Uncategorized

వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబుకి సొంత నియోజకవర్గంలో షాక్

వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబుకి సొంత నియోజకవర్గంలో షాక్ తగిలింది. సత్తెనపల్లి నియోజకవర్గంలో సంక్రాంతి పోటీలు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. రాజు పాలెంలో జరిగిన ముగ్గుల పోటీల్లో వైసీపీకి షాక్ తగిలింది. సత్తెనపల్లిలోని రాజుపాలెం మండలంలోని అంచలవారిపాలెంకి చెందిన తోట సాయి లక్ష్మి అనే యువతి, ‘వైసీపీ వద్దు.. జనసేన ముద్దు..’ అంటూ ఓ ముగ్గు వేయడంతో వైసీపీ నేతలు అవాక్కయ్యారు.

ఫొటోలు, వీడియోలు వైరల్.. Minister Ambati Rambabu Got Shock His Own Constituency వైసీపీ నిర్వహిస్తున్న ముగ్గుల పోటీల్లో మహిళలు ‘వైసీపీ వద్దు.. జనసేన ముద్దు..’ అంటూ పేర్కొనడంపై ఎలా స్పందించాలో అర్థం కావడంలేదు అధికార వైసీపీకి. మరోపక్క, ఈ ఫొటోలు, వీడియోల్ని జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి. దాంతో, సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వేస్తోన్న ముగ్గుల్లో మహిళలు, ఇదే నినాదాన్ని కంటిన్యూ చేస్తున్నారు.