Editor

AP

జగన్‌కు షాక్.. కీలక నేత పార్టీకి గుడ్ బై ..

సార్వత్రిక ఎన్నికల ముందు అధికార పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. టికెట్ దక్కని నేతలు ఒక్కొక్కరు వైసీపీ నుంచి బయటకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వైసీపీకి రాజీనామా చేయగా, తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే యామిని బాల వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కొద్దికాలంగా అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్న యామిని బాల వైసీపీకి గుడ్…

AP

ఏపీలో రాజకీయ పార్టీలకు సీఈవో ఊరట..!

ఏపీలో రాజకీయ పార్టీలకు ఎన్నికల వేళ సీఈవో ముకేష్ కుమార్ మీనా భారీ ఊరటనిచ్చారు. ముఖ్యంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇంటింటి ప్రచారానికై ముందస్తుగా అనుమతులు తీసుకోవాల్సిందేనని గతంలో ఆదేశాలు ఇచ్చిన ఆయన.. ఇవాళ మాత్రం కాస్త వెసులుబాటు ఇచ్చారు. ఇంటింటి ప్రచార అనుమతి విషయంలో తగిన వివరణకై భారత ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపామని, ఈ అంశంలో తగిన వివరణ అందేలోపు ముందస్తు సమాచారాన్ని సంబంధిత ఆర్వోకు, పోలీస్ స్టేషన్ కు ఇస్తే చాలన్నారు.  …

TELANGANA

సీబీఐ విచారణ వ్యతిరేకిస్తూ కోర్టుకెళ్ళిన కవితకు కొత్త టెన్షన్..!

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇప్పటికే ఈడీ విచారణతో ఉన్న కవితను వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. ఒకపక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బిగిస్తున్న ఉచ్చు తోనే విలవిలలాడుతున్న కవిత, ఇప్పుడు కొత్తగా సిబిఐ విచారణను కూడా ఎదుర్కోబోతున్నారు. ఇక ఈ నేపద్యంలో సిబీఐ విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు.   సీబీఐ విచారణపై కోర్టును ఆశ్రయించిన కవిత ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో విచారించడానికి అనుమతి తీసుకున్న సిబిఐ…

TELANGANA

బీఆర్ఎస్‌ను తుక్కుతుక్కు చేసినట్టే బీజేపీని చేయాలి..

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని తుక్కుతుక్కు చేసినట్లే దేశంలో బీజేపీని తుక్కుతుక్కుగా తొక్కాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గోదావరి, కృష్ణా నదులు కలిసి తుక్కుగూడలో సునామీ సృష్టిస్తే ఎలా ఉంటుందో అలా ఉందని అన్నారు.   లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. జూన్ 9 ఢిల్లీలో మువ్వెనల జెండా ఎగరాలని అన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల కష్టం వల్ల తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు.…

CINEMA

ప్రభాస్ ‘కల్కి’ మూవీ రిలీజ్ వాయిదా.. కొత్త డేట్ ఖరారు..!

ప్రభాస్ నటిస్తోన్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీ కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సైన్స్ ఫిక్సన్, పురాణాల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుండటంతో ఈ మూవీపై ఫుల్ హైప్ ఉంది. ‘మహానటి’ ఫేం నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.   అయితే ఇప్పుడు మరో వార్త బయటకొచ్చి సినీ ప్రియుల్ని, అభిమానుల్ని నిరాశపరిచింది. అదేంటనే విషయానికొస్తే..…

TELANGANA

10వేల మందితో మేడిగడ్డ ముట్టడికి ముహూర్తం ఫిక్స్.. రైతులకు కేసీఆర్ పిలుపు..!

తెలంగాణ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో నీటి ఎద్దడి చోటు చేసుకోగా పంటలు ఎండిపోతున్న పరిస్థితులపై బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ దృష్టిసారించి నేడు పొలం బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడుకరీంనగర్‌ జిల్లా రూరల్‌ మండలం ముగ్ధుంపూర్‌లో ఎండిపోయిన పంటలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పొలాలకు నీటి సమస్యలపై రైతులను వివరాలను అడిగి తెలుసుకున్నారు.   రైతులతో మాట్లాడిన కేసీఆర్ పలువురు రైతులు కేసిఆర్ ముందు సమస్యలు ఏకరువు పెట్టారు. గత…

TELANGANA

ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు మరో షాక్.. సీబీఐ విచారణకు రంగం సిద్ధం..

ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను విచారించేదుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ రూస్ అవెన్యూ కోర్టులో దరఖాస్తు దాఖలు చేసింది. తాజాగా కోర్టు కవితను విచారించేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో సీబీఐ వచ్చే వారం కవితను విచారించనుంది. కాగా విచారణకు ఒక రోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని కోర్టు సీబీఐను ఆదేశించింది. మహిళా కానిస్టేబుల్ సమక్షంలో కవితను ప్రశ్నించాలని కోర్టు…

AP

ఎప్రిల్ 7 నుంచి ఉత్తరాంధ్రలో వారాహి విజయభేరి యాత్ర..

ఏప్రిల్ 7 నుంచి పవన్ కల్యాణ్ వారాహి విజయభేరి యాత్ర ఉత్తరాంధ్రలో నిర్వహించనున్నారు. స్వల్ప అస్వస్థత కారణంగా పవన్ ఎన్నికల ప్రచారానికి బ్రేక్ పడింది. పిఠాపురంలో వారాహి విజయభేరి ప్రచార యాత్ర తర్వాత పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన కోలుకోవడంతో మళ్లీ ప్రచారంలోకి దిగనున్నారు. ఏప్రిల్ 7 నుంచి ఉత్తరాంధ్రలో వారాహి యాత్ర నిర్వహించనున్నారు.   యాత్రలో భాగంగా అనకాపల్లిలో 7న సభ నిర్వహించనున్నారు. 8న ఎలమంచిలి, 9న పిఠాపురంలో సభ…

AP

టీడీపీలో చేరిన రఘురామకృష్ణ రాజు.. పోటీ ఎక్కన్నుంచో మరి..?

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు తెలుగు దేశం పార్టీలో చేరారు. పాలకొల్లు సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. టీడీపీ కండువా కప్పి చంద్రబాబు ఆయన్ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.   ఈ సందర్భంగా రఘురామకృష్ణ రాజు మాట్లాడుతూ.. చంద్రబాబు చొరవతోనే ప్రజలముందుకొచ్చాని తెలిపారు. టీడీపీ అధినేత, ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. జూన్ 4న చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాలలో ప్రభంజనం సృష్టించబోతున్నారని పాలకొల్లు సభలో అన్నారు.  …

National

డ్రైవర్ లేకుండా మెట్రో రైలు పరుగులు.. ఎక్కడో తెలుసా..?

లోకోపైలట్ లేకుండా నడిచే మెట్రో రైళ్లు దేశంలో తొలిసారిగా అందుబాటులోకి రానున్నాయి. ఈ సర్వీస్ మొట్టమొదటి సారిగా చెన్నైలో రానుంది. ఈ మేరకు ఆగస్టు నెలలో మొదటి డ్రైవర్ లెస్ మెట్రో రైలు పట్టాలపై పరుగులు పెట్టనుంది.   ఈ సందర్భంగా చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్ట్ అధికారులు మాట్లాడుతూ.. రాబోయే నెలలో అదనపు డ్రైవర్ లెస్ సెట్లు వస్తాయని వెల్లడించారు. 26 కిలో మీటర్ల మేరా 28 మెట్రో స్టేషన్లను ఈ ప్రాజెక్టులో భాగం చేయనున్నారు.…