4news HD TV

APCINEMA

ప్రముఖ నటుడు చంద్రమోహన్ కన్నుమూత

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నటుడు హైదరాబాద్‌ః తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. మరో దిగ్గజ నటుడిని పరిశ్రమ కోల్పోయింది. ప్రముఖ నటుడు చంద్రమోహన్ కొద్దిసేపటి క్రితం ఆసుపత్రిలో కన్నుమూశారు. ఉదయం 8:45 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమోహన్.. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస వదిలారు. మొత్తం 932 సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించి, తెలుగు ప్రేక్షకులను అలరించారాయన. ఆయన వయస్సు 82 సంవత్సరాలు.…

Uncategorized

ఏపీకి జగన్ ఎందుకు కావాలంటే ? రెండే లక్ష్యాలతో వైసీపీ అడుగులు-టార్గెట్ 2024…

వై ఏపీ నీడ్స్ జగన్ : ఏపీలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి 2019 ఫీట్ ను రిపీట్ చేయడంతో పాటు అంతకంటే మెరుగ్గా 175/175 ఫలితాన్ని సాధించేందుకు అధికార వైసీపీ అడుగులేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే చేస్తున్న కార్యక్రమాలతో పాటు వై ఏపీ నీడ్స్ జగన్ ( జగన్ ఎందుకు కావాలి) కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం క్యాడర్ ను ముందుగా సన్నద్ధం చేస్తోంది. సీఎం జగన్ నేరుగా ఈ కార్యక్రమాన్ని…

AP

శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. సైట్ మార్చిన ttd

తిరుమల తిరుపతి దేవస్థానం తన అధికారిక వెబ్ సైట్ ను మార్చింది. ప్రస్తుతం tirupatibalaji.ap.gov.in అని ఉండగా.. తాజాగా ఆ పేరును ttdevasthanams.ap.gov.in అని మార్చారు. ఈ మార్పును భక్తులు గమనించాలని టీటీడీ కోరింది. ‘వన్ ఆర్గనైజేషన్, వన్ వెబ్‌సైట్, వన్ మొబైల్ యాప్’లో భాగంగా ఆన్‌లైన్ బుకింగ్ వెబ్‌సైట్ tirupatibalaji.ap.gov.in ను ఇప్పుడు ttdevasthanams.ap.gov.in గా మార్చామని తెలియజేశారు. భక్తులు ఇకనుంచి tirupatibalaji.ap.gov.in కాకుండా ఆన్‌లైన్ బుకింగ్‌ల కోసం ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌ను ఉపయోగించాలని అధికారులు సూచించారు.…

APNational

తిరుమలలో గరుడసేవ, ఎన్ని లక్షలాది మంది భక్తులు, గోవిందా గోవింద, జన్మధన్యం స్వామి!

తిరుమల/తిరుపతి: కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువుతీరిన తిరుమలలో (Tirumala) నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavam) భాగంగా గురువారం సాయంత్రం 6.30 గంటలకు గరుడ వాహనంపై (Garuda Vahana) శ్రీవారు విహరించారు. తిరుమలలోని (Tirumala) తిరుమాడ వీధుల్లో విహరిస్తున్న శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి లక్షలాది మంది శ్రీవారి భక్తులు వెయ్యి కళ్లతో వేచి చూశారు. శ్రీవారి భక్తులతో తిరుమాడ వీధులు కిక్కిరిసిపోయాయి.   తిరుమలలో (Tirumala) గురువారం ఉదయం నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavam) భాగంగో తిరుమాడ వీధుల్లో మోహనీ అవతారంలో శ్రీదేవి, భూదేవి…

TELANGANA

వంద జన్మలెత్తినా సాధించలేరు: రాహుల్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్

హైదరాబాద్: తెలంగాణలో మూడు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అధికార బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ విమర్శలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు. తెలంగాణ జరిగిన అభివృద్ధి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ‘రాహుల్ జీ.. దేశానికే టీచింగ్ పాయింట్.. తెలంగాణ. మంథని దాకా వెళ్లారు.. పక్కనే కాళేశ్వరం.. ప్రపంచంలోనే అతిపెద్ద కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించండి.…

