AP

APNational

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చ….

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. పార్లమెంటు ఆవరణలోని ప్రధాని కార్యాలయంలో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించారు. సీఎం జగన్‌కు కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ స్వాగతం పలికారు. పార్టీ కార్యాలయంలో ఎంపీలతో సీఎం జగన్‌ సమావేశమయ్యారు. మేరకు విజ్ఞాపన పత్రం అందించారు సీఎం జగన్.

AP

ఐదు నెలలు గడిచిన అందని మన ఊరి మనబడి బిల్లులు…

అందోల్ నియోజకవర్గం అల్లాదుర్గ్ గ్రామంలో నాలుగు నెలలు గడిచిన అందని మన ఊరు మనబడి బిల్లులు మండల కేంద్రం అల్లాదుర్గం ఎస్సీ కాలనీ అధికారులకు చెప్తున్నా పట్టించుకోని వైన్యం విద్యుత్ మూత్రశాలలు నీటి సౌకర్యం మేజర్ అండ్ మైనర్ రిపేర్ అన్ని కంప్లీట్ అయి నాలుగు నెలలు గడుస్తున్న ఏఈలు ముగ్గురు మారినా ఎంబీలు ఎవరు చేయడం లేదు చౌహన్ ఈశ్వర్ నాయక్ ఇన్చార్జిగా వచ్చారు, అధికారులు డబ్బులు రెడీగా ఉన్నాయి అని అంటారు కానీ నేను…

AP

ఏపీకి రెయిన్ అలెర్ట్…

ఏపీకి రెయిన్ అలెర్ట్ వచ్చేసింది అండి. ఒక ఉపరితల ఆవర్తనం బంగ్లాదేశ్, పొరుగు ప్రాంతాల నుండి ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్ వరకు Gangetic పశ్చిమ బెంగాల్, ఒడిశా మీద సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉంది. ఉత్తర అంతర్గత తమిళనాడు నుండి కొంకణ్ వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు దక్షిణ తమిళనాడు నుండి ఉత్తర కొంకణ్ వరకు తీరప్రాంతం, అంతర్గత కర్ణాటక, గోవా మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ.ఎత్తు వరకు…

AP

ఏపీ లో బడ్జెట్ సమావేశాలు.సంక్షేమం, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య రంగాలకు భారీ కేటాయింపులు..

సంక్షేమం, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య రంగాలకు భారీ కేటాయింపులు ప్రతిపాదిస్తూ రెండు లక్షల 80 కోట్ల రూపాయల బడ్జెట్‌ను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రైతు లేనిదే రాజ్యం లేదని నమ్మిన ప్రభుత్వం తమదని ప్రకటించిన ఆర్థిక మంత్రి, అన్నదాతల ఆదాయం పెంచడంపై దృష్టి సారించినట్టు తెలిపారు. పలికేది భాగవతమట, పలికించె వాడు రామభద్రుడంటూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తన ఐదో బడ్జెట్‌లో అసెంబ్లీ ముందుంచారు. స్వామి వివేకానంద చూపిన మార్గంలో తమ ప్రభుత్వం నడుస్తోందని తెలిపారు.…

AP

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి..

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌కు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 9 స్థానాలకు 139 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పట్టభద్రుల నియోజకవర్గ స్థానాలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు తలపడ్డారు. రేపు మధ్యాహ్నం తర్వాత ఫలితాల వెల్లడి మొదలవుతుంది. పూర్తి ఫలితాలు రావడానికి మూడు రోజుల సమయం పట్టవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 13న జరిగిన 9 ఎమ్మెల్సీ స్థానాల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 3 గ్రాడుయేట్‌, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థల…

AP

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల-2023 హాల్‌టికెట్లు విడుదల..

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల-2023 హాల్‌టికెట్లు విడుదలైనట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు ఇంటర్‌ బోర్డు సెక్రెటరీ శేషగిరిబాబు మంగళవారం (మార్చి 14) ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఎస్సెస్సీ లేదా మొదటి ఏడాది హాల్‌టికెట్‌ నంబరుతో థియరీ పరీక్షల హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. రెండో ఏడాది చదివే వారు మొదటి ఏడాది లేదా రెండో ఏడాది హాల్‌టికెట్‌ నంబరుతో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు. హాల్‌టికెట్లలో ఫొటోలు, సంతకాలు, ఇతర వివరాల్లో తప్పులు…

AP

జులైలో విశాఖ వెళ్తున్నాం..–: సీఎం జగన్…

జులైలో మనం విశాఖ వెళ్తున్నాం.. ఇక ఆలోచించాల్సిన పనిలేదు.. ఇదే ఫైనల్.. అంటూ సీఎం జగన్ మంత్రివర్గ సమావేశంలో పేర్కొన్నారు. దీంతో 7స్థానాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలను గెలవాలంటూ సూచించారు. ఏం తేడా వచ్చినా.. మంత్రివర్గంలో మార్పు తప్పదంటూ సీఎం జగన్ మంత్రులను హెచ్చరించారు. మీ పని తీరు గమనిస్తున్నా.. ఇకనైనా అలర్ట్ అవ్వండి అంటూ మంత్రులకు పలు కీలక సూచనలు చేశారు. ఏడెంటికి ఏడు ఎమ్మెల్సీలు గెలవాల్సిందేనంటూ పేర్కొన్న జగన్.. పలు విషయాలపై మంత్రులకు క్లారిటీ…

AP

ఎప్పటికైనా జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం..–: పవన్ కళ్యాణ్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న జనసేన పార్టీ పదవ వార్షిక ఆవిర్భావ సభను కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఘనంగా నిర్వహిస్తోంది. ఈ భారీ బహిరంగ సభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా తరలి రానున్నారు. ఇప్పటికే రెట్టించిన ఉత్సాహంతో ప్రతి ఒక్కరు మచిలీపట్నం చేరుకుంటున్నారు.…

AP

రైతులకు జగన్ సర్కార్ మరో శుభవార్త…

అన్నదాతలు అహర్నిశలు శ్రమించి సాగుచేసిన పంటలను అమ్ముకునే క్రమంలో దళారుల చేతిలో నిలువునా మోసపోతున్నారు. మద్దతు ధర దొరక్కపోవడంతో కనీసం పెట్టుబడులు కూడా రావడంలేదంటూ రైతన్నలు కన్నీరు పెడుతున్నారు. ఇలాంటి దళారుల మోసాలకు స్వస్తి పలుకుతూ ఆంధ్రప్రదేశ్‌ రైతులకు జగన్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. ప్రస్తుతం రబీ సీజన్ లో పండించే పప్పు, ధాన్యాల కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఏపీలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా.. 99,278 టన్నుల మినుములు,…

AP

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో మరో ట్విస్ట్…

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో కోట్లాది నిధులు దారి మళ్లాయన్న వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విచారణ వేగవంతం చేస్తుంది. ఇప్పటికే ఒక వైపు సిఐడి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంపై విచారిస్తుండగా.. మనీ ల్యాండరింగ్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే.. నలుగురు నిందితులను అరెస్టు చేసిన ఈ డి… ఈ కేసులో మరింత విచారణ కోసం కోర్టులో కస్టడి పిటిషన్‌ను దాఖలు చేసింది. దీంతో నలుగురు నిందితులను ఏడు రోజుల ఈడీ…