అంకాపూర్ చికెన్ తినేసి వెళ్లండి: రాహుల్ గాంధీ పర్యటనపై కవిత సెటైర్లు
హైదరాబాద్: తెలంగాణ పర్యటనకు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శలు ఎక్కుపెట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ ప్రజలంతా బాగానే ఉన్నారని.. ఇప్పుడున్న మంచి వాతావరణాన్ని మళ్లీ చెడగొట్టవద్దని కాంగ్రెస్ నేతలకు కవిత సూచించారు. బుధవారం నుంచి మూడ్రోజుల పాటు రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో కవిత ఆయన పర్యటనపై విమర్శలు గుప్పించారు. విభజన చట్టంలోని తెలంగాణకు రావాల్సిన వాటాల గురించి రాహుల్ ఎప్పుడైనా ప్రశ్నించారా? అని కవిత నిలదీశారు. అందుకే రాహుల్…

