4news HD TV

Technology

గ్రౌండ్‌ రిపోర్ట్‌: వెలమకోటలో బీసీల కొట్లాట..

కరీంనగర్‌.. ఉద్యమాల పురిటిగడ్డ. తెలంణలోనే కాదు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కరీంనగర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలంగాణ మలిదశ ఉద్యమం కరీంనగర్‌ నుంచే ఉవ్వెత్తున ఎగిసింది. ఇక తెలంగాణ ఉద్యమసారథి కె.చంద్రశేఖర్‌రావును ఉప ఎన్నికల్లో గెలిపించి తెలంగాణ వాదాని గట్టిగా వినిపించింది. పోరాటాలు, ఉద్యమాలకు నెలవైన కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి 15 ఏళ్లుగా గంగుల కమలాకర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హ్యాట్రిక్‌ విజయం సాధించిన గంగుల ప్రస్తుతం తెలంగాణ క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన…

National

ఎవరీ సుప్రీంకోర్టుకు మరో ఇద్దరు కొత్త న్యాయమూర్తులు. జస్టిస్ ఉజ్వల్ భూయాన్, వెంకటనారాయణ భట్టి..?

సుప్రీంకోర్టు (Supreme Court)లో బుధవారం (జూలై 12) మరో ఇద్దరు న్యాయమూర్తులు నియమితులయ్యారు. జస్టిస్ ఉజ్వల్ భుయాన్ (Justice Ujjal Bhuyan), జస్టిస్ ఎస్. వెంకటనారాయణ భట్టి (Justice S. Venkatanarayana Bhatti)లకు పదోన్నతి కల్పించాలని కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. న్యాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ ఇద్దరు న్యాయమూర్తుల నియామకాన్ని ప్రకటించారు. జూలై 5న జస్టిస్ ఉజ్వల్ భుయాన్, జస్టిస్ భట్టి పేర్లను కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. గతంలో జస్టిస్…

CINEMA

బ్రో సినిమాపై పవన్ పొలిటికల్ కామెంట్స్ ఎఫెక్ట్..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ(Janasena Party)ని గెలిపించాలనే పట్టుదలతో ఉన్న పవన్ కల్యాణ్ వారాహి యాత్ర నిర్వహిస్తున్నారు. వారాహి యాత్ర ప్రారంభించే ముందు పవన్ కల్యాణ్ కొన్ని సినిమాల్లో నటించారు. ఓ వైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో తీరిక లేకుండా గడుపుతున్నారు పవన్. అయితే ఆయన పొలిటికల్ కామెంట్స్.. ప్రభావం సినిమాలపై ఉంటుందని అంటున్నారు. పవన్ కల్యాణ్ ఇప్పటికే బ్రో(Bro), ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు(HariHara Veeramallu) సినిమాల్లో నటించాడు. మరికొద్ది రోజుల్లో బ్రో…

World

మోదీ పర్యటన వేళ- భారతీయులకు శుభవార్త వినిపించిన ఫ్రాన్స్

పారిస్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఫ్రాన్స్ పర్యటన ఆరంభమైంది. ఈ మధ్యాహ్నం ఆయన పారిస్‌లో ల్యాండ్ అయ్యారు. విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఎలిజబెత్ బోర్నె స్వయంగా ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి మోదీకి స్వాగతం పలికారు. అక్కడే సైనిక వందనాన్ని స్వీకరించారు మోదీ. ప్రవాస భారతీయులు ఆయనను కలుసుకున్నారు. అనంతరం ఫ్రాన్స్‌లో స్థిరపడిన ప్రవాస భారతీయులతో భేటీ అయ్యారు. ఇండియన్ డయాస్పొరాను ఉద్దేశించి ప్రసంగించారు. చంద్రయాన్ 3 ప్రయోగం సహా అనేక అంశాలను ప్రస్తావించారు.…

AP

టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలతో ప్రస్తుతం ఆసక్తికరచర్చ

వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి విశాఖ వేదికగా పరిపాలన రాజధాని ఉండబోతుందని, త్వరలోనే విశాఖ నుండి పాలన ప్రారంభం అవుతుందని అనేకమార్లు ప్రకటనలు చేశారు. అయితే అది ఈ నాటికీ నెరవేరలేదు. ఇక తాజాగా విశాఖకు సీఎం జగన్ షిఫ్ట్ కాబోతున్నారని, త్వరలోనే పాలన అక్కడ నుండి మొదలవుతుందని టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలతో ప్రస్తుతం ఆసక్తికరచర్చ జరుగుతుంది. నేడు టిటిడి చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి…

TELANGANA

అయ్యో చెన్నమనేని.. వేములవాడలో ఇంత పనైందేంటి?

