సిద్దిపేట జిల్లాలో కలకలం: అంతుచిక్కని వ్యాధితో 8,400 కోళ్లు మృతి.. రూ. 20 లక్షల నష్టంతో రైతు కన్నీరు!
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అందె గ్రామంలో ఒక కోళ్ల రైతుకు భారీ నష్టం వాటిల్లింది. గ్రామానికి చెందిన రంగనబోయిన కుమార్ అనే రైతు తన ఫారంలో సుమారు నెల రోజుల వయసున్న కోళ్లను పెంచుతున్నారు. అయితే, గత రెండు రోజులుగా కోళ్లకు అంతుచిక్కని వ్యాధి సోకడంతో ఒక్కొక్కటిగా మృత్యువాత పడ్డాయి. సోమవారం ప్రారంభమైన ఈ మరణాల పరంపర మంగళవారం నాటికి తీవ్రమై, సుమారు 8,400 కోళ్లు చనిపోవడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. సరిగ్గా కోళ్లు చేతికొచ్చే…

