TELANGANA

భర్తను ఇనుప రాడ్ తో కొట్టి, అతని ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన గర్బిణి భార్య, క్లైమాక్స్ లో!

చెన్నై/కాంచీపురం: వివాహం చేసుకున్న మహిళ భర్త తమ్ముడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భార్యను ఆమె భర్త వదిలేశాడు. భర్త చనిపోయిన మహిళను భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు.

అప్పటికే రెండో భార్యకు కూతురు ఉంది. రెండో భర్తతో కాపురం చేస్తున్న భార్య చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ తో తిరిగింది. ఇదే సమయంలో రెండో భార్య గర్బవతి అయ్యింది. నీ కడుపులో బిడ్డకు తండ్రి నేను కాదు అంటూ రెండో భర్త గొడవకు దిగాడు. రెండో భార్య ఆమె భర్త మర్మాంగం కోసేసి చంపేసింది.

తమిళనాడులోని కాంచీపురం జిల్లా పల్లవర్ మేడు ప్రాంతంలో సంతానం (33) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. 5 సంవత్సరాల క్రితం సంధ్యా అనే అమ్మాయిని ప్రేమించిన సంతానం ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కానీ సంధ్యా మాత్రం సంతానం సోదరుడితో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చేసింది. అక్రమ సంబంధం విషయంలో మనస్పర్థలు రావడంతో సంధ్యా, సంతానం విడిపోయారు.