TELANGANA

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్‌సీ) పేపర్ లీకేజీ వ్యవహారంతో కమీషన్ కీలక నిర్ణయం..

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్‌సీ) పేపర్ లీకేజీ వ్యవహారంతో కమీషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొన్ని పరీక్షలు రద్దు చేసి మరికొన్ని పరీక్షలను వాయిదా వేసిన కమీషన్.. తాజాగా టీఎస్​పీఎస్సీ నిర్వహించే హార్టికల్చర్​ ఆఫీసర్​ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 4న జరగాల్సిన ఈ పరీక్షను.. జూన్ 17వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ప్రశ్నపత్రాల లీకేజీ వల్ల 4 పరీక్షలను రద్దు చేయగా.. రెండింటిని వాయిదా వేసింది. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష, డివిజనల్‌ అకౌంట్స్‌ అధికారి(డీఏవో), అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(ఏఈఈ), అసిస్టెంట్‌ ఇంజినీర్‌(ఏఈ) పరీక్షలు రద్దయ్యాయి. టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌(టీపీబీవో), వెటర్నరీ అసిస్టెంట్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి.

సుదీర్ఘకాలం తీసుకోకుండా స్వల్ప వ్యవధిలోనే తిరిగి హార్టికల్చర్‌ పరీక్ష నిర్వహించేందుకు అనువైన తేదీలను కమిషన్‌ పరిశీలిస్తోంది.