Editor

TELANGANA

కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. అయితే, ఇదే సమయంలో పార్టీ కార్యకర్తలు మాత్రం కొంత అసంతృప్తితో ఉన్నారని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం జరిగిన తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశంలో జగ్గారెడ్డి ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.   రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన గత బీఆర్ఎస్ ప్రభుత్వం…

TELANGANA

రైల్ రోకో కార్యక్రమానికి వామపక్షాల మద్దతు కోరిన కవిత..

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో రాష్ట్రంలో విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జులై 17న నిర్వహించ తలపెట్టిన రైల్ రోకో నిరసన కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని వామపక్ష పార్టీలను కల్వకుంట్ల కవిత కోరారు.   ఈ మేరకు సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్…

National

ఆర్మీకి కొత్త ఆయుధాలు..!

భారత సైన్యానికి కొత్త ఆయుధాలు రాబోతున్నాయి. కొత్త ఆయుధాల తయారీ కోసం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్- DRDO,  భారత్ ఫోర్జ్ లిమిటెడ్ మధ్య రూ.2,000 కోట్ల విలువైన డీల్ కుదిరింది. దీని ద్వారా సైన్యానికి కొత్త ఆయుధాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం సైన్యం స్టెర్లింగ్ కార్బైన్ గన్‌లను ఉపయోగిస్తున్నాయి. వాటి స్థానంలో సరికొత్తగా 5.56×45 mm క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్-CQB కార్బైన్ మెషిన్ గన్‌లను రాబోతున్నాయి. ఈ ఒప్పందం రక్షణ రంగంలో స్వదేశీ కంపెనీలను…

AP

సింగయ్య మృతి వ్యవహారంపై తొలిసారిగా స్పందించిన జగన్..

పల్నాడు జిల్లా పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి మృతి తీవ్ర వివాదాస్పదం అయిన నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు తన తీరుతో రాజకీయాలను మరింత దిగజార్చారని ఆరోపిస్తూ, పలు కీలక ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.   తన పర్యటనలపై ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారని, కార్యకర్తలు తనను కలవకుండా ఎందుకు కట్టడి చేస్తున్నారని జగన్ ప్రశ్నించారు. “గతంలో మీరు గానీ, మీ మిత్రుడు పవన్ కల్యాణ్ గానీ పర్యటనలు…

TELANGANA

ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్.. సిట్ చేతికి కీలక ఆధారాలు..

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తు పురోగమిస్తున్న కొద్దీ దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో జరిగిన పలు ఎన్నికల సమయంలో ప్రత్యర్థుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసి, సమాచారం సేకరించి, కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులకు కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో అప్పటి ఉన్నతాధికారుల పాత్రపై కూడా సిట్ దృష్టి సారించింది.సమాచారం ప్రకారం, 2018 నాటి సార్వత్రిక ఎన్నికల సమయంలో ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్…

TELANGANA

కంచ గచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా..

రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో కొనసాగుతున్న విచారణ వాయిదా పడింది. ఈ భూములకు సంబంధించి దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై (పిల్) విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం, తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.   వివరాల్లోకి వెళితే, కంచ గచ్చిబౌలిలోని వివాదాస్పద భూములను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు (టీజీఐఐసీ) అప్పగించింది. ఈ భూములను అభివృద్ధి చేసి,…

AP

కారు కింద పడిన వ్యక్తిని లాగి పక్కన పడేశారు.. జగన్ ట్వీట్ కు హోంమంత్రి అనిత కౌంటర్..

పల్నాడు జిల్లాలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్‌పై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల ప్రవర్తన దారుణంగా దిగజారిపోయిందని ఆమె మండిపడ్డారు. సచివాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి అనిత మాట్లాడుతూ, జగన్ వ్యాఖ్యలు సమాజంలో హింసను ప్రేరేపించే విధంగా ఉన్నాయని, రాజకీయ నాయకుల మాటలను ప్రజలు నిశితంగా గమనిస్తారని…

National

పాకిస్థాన్‌కు మరోమారు వార్నింగ్ ఇచ్చిన రాజ్‌నాథ్ సింగ్..

ఉగ్రవాదం విషయంలో భారత్ వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చిందని, ఇకపై ఉగ్రవాదానికి భారత్ బాధితురాలిగా మిగిలిపోదని, ఉగ్ర చర్యలకు శక్తియుక్తులతో వ్యూహాత్మకంగా బదులిస్తుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో నార్తర్న్ కమాండ్ వద్ద సైనికులతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా ఉగ్రవాదులకు, వారిని ప్రోత్సహిస్తున్న వారికి నవభారతం దృఢంగా, నిశ్చయంగా ఉందని, ఉగ్రవాదానికి బాధితురాలిగా ఉండబోదని, శక్తితో, వ్యూహంతో ప్రతిస్పందిస్తుందని బలమైన సందేశం పంపామని అన్నారు.…

AP

మద్యం మత్తులో రెచ్చిపోయిన యువకులు .. లోకేష్ సీరియస్ యాక్షన్..

భీమవరంలో కొంతమంది ఆకతాయిలు ప్రతి రోజూ రెచ్చిపోతున్నారు. మద్యం సేవించి వారు చేస్తున్న ఆగడాలకు అంతులేకుండాపోతోంది. గురువారం సాయంత్రం నారాయణ కాలేజీ భీమవరం వన్‌టౌన్ సీఎమ్‌ఆర్ వద్ద.. నారాయణ కాలేజీ బస్సులో విద్యార్ధినిని కొట్టి, దుర్భాషలాడి, రోడ్డుపై వీరంగం సృష్టించారు. బస్సులో వెళ్తున్న నన్ను ఎందుకు కొట్టావ్ అని ఆ విద్యార్ధి ప్రశ్నించగా.. విద్యార్ధినిపై దాడికి దిగారు ఆకతాయిలు. విద్యార్ధి బస్సు ఎక్కి వెళ్లిపోయినా.. ఆకతాయిలు మాత్రం బస్సును వెంబడించి, నడిరోడ్డుపై విద్యార్ధులను వెకిలి సేష్టలు చేస్తూ…

APTELANGANA

చంద్రబాబుతో చర్చలకు రేవంత్‌రెడ్డి సిద్ధం..!

ఏపీతో ఎలాంటి వివాదాలు తాను కోరుకోవడం లేదని.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి భేషజాలు లేవని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును చర్చలకు ఆహ్వానిస్తామని చెప్పారు. గోదావరి జలాలపై రెండు రాష్ట్రాలు కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఫ్లడ్ వాటర్ తరలిస్తే బాగుంటుందని సూచించారు. గోదావరి, కృష్ణా నీటిని తరలించాలనే నిర్ణయమే మేజర్ సమస్య అన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై ఈ నెల 23న…