TELANGANA

TELANGANA

దేశంలో త్వరలో రైతుల తుపాన్‌ రాబోతుంది..-: సీఎం కేసిఆర్.

దేశంలో త్వరలో రైతుల తుపాన్‌ రాబోతోందని.. దాన్నెవరూ ఆపలేరని బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఆదివారం మహారాష్ట్ర నాందేడ్‌ జిల్లాలోని లోహలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేసీఆర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని 75 ఏళ్లుగా పాలిస్తున్న కాంగ్రెస్‌, బీజేపీ మధ్య ఎలాంటి తేడా లేదని కేసీఆర్‌ విమర్శించారు. రైతులు ఐక్యంగా నిలిస్తే అడ్డుకోగల శక్తి ఎవరికీ లేదని అన్నారు. శివాజీ, అంబేడ్కర్‌ పుట్టిన నేలలో త్వరలోనే విప్లవం వస్తుందని…

APNationalTELANGANA

రాహుల్ గాంధీ పై అనర్హత వేటు..

తన పార్లమెంట్ మెంబర్‌షిప్‌ను రద్దు చేయడంపై కాంగ్రెస్ ముఖ్య నేత, రాహుల్ గాంధీ స్పందించారు. చాలా ఎమోషనల్‌గా ట్వీట్ చేశారు. దేశం కోసం గళం విప్పుతానని, ఎంతటి త్యాగానికైనా సిద్ధం అని స్పష్టం చేశారు. తాను భారతదేశ స్వరం వినిపించేందుకు ప్రయత్నిస్తున్నానని, ఎందాకైనా పోరాడేందుకు సిద్ధం అని ప్రకటించారు రాహుల్. దేశంలో జరుగుతున్న దారుణాలను ప్రజలకు వివరిస్తానని చెప్పారు. మరోవైపు ప్రముఖ రాజకీయ నేతలు రాహుల్‌ అనర్హత వేటుపై స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఢిల్లీ సీఎం…

TELANGANA

తెలంగాణలో పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల హాల్‌ టికెట్లు విడుదల…

తెలంగాణ పదోతరగతి పబ్లిక్‌ పరీక్ష-2023ల హాల్‌ టికెట్లు విడుదలయ్యాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు ఎస్‌ఎస్‌సీ బోర్డు తన అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టిక్కెట్లను అందుబాటులో ఉంచింది. ఎస్‌ఎస్‌సీ పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ ఏప్రిల్‌ 2023 ట్యాబ్‌పై క్లిక్‌ చేసి విద్యార్ధుల జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీని ఎంటర్‌ చేసి హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. రెగ్యులర్‌, ప్రైవేటు, ఓఎస్‌ఎస్‌సీ, వొకేషనల్‌ విద్యార్థులందరికి సంబంధించిన హాల్‌ టికెట్లను పొందుపరిచింది.   కాగా పదో తరగతి పరీక్షలు ఏప్రిల్‌…

TELANGANA

టీఎస్‌పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ విషయం లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లకు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు..

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్ పేపర్ లీక్ వ్యవహారంలో తనపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లకు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. టీఎస్‌పీఎస్సీ వ్యవహారంలో కేవలం రాజకీయ దురుద్దేశంతోనే తన పేరును లాగుతూ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర చేస్తున్నారని, ఈ కారణంగానే ఆ ఇద్దరికి లీగల్ నోటీసులు పంపుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.…

TELANGANA

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఈరోజు సిట్ కార్యాలయానికి వెళుతున్న దృష్ట అల్లాదుర్గం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్టు చేయడం జరిగింది..

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఈరోజు సిట్ కార్యాలయానికి వెళుతున్న దృష్ట అల్లాదుర్గం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్టు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అల్లాదుర్గం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల శేషారెడ్డి ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు బలరాం ఎంపిటిసి విట్టల్ రెడ్డి సర్పంచ్ శ్రీనివాస్ బేతాయ సదానందం నాగయ్య విశ్వేశ్వర్ వీరాయ స్వామి అభిలాష్ రెడ్డి హనుమయ్య దుర్గయ్య జైపాల్ శ్రీనివాస్ గౌడ్ అంజా…

