APTELANGANA

హీరోయిన్ సమంత మరోసారి అస్వస్థత

హీరోయిన్ సమంత మరోసారి అస్వస్థతకు గురైంది. గత కొన్నిరోజుల క్రితమే ఆమె మయోసైటిస్ వ్యాధి బారినుంచి బయటపడింది. ఇక ఆ వ్యాధి నుంచి బయటపడగానే తాను నటించిన శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది.

వరుస ఇంటర్వ్యూలు, ప్రయాణాలు చేయడంతో స్వల్ప అస్వస్థతకు గురయ్యింది. “ఈ వారం అంతా నా సినిమాని ప్రమోట్ చేస్తూ, మీ ప్రేమలో మునిగితేలుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. దురదృష్టవశాత్తూ తీవ్రమైన షెడ్యూల్‌లు, ప్రమోషన్ల వల్ల ఇబ్బంది పడ్డాను, నేను ప్రస్తుతం జ్వరంతో బాధపడుతున్నాను. నా గొంతు కూడా పోయింది. అందుకే ఈ రోజు సాయంత్రం ఎంఎల్‌ఆర్‌ఐటీలో జరగనున్న వార్షికోత్సవ కార్యక్రమంలో నేను పాల్గొనలేకపోతున్నా. మా టీమ్‌తో కలిసి మీరూ పాల్గొనండి. మీ అందర్నీ నేను మిస్‌ అవుతున్నా” అంటూ ట్వీట్ చేసింది.

ఇక ఈ ట్వీట్ చూసిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ట్వీట్స్ చేస్తున్నారు. స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత, దేవ్ మోహన్ జంటగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది.