దాడులు చేయించడం మినహా ప్రాంత అభివృద్ధిపై ఆలోచన చేయరు. అభివృద్ధి చెందితే అక్రమ దందాలు ఆగిపోతాయని వారికి తెలుసు. అదే జరిగితే మరోవైపు ఎంఐఎంకు భవిష్యత్తు ఉండదని ప్రచారం. అందుకే ఓల్డ్‌ సిటీ అభివృద్ధిని స్థానిక ఎమ్మెల్యేలే అడ్డుకుంటున్నారనేది నిజం. పాలకులు కూడా ఎంఐఎం ఒత్తిడికి తలొగ్గి పనిచేస్తున్నారు.

స్వంతత్ర రాజ్యాంలా..
తెలంగాణలో విద్యుత్‌ బకాయిలు అత్యధికంగా ఉన్న మొదటి ప్రాంతం పాతబస్తీ. రెండో స్థానంలో సిద్దిపేట ఉన్నాయి. ఇవి స్వయంగా విద్యుత్‌శాఖ వెల్లడించిన వివరాలే. పాత బస్తీలో విద్యుత్‌ బిల్లులు వసూలు చేయడానికి కూడా అధికారులు ప్రయత్నం చేయకపోవడం అక్కడి అరాచకానికి నిదర్శనం. హైదరాబాద్‌లో ఉన్నా.. తమకు ప్రభుత్వ నిబంధనలు, ఆదేశాలు వర్తించవన్నట్లుగా పాతబస్తీవాసులు ప్రవర్తిస్తున్నారు. అందుకే ఇష్టానుసారం విద్యుత్‌ చౌర్యానికి పాల్పడుతున్నారు. ట్రాఫిక్‌ చలానాలు కూడా ఇక్కడ విధించరు. ఇంటి పన్ను, నల్లా పన్ను, ఇతర జీహెచ్‌ఎంసీ ట్యాక్స్‌లు వసూలు చేయరు. ఏ దందా చేస్తున్నా అడ్డు చెప్పరు. వారికి అనుమతి కూడా అవసరం లేదు. అదే సమయంలో కరెంటు దొంగలకు ఎంఐఎం ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కొమ్ముకాయడం గమనార్హం. పాతబస్తీని స్వతంత్ర రాజ్యంలా వ్యవహరిస్తున్నారు.

వేలకోట్ల విద్యుత్‌ బకాయిలు..
విద్యుత్‌ సంస్థలు విడుదల చేసిన లెక్కల ప్రకారమే హైదరాబాద్‌ సౌత్‌జోన్‌ పరిధిలోకి వచ్చే పాతబస్తీలోని అస్మానఘర్, చార్మినార్, బేగంబజార్‌ ప్రాంతాలో విద్యుత్‌ ఫీడర్లు ఉన్నాయి. ఈ ప్రాంత పరధిలోనే రాష్ట్రంలోనే అత్యధిక విద్యుత్‌ చౌర్యం జరుగుతున్నట్లు డిస్కంలు, విద్యుత్‌ సంస్థలు నివేదిక విడుదల చేశాయి. అస్మాన్‌ ఘర్‌ ఏరియాలో 39 శాతం, బేగంబజార్‌ ఏరియాలో 35 శాతం, చార్మినార్‌ ఏరియాలో 38 శాతం విద్యుత్‌ చోరీ జరుగుతుంది. సరాసరిగా వందకు 37 శాతం విద్యుత్‌ చోరీ అవుతోంది. దీని విలువ ఏడాదికి రూ.700 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. తెలంగాణ ఏర్పడిన తర్వాత గడిచిన ఎనిమిదిన్నర ఏళ్లలో రూ.6,500 కోట్ల విద్యుత్‌ చోరీ అయింది.