News

TELANGANA

భూసేకరణను 3 నెలల్లో పూర్తి చేయాలి.. అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి…

రీజనల్‌ రింగ్‌ రోడ్డు(Regional Ring Road) ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ భూసేకరణను 3 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. భూ సేకరణతో పాటు ఆర్‌ఆర్‌ఆర్‌(నార్త్) పనులకు టెండర్లు పిలవాలని పేర్కొన్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు అవతల నిర్మించే ఈ రీజినల్‌ రింగ్‌ రోడ్డు భూసేకరణ ప్రక్రియ కొంతకాలంగా పెండింగ్ లో పడింది.   ఆర్‌ఆర్‌ఆర్‌ సౌత్ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డి…

TELANGANA

తెలంగాణలో నాలుగో పారిశ్రామిక విప్లవం.. దావోస్‌లో ఒప్పందాలు..!

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(World Economic Forum) ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్(Fourth Industrial Revolution) హైదరాబాద్‌లో ప్రారంభించేందుకు ఒప్పందం కుదిరింది. బయో ఏషియా -2024 సదస్సులో భాగంగా ఫిబ్రవరి 28న ఇది ప్రారంభం కానుంది.   సీఎం రేవంత్‌ రెడ్డి(Revanth Reddy) సారధ్యంలో రాష్ట్ర ఆరోగ్య సంరక్షణను మెరుగుపరిచే సాంకేతిక ఆధారిత కార్యక్రమం రూపుదిద్దుకుంటుంది. ఈ వరల్డ్ ఎకనామిక్…

National

ప్రజలకు టెలికాం శాఖ హెచ్చరిక..

దేశ ప్రజలకు టెలికాం శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. టెలికామ్ కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నట్లు కాల్ చేసి *401# డయల్ చేయమని కోరితే అలాంటి వాటికి స్పందించొద్దని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DOT) వెల్లడించింది. ఇది ప్రజలను మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు వేస్తున్న మరో ఎత్తుగడ అని తెలిపింది. ఆ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు రావాల్సిన కాల్స్ గుర్తు తెలియని వ్యక్తులకు వెళ్లిపోతాయని పేర్కొంది.

AP

చంద్రబాబు స్కిల్ కేసుపై తీర్పు..

స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. త్వరలో ఎన్నికలు జరగనున్నందున ఎలాంటి తీర్పు వస్తుందోనన్న ఉత్కంఠ టీడీపీ నాయకుల్లో నెలకొంది. 17ఏ ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా కేసు నమోదు చేయడం కుదరదని చంద్రబాబు తరఫు లాయర్లు, అవినీతి కేసుల్లో ఈ నిబంధన వర్తించదని సీఐడీ తరఫు లాయర్లు వాదనలు వినిపించిన విషయం విధితమే.

AP

ఒంగోలు ఎంపీగా పోటీ, వైసీపీలో రాజీనామాల పర్వంపై మౌనం వీడిన వైవీ సుబ్బారెడ్డి..

సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆ దిశగా ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మూడు విడతల్లో 59 లోక్‌సభ/అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.   తెలుగుదేశం పార్టీ- జనసేన తమ అభ్యర్థుల జాబితాలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తరువాతే అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించింది. షెడ్యూల్ వెలువడటానికి, పోలింగ్ తేదీకి మధ్య సుమారు 40…

TELANGANA

దావోస్‌లో రేవంత్ రెడ్డి పర్యటన ..

తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పెట్టుబడులపై దృష్టి సారించారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు తీసుకుంటోన్నారు. పారిశ్రామిక, ఐటీ విధానాలపై కసరత్తు సాగిస్తోన్నారు. త్వరలోనే దీన్ని ప్రకటించే అవకాశం ఉంది.   పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో ఆయన దావోస్‌ పర్యటనకు శ్రీకారం చుట్టారు. స్విట్జర్లాండ్‌లో ఈ సిటీలో ప్రతి సంవత్సరం ఏర్పాటయ్యే ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరయ్యారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత రేవంత్ రెడ్డి…

NationalTELANGANA

ఎమ్మెల్సీ కవితకు మళ్లీ ఈడీ పిలుపు..

దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో కీలక పరిణామం సంభవించింది. భారత్ రాష్ట్ర సమితి సీనియర్ నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత.. ఈ కేసులో మరోసారి విచారణను ఎదుర్కొనాల్సిన పరిస్థిితి ఏర్పడింది.   ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును దర్యాప్తు చేస్తోన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కవితకు సమన్లను జారీ చేశారు. మంగళవారం విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు ఇచ్చారు. విచారణలో భాగంగా ఉదయం తమ కార్యాలయానికి రావాల్సి ఉంటుందని సూచించారు.  …

CINEMA

రాజా సాబ్‌గా ప్రభాస్ ఎంట్రీ.. ఊహించని గెటప్‌లో.. ఇది కదా అసలైన సంక్రాంతి సర్‌ప్రైజ్..

తెలుగు చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ కాలం పాటు తనదైన చిత్రాలతో ప్రేక్షకులను, అభిమానులను అలరించి.. ఈ మధ్య కాలంలో బహు భాషా చిత్రాలను చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాలతో సత్తా చాటిన అతడు.. ఇటీవలే ‘సలార్: సీజ్‌ఫైర్’ మూవీతో వచ్చాడు. ఈ చిత్రంతో చాలా రోజుల తర్వాత ఓ విజయాన్ని అందుకున్నాడు.   ‘సలార్: సీజ్‌ఫైర్’ సక్సెస్ ఇచ్చిన జోష్‌లో ఉన్న రెబెల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు…

AP

‘అమరావతి’కి గుడ్ న్యూస్..

భారతీయ రైల్వే ప్రయాణికులకు, ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణికులకు మంచి శుభవార్త. కొన్నాళ్లుగా విజయవాడ నుంచి హుబ్లీ మధ్య నడుస్తోన్న అమరావతి ఎక్స్ ప్రెస్ రైలును నర్సాపూర్ వరకు పొడిగించారు. ఈ పొడిగించిన రైలును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు. విజయవాడ-నరసాపూర్ మధ్య డబ్లింగ్ పనులు పూర్తయ్యాయి.   వాస్తవానికి అమరావతి ఎక్స్ ప్రెస్ ను గత నవంబరు నుంచే నరసాపూర్ నుంచి నడుపుతున్నారు. అప్పట్లోనే కిషన్ రెడ్డిచేత ప్రారంభించడానికి…

AP

సంక్రాంతి పండుగ వేళ శుభవార్త ; ఏపీ హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సమయంలో ఏపీ హైకోర్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. రాష్ట్ర జ్యుడీషియల్‌ సర్వీసెస్‌లో భాగంగా 39 సివిల్‌ జడ్జి పోస్టుల(జూనియర్‌ డివిజన్‌)ను భర్తీ చేయటం కోసం నోటిఫికేషన్ జారీ అయ్యింది.   సివిల్‌ జడ్జి పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు జనవరి 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్య వివరాలు చూస్తే 39 పోస్టులు…