TELANGANA

సీఎం కేసిఆర్ కరీంనగర్ జిల్లాలో పర్యటన…పంట నష్టం పై రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. రామడుగు మండలంలోని రైతులకు చెందిన పంట నష్టాన్ని స్వయంగా పరిశీలించి సహాయానికి సంబంధించి అధికారులకు సూచనలు అందించనున్నారు. రామడుగు మండలంలోని రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఇటీవల కురిసిన వడగళ్ల వానతో కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండలంలోని ధర్మాజిపేట, చిప్పకుర్తి, లక్ష్మీ పూర్ గ్రామాల్లో తీవ్ర పంట నష్టం వాటిల్లింది. మూడు రోజులు కురిసిన అకాల వర్షాలు…

TELANGANA

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్స్‌ కేసులో..టీఎస్‌పీఎస్సీలో పని చేస్తున్న 40 మంది ఉద్యోగులకూ సిట్‌ నోటీసులు జారీ..

తెలంగాణలో సంచలనం రేపిన టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్స్‌ కేసులో సిట్‌ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులని విచారిస్తున్న అధికారులకు సంచలన విషయాలు వెలుగులోకి తెస్తున్నారు. టీఎస్‌పీఎస్సీలో పని చేస్తున్న వాళ్లందరినీ సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా టీఎస్‌పీఎస్సీలో పని చేస్తున్న 40 మంది ఉద్యోగులకూ సిట్‌ నోటీసులు జారీ చేసింది. వీళ్లలో పేపర్‌ లీక్స్‌ వ్యవహారంలో ప్రధాన నిందితులైన ప్రవీణ్‌, రాజశేఖర్‌లతో సంబంధాలు ఉన్న వాళ్లే ఉన్నట్లు సమాచారం.…

APTELANGANA

MLA మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో BRS పార్టీ తీర్థం పుచ్చుకున్న వివిధ పార్టీలకు చెందిన 200 కుటుంబాలు..

అశ్వారావుపేట   MLA మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో BRS పార్టీ తీర్థం పుచ్చుకున్న వివిధ పార్టీలకు చెందిన 200 కుటుంబాలు   *ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడే బాధ్యత నాది – MLA మెచ్చా నాగేశ్వరరావు*   *పార్టీకి కార్యకర్తలే బలం*   *మారుమూల ప్రాంతాల్లో సైతం జరుగుతున్న అభివృద్ది*   అశ్వారావుపేట(మండలం),వినాయకపురం (గ్రామం),లో వివిధ పార్టీలకు చెందిన సుమారు 200 కుటుంబాలు BRS పార్టీ తీర్థం పుచ్చుకున్నారు… ఈ సందర్భంగా లీలా ప్రసాద్ ఇంటి…

APNationalTELANGANA

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ముగిసిన కవిత ఈడీ విచారణ…దాదాపు 10 గంటలకు పైగా సాగిన విచారణలో కీలక ప్రశ్నలు..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 10 గంటలకు పైగా సాగిన విచారణలో కీలక ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. అయితే, తాను ఫోన్లను ధ్వంసం చేసినట్లు ప్రచారం జరిగిన నేపథ్యంలో సదరు ఫోన్లు ఇవే అంటూ ఉదయం మీడియాకు ప్రదర్శించారు ఎమ్మెల్సీ కవిత. అనంతరం వాటిని దర్యాప్తు అధికారులకు అప్పగించారు. కాగా, ఇవాళ రాత్రి వరకు విచారణ జరగడంతో క్షణం క్షణం ఎంతో ఉత్కంఠ నెలకొంది. అయితే, మళ్లీ ఎప్పుడు…

TELANGANA

పొలిటికల్‌ హీట్‌ని పెంచుతున్న టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ. ఎంపీ బండి సంజయ్ కి సీట్ నోటీసులు…

టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ ఇష్యూ తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ని పెంచుతోంది. ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్న రాజకీయ నేతలకు సిట్‌ నోటీసులు కాక రేపుతున్నాయి. టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీపై సిట్ దూకుడు పెంచింది. లీకేజీ వ్యవహారంలో సిట్‌ దర్యాప్తుని ముమ్మరం చేసింది. ఓ వైపు నిందితుల వేట కొనసాగిస్తూనే.. రాజకీయనేతలకు నోటీసులు జారీచేస్తోంది సిట్‌. ప్రశ్నాపత్రాల లీకేజీపై ఆరోపణలు గుప్పిస్తున్న రాజకీయ పార్టీల నేతలకు సిట్‌ నోటీసులు కలకలం రేపుతున్నాయి.   నిన్న రేవంత్‌ రెడ్డికి నోటీసులు జారీచేసిన…