ఢిల్లీలో తెలంగాణ భవన్లో యువతి ఆత్మహత్యాయత్నం
న్యూఢిల్లీ: తెలంగాణ భవన్ ప్రాంగణంలో మంచిర్యాలకు చెందిన ఆరిజిన్ డెయిర్ సీఈవో బోడపాటి శేజల్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే స్పందించిన తెలంగాణ భవన్ సిబ్బంది ఆమెను ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి కొంత నిలకడగా ఉన్నట్లు తెలిసింది. శేజల్ గత కొంతకాలంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. మానసికంగా, లైంగికంగా ఎమ్మెల్యే చిన్నయ్య వేధిస్తున్నాడని ఆరోపించింది.రెండ్రోజుల…

