AP

సేవా మూర్తి కి ఘన సత్కారం

 

పార్వతీపురం మన్యం జిల్లా : పోలీస్ కృష్ణమూర్తి సేవలు ఎనలేనివని పార్వతీపురం మన్యం జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు టి. చంద్రశేఖర రావు, ఉపాధ్యక్షులు కే. నారాయణ రావు(8వ వార్డ్ కౌన్సిలర్) లు పేర్కొన్నారు . గురువారం మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కృష్ణమూర్తిని దుశ్శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మీడియా ముఖంగా మాట్లాడుతూ.. పట్టణ పోలీస్ స్టేషన్ లో వృద్ధుమిత్ర కో ఆర్డినేటర్ గా విధులు నిర్వహిస్తున్న కె. కృష్ణ ముర్తి(హెచ్. సి1273) ప్రతి నెల తన జీతంలో కొంత భాగాన్ని పేదలకు, వృద్ధులకు కేటాయించడమే కాకుండా కరోన వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఆయన పేద ప్రజాలకు సేవలు అందించారని తెలిపారు. అందుకుగాను ఆయన్ని ఈనాడు దుశ్శాలువ కప్పి సత్కరించటం జరిగిందని తెలిపారు. ఇలాంటి సత్కారాలు, అవార్డులు మరెన్నో పొందాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో ఆ సంఘం కోశాధికారి శ్రీరామ మూర్తి, సభ్యులు భాస్కరరావు, గవరయ్య, మహేష్,జగదీష్, కృష్ణ,భాస్కర రావు, గణేష్,సింహాచలం తదితరులు పాల్గొన్నారు.