NationalTELANGANA

రైల్వే టికెట్ కౌంటర్లలో డిజిటల్ చెల్లింపులు..

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్‌, జోన్‌ పరిధిలోని ప్రధాన రైల్వేస్టేషన్‌లలోని టిక్కెట్‌ కౌంటర్లలో డిజిటల్‌ చెల్లింపులు అందుబాటులో తీసుకొచ్చారు. POS, UPI (ఫోన్ పే, Google Pay మొదలైనవి) ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ఈ నగదు రహిత విధానం వల్ల ప్రయాణికుల సమయం ఆదా కావడమే కాకుండా చిల్లర సమస్యలు ఉండవని అధికారుల తెలియజేశారు. త్వరలోనే అన్ని చోట్ల ఈ సౌకర్యాలను తీసుకొస్తామని రైల్వే శాఖ తెలిపింది.