TELANGANA

TELANGANA

హైదరాబాద్‌లో ‘మిస్ వరల్డ్’ సందడి షురూ..!

హైదరాబాద్ నగరం మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ కార్యక్రమానికి వేదిక కానుంది. మే 10వ తేదీ నుంచి 31 వరకు చారిత్రక చౌమొహల్లా ప్యాలెస్ (ఖిల్వత్ ప్యాలెస్)లో ‘మిస్ వరల్డ్-2025’ పోటీలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, పోలీసులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా చార్మినార్‌తో పాటు పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో దుకాణాలు, వ్యాపార సముదాయాలను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.   సౌత్ జోన్ పోలీసులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే విదేశీ ప్రతినిధులు, సందర్శకుల…

TELANGANA

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు సర్వం సిద్ధం..?

హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 ప్రాజెక్టు(పార్ట్-బి)కు సంబంధించి డీపీఆర్ రెడీ అయ్యింది. రేవంత్ మంత్రివర్గం వచ్చే వారం ఆమోదించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు మేడ్చల్‌, జూబ్లీ బస్ స్టేషన్ నుండి షామిర్‌పేటకు విస్తరించనుంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి అనుసంధానించే మెట్రో కారిడార్‌కు సంబంధించిన డీపీఆర్‌ను కేబినెట్ ఆమోదించనుంది.   ఈ ఏడాది జనవరి ఒకటిన సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును నూతన సంవత్సర గిఫ్ట్‌గా ప్రకటించారు. ప్యారడైజ్ నుండి మేడ్చల్ వరకు…

TELANGANA

మాట్లాడుకుందాం రండి.. ఆర్టీసీ సంఘాలకు పొన్నం పిలుపు..!

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని, చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకుందామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సమ్మె ఆలోచన విరమించుకోవాలని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలకు సూచించారు. హైదరాబాద్‌లో పలువురు ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి తమ ఇబ్బందులను, డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.   ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల…

TELANGANA

చేనేత కార్మికులకు గుడ్‌న్యూస్ రేవంత్ సర్కార్..!

తెలంగాణలోని చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు అసలు, వడ్డీ కలిపి రూ.లక్ష వరకు రుణమాఫీ చేయాలని నిర్ణయించింది. ఈ పథకంలో భాగంగా 2017 ఏప్రిల్1వ తేదీ నుంచి 2024 మార్చి 31 వరకు అన్ని బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో వ్యక్తిగతంగా చేనేత వస్త్రాల ఉత్పత్తి, కార్యనిర్వహణ మూలధనం, ఇతర వృత్తి సంబంధిత కార్యకలాపాల కోసం రుణాలు తీసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుందని రాష్ట్ర చేనేతశాఖ స్పష్టం చేసింది.…

TELANGANA

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు ..!

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఆయన సీఎస్ రామకృష్ణారావుతో కలిసి ఇందిరమ్మ ఇళ్లు, నీట్ పరీక్ష ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితా ఇంఛార్జీ మంత్రులు ఆమోదం పొందాలన్నారు.   ఇందిరమ్మ ఇళ్లు విస్తీర్ణం 600…

TELANGANA

బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం..!

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ బిల్లుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలపడంతో, టీకాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నేతలు ఆయనను కలిసి ధన్యవాదాలు తెలపనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు రాజ్‌భవన్‌లో ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం కాంగ్రెస్ పార్టీ గత కొన్నేళ్లుగా పోరాడుతోంది. ఈ బిల్లు ఆమోదం పొందడంతో, బీసీ వర్గాలకు విద్య , ఉద్యోగ రంగాలలో మరింత న్యాయం చేకూరుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు.   గవర్నర్ ఆమోదం…

TELANGANA

తెలంగాణలో కొత్త పాలసీ..! వారికి మాత్రమే..!

కపటనాటక సూత్రధారి మళ్లీ ప్రజల్లోకి వస్తానని అంటున్నాడు. పదేళ్లు గాయాలు చేసి, ఇప్పుడు మళ్లీ అవే గాయాలు చేసే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. రాష్ట్ర ప్రజలూ.. తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంతకు సీఎం ఇంతలా విమర్శించింది ఎవరినంటే మాజీ సీఎం కేసీఆర్ ను. మేడే సంధర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ కార్మికులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందంటూ ఆరోపించారు.   రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన మేడే ప్రత్యేక…

TELANGANA

తెలంగాణలో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ లకు కీలక పదవులు..!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సర్కారు పలువురు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ లను కీలక పదవుల్లో నియమించింది. ఈ క్రమంలోనే టీటీడీ జేఈవోగా సేవలందించిన మాజీ ఐఏఎస్ అధికారి కె.ఎస్. శ్రీనివాసరాజును ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ఆయన ఈ బాధ్యతను రెండు సంవత్సరాల పాటు నిర్వర్తించనున్నారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన శ్రీనివాసరాజు గతంలో సుదీర్ఘ కాలం పాటు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జేఈవోగా బాధ్యతలు నిర్వహించారు.…

TELANGANA

కొత్త డీజీపీ..! డీజీపీ రేసులో ఎవరెవరంటే..?

ఇప్పటికే సీఎస్ శాంతికుమారి టర్న్ పూర్తి అయింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు ఎంపికయ్యారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో డీజీపీ జితేందర్ రిటైర్ కానున్నారు. ఆయన స్థానంలో కొత్త పోలీస్ బాస్ కోసం ప్రభుత్వం కసరత్తు కంప్లీట్ చేసింది.   డీజీపీ రేసులో ఎవరెవరంటే..   డీజీపీ రేసులో 8 మంది సీనియర్ ఐపీఎస్‌లు ఉన్నారు. ఎనిమిది మంది అధికారుల పేర్లతో కూడిన జాబితాను యూపీఎస్సీకి పంపించింది తెలంగాణ ప్రభుత్వం. రవి గుప్తా, సీవీ ఆనంద్,…

TELANGANA

గ్రూప్-1 పిటిషనర్లకు తెలంగాణ హైకోర్టు రూ. 20,000 చొప్పున జరిమానా..

టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనంపై పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తప్పుడు అఫిడవిట్లు సమర్పించి కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారంటూ 19 మంది పిటిషనర్లకు రూ.20,000 జరిమానా విధించింది. అంతేకాకుండా, వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.   తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ మొత్తం 19 మంది అభ్యర్థులు హైకోర్టును…