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఈసారి హ్యాట్రిక్ సాధించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఆ దిశగానే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందుకే ఎంత కష్టమైనప్పటికీ తన సర్వేలో ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో బాగానే చాలామందికి ఇన్ డైరెక్ట్ గా సంకేతాలు ఇచ్చారని తెలుస్తోంది.. అయితే ముఖ్యమంత్రి సంకేతాలు ఇవ్వడంతో కొంతమంది పార్టీలో ఉండకూడదని ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇలా ఎన్నికల మొదట అధికార…

National

చంద్రయాన్‌కి 40 రోజులు ఎందుకు?

జాబిల్లి(Moon)పై అన్వేషణ కోసం ఇస్రో(ISRO) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3(Chandrayaan 3)ని నేడు లాంచ్ చేశారు. చంద్రయాన్-3 ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. చంద్రుని దిశగా తన ప్రయాణాన్ని చంద్రయాన్ 3 ప్రారంభించింది. చంద్రయాన్ 3 చంద్రుడి వద్దకు వెళ్ళడానికి దాదాపు 40 రోజులు సమయం పడుతుంది. కానీ గతంలో అమెరికా(America) చంద్రుడి మీదకు నాలుగు రోజుల్లో, రష్యా(Russia) రెండు రోజుల్లోనే వెళ్లాయి. మరి మన చంద్రయాన్ కి ఎందుకు అంత ఎక్కువ…

CINEMA

‘సలార్‌’పై డిస్ట్రిబ్యూటర్స్ డౌట్.. నిర్మాతల డేరింగ్ డెసిషన్!

ప్రభాస్ నటించిన సలార్ సినిమా(Salaar) కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాలతో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సలార్ ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. అన్ని భాషల్లోనూ విపరీతమైన క్రేజ్‌ను పొందుతుంది ఈ సినిమా. ఒక చిన్న టీజర్ రెండు రోజుల పాటు సోషల్ మీడియాను షేక్ చేసింది. KGF దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వం వహించినందున, సలార్ ‘మిస్‌ఫైర్’ అయ్యే అవకాశాల గురించి ప్రభాస్ అభిమానులు ఆందోళన చెందడం లేదు.…

World

ప్రధాని మోడీకి యూఏఈ అధ్యక్షుడు ప్రత్యేక విందు: భారత్-యూఏఈల మధ్య కీలక ఒప్పందాలు

దుబాయ్: ఫ్రాన్స్ పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ యూఏఈకి చేరుకున్నారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ శనివారం అబుదాబికి చేరుకున్నారు. ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. అనంతరం ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందాలు చోటు చేసుకున్నాయి. సరిహద్దు లావాదేవీల కోసం స్థానిక కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించడానికి, వారి చెల్లింపు, సందేశ వ్యవస్థలను ఇంటర్‌లింక్ చేయడానికి భారతదేశం, యూఏఈ సెంట్రల్ బ్యాంక్‌లు రెండు అవగాహన…

AP

సీఐ అంజూయాదవ్ పై చర్యలకు రంగం సిద్దం – పవన్ పర్యటన వేళ..!!

శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ పై చర్యలకు పోలీసు అధికారులు సిద్దమయ్యారు. శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడిపై అంజూయాదవ్ చేయి చేసుకోవటం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటన పై రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. నివేదిక కోరింది. ఇటు పవన్ 17న కాళహస్తికి రానున్నారు. సీఐ పైన ఎస్పీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఈ సమయంలోనే జిల్లా పోలీసు అధికారుల నుంచి సీఐపైన నివేదిక ఉన్నతాధికారులకు చేరింది. అంజూయాదవ్ వివాదాస్పదంగా పోలీసు అధికారిణి అంజూయాదవ్ వ్యవహార…