APTELANGANA

నిరుద్యోగ యువత ప్రైవేట్ రంగంలో రాణించాలి…

అల్లాదుర్గం. ఉన్నత చదువులు చదువుకున్న నిరుద్యోగ యువకులు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా ప్రైవేట్ రంగంలో ప్రవేశించి ఉపాధి పొందవచ్చు అని అల్లాదుర్గం నియోజకవర్గ సాధన సమితి అధ్యక్షులు కంచరి బ్రహ్మం అన్నారు. అల్లాదుర్గం అసెంబ్లీ సాధన సమితి ఆధ్వర్యంలో అల్లాదుర్గం ఐబి చౌరస్తాలోని శ్రీవాణి విద్యానిలయంలో శాశ్విత డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు ఏవైనా అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించలేవని. ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగ యువకులు ప్రభుత్వ ఉద్యోగాల పై ఆధారపడకుండా ప్రైవేట్ రంగంలో కూడా రాణించవచ్చని సూచించారు. ప్రైవేటు ఉద్యోగాలలో కూడా మెరుగైన జీతభత్యాలు లభిస్తున్నాయని యువత తమకు నచ్చిన రంగంలో తమ ప్రతిభ కనబరిచి ఉద్యోగాలు పొంది మంచి జీవితాన్ని సాధించవచ్చు అన్నారు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని ముందుకు వచ్చిన శాశ్విత డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా జాబ్ మేలుకు వచ్చిన యువకులలో కొందరిని ఎంపిక చేసి శాశ్విత డెవలప్మెంట్ వారు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఈ కార్యక్రమంలో శాశ్వత డెవలప్మెంట్ హెచ్ ఆర్. తూ శాంత్. మార్కెటింగ్ టీం. ప్రశాంత్. రవి తో పాటు వివిధ మండలాల నిరుద్యోగ యువత పాల్గొన్నారు.