రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేది ఎక్కడో వెల్లడించిన వైఎస్ జగన్..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో పర్యటిస్తోన్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్సొరేషన్-వీఎంఆర్డీఏ సంయుక్తంగా అభివృద్ధి చేసిన 1,500 కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులను- మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, విడదల రజినితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం రాడిసన్ బ్లూ హోటల్లో నిర్వహించిన విజన్ విశాఖ సదస్సుకు హాజరయ్యారు. ఈ సదస్సులో 2,000 మందికి పైగా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. వారితో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి గల…