TELANGANA

టీఆర్ఎస్‌కు సిలిండర్ గుర్తు కేటాయించిన ఎన్నికల సంఘం

అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ రాజ్య సమితి (TRS)కు కేంద్ర ఎన్నికల సంఘం సిలిండర్ గుర్తును కేటాయించింది. సిద్దిపేట జిల్లా పొన్నాలకు చెందిన తుపాకుల బాలరంగం. ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన ఉద్యమకారులతో కలిసి తెలంగాణ రాజ్య సమితిని రిజిస్టర్ చేసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తామని ఎన్నికల సంఘానికి ఈ పార్టీ దరఖాస్తు చేసుకుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తిని పరిశీలించిన ఈసీ పలు షరతులతో…

National

ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక సోదరుడికి ఉద్యోగం: మంత్రి కేటీఆర్ హామీ!!

ప్రవళిక ఆత్మహత్య కేసులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రవళిక కుటుంబసభ్యులు మంత్రి కేటీఆర్ ను కలిశారు. ప్రవళిక మృతికి కారణమైన వ్యక్తికి తప్పకుండా తగిన శిక్ష పడేలా చూస్తామని ప్రవళిక కుటుంబ సభ్యులతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అర్హతలను బట్టి ఆమె సోదరుడికి మానవతా కోణంలో ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇప్పిస్తానని ప్రవళిక కుటుంబ సభ్యులకు మంత్రి హామీ ఇచ్చారు. ఇటీవల హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డ వరంగల్ జిల్లా బిక్కాజీపల్లికి…

National

అదానీ గ్రూపు అక్రమాలపై పోరాడుతున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇవాళ మరో సంచలన ఆరోపణ

అదానీ గ్రూపు అక్రమాలపై పోరాడుతున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇవాళ మరో సంచలన ఆరోపణ చేశారు. ఫైనాన్షియల్ టైమ్స్ లో వచ్చిన ఓ కథనాన్ని ఆధారంగా చేసుకుని రాహుల్ అదానీ గ్రూపును టార్గెట్ చేశారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న బొగ్గు ధరల్ని అధికంగా చూపి ప్రజలకు 12 వేల కోట్ల మేర అదనపు కరెంటు బిల్లుల మోత మోగిస్తోందని రాహుల్ ఆరోపించారు. దీనిపై ప్రధాని మోడీ మౌనాన్ని కూడా రాహుల్ ప్రశ్నించారు. అదానీ గ్రూపు…

National

రైతులకు శుభవార్త చెప్పిన కేంద్రం.. ఆరు పంటలకు మద్దతు ధర పెంపు

కేంద్ర క్యాబినెట్.. రైతులకు శుభవార్త చెప్పింది. 2024-25 సంవత్సరానికి గోధుమలతో సహా ఆరు రబీ పంటలకు కనీస మద్దతు ధరలను (MSP) కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించింది. కందులపై క్వింటాల్ రూ. 425 రూపాయలు పెంచగా.. గోధుమలకు క్వింటాకు రూ. 150 పెంచారు. బార్లీ మద్దతు ధర క్వింటాకు రూ.115 పెంచారు. ధరల పెంపు తర్వాత గోధుమలు క్వింటాల్ కు రూ.2,275, బార్లీ క్వింటాల్ కు రూ. 1850, కందులకు క్వింటాల్ కు రూ. 6425 అవుతాయి.…

National

అంకాపూర్ చికెన్ తినేసి వెళ్లండి: రాహుల్ గాంధీ పర్యటనపై కవిత సెటైర్లు

హైదరాబాద్: తెలంగాణ పర్యటనకు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శలు ఎక్కుపెట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ ప్రజలంతా బాగానే ఉన్నారని.. ఇప్పుడున్న మంచి వాతావరణాన్ని మళ్లీ చెడగొట్టవద్దని కాంగ్రెస్​ నేతలకు కవిత సూచించారు. బుధవారం నుంచి మూడ్రోజుల పాటు రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో కవిత ఆయన పర్యటనపై విమర్శలు గుప్పించారు. విభజన చట్టంలోని తెలంగాణకు రావాల్సిన వాటాల గురించి రాహుల్​ ఎప్పుడైనా ప్రశ్నించారా? అని కవిత నిలదీశారు. అందుకే రాహుల్​…