AP

AP

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు…

అల్లూరి జిల్లా దేవిపట్నం..   అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరు పేట గ్రామంలో అన్ని పార్టీల మండల నాయకుల ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోళ్ళ చంటిబాబు రాష్ట్ర sc సెల్ కార్యదర్శి మాట్లాడుతూ ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ నీ స్మరించుకోవడం ఎంతో అభినందనీయమని ఆయన అన్నారు. ఈయన స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ వేత్త బడుగు బలహీన వర్గాల నుండి వచ్చిన…

APTELANGANA

ఆంధ్రప్రదేశ్ మీడియా అక్రిడేషన్ నియమాల సవరణ.

ఆంధ్రప్రదేశ్ మీడియా అక్రిడేషన్ నియమాల సవరణ. 2019 నాటి జి.ఓ, నెంబర్ 142 సవరణ అంశాలు. సవరణ చేయబడిన జి.ఓ ద్వారా దరఖాస్తు దారులైన జర్నలిస్ట్ లు జతపరచాల్సిన పత్రాలు. జి ఓ ఎం.ఎస్:38 ప్రకారం సవరణలు. ■ 1పని చేస్తున్న మీడియా సంస్థ నుండి సిఫార్సు లేఖ. ■ 2 జర్నలిస్ట్ యొక్క విద్యా అర్హత సర్టిఫికేట్. ■ 3మీడియా సంస్థ జారీ చేసిన తాజా ID కార్డ్. ■ 4 సంస్థ జారీ చేసిన…

AP

ఏపీలో గోవుల అక్రమ రవాణా హైకోర్టు లో విచారణ..

ఏపీలో గోవుల అక్రమ రవాణా, సంతలు నిలుపుదల చేయా లని దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిగింది. రాష్ట్రంలో లంపీ స్కిన్ వ్యాధి నివారణకు ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ కు హైకోర్టు ఆదేశాలిచ్చింది. కేంద్రం గెజిట్ కు విరుద్ధంగా ఫిట్ నెట్ సర్టిఫికెట్లు ఇస్తున్న వారిపై ఏం కేసులు నమోదు చేశారు తెలపాలని డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.   దేశంలో, రాష్ట్రంలో గోవులు, వివిధ జంతువులకు లంపీ…

AP

ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఉమ్మడి కృష్ణ జిల్లాలో చంద్రబాబు పర్యటన….

ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు తన దూకుడు పెంచారు. వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నారు చంద్రబాబు. ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఉమ్మడి కృష్ణ జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. అసలే కృష్ణాజిల్లా రాజకీయం హాట్ హాట్ గా ఉంటుంది. అలాంటిది చంద్రబాబు కృష్ణా జిల్లా పర్యటన అనడంతో అంతటా ఉత్కంట నెలకొంది. మాజీ మంత్రి కొడాలి నాని కామెంట్లతో అసెంబ్లీకి రానంటూ సవాల్ విసిరాక తొలిసారిగా గుడివాడలో పర్యటించనున్నారు చంద్రబాబు. తొలిసారిగా నిమ్మకూరులో…

AP

ఏపీ లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు…

విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన ఉత్తర-దక్షిణ ద్రోణి/గాలులు కోత ఇప్పుడు జార్ఖండ్ నుంచి దక్షిణ అంతర్గత తమిళనాడు వరకు అంతర్గత ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తువద్ద కొనసాగుతున్నది. ఈ కారణంగా రాబోయే మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. ఒకట్రెండు చోట్ల మెరుపులు సంభవించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే మూడు రోజులకు వాతావరణ…

AP

వైసీపీని ఓడించడమే బీజేపీ జనసేన లక్ష్యం..–: పవన్ కల్యాణ్

బీజేపీ బడా నేతల్ని కలిసేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ పలువురు నేతల్ని కలిశాక ఈ రోజు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీ బీజేపీ ఇంచార్జి మురళీధరన్ కూడా పాల్గొన్నారు. అయితే సమావేశం జరిగిన అనంతరం బయటకు వచ్చిన పవన్ కల్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలన నుంచి ఏపీని విముక్తి చేయాలనే అంశాలపై చర్చించామని తెలిపారు. వైసీపీని…

AP

2023–24 సంవత్సరానికి సంబంధించి ఏపీ ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్‌ను సీఎం జగన్‌ ఆవిష్కరించారు

2023–24 సంవత్సరానికి సంబంధించి ఏపీ ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్‌ 2023–24 ను రాష్ట్ర  సీఎం జగన్‌ ఆవిష్కరించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సమాచార శాఖ కమిషనర్‌ తుమ్మా విజయ్‌కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 నెలల్లోనే వివిధ సంక్షేమ పథకాల ద్వారా 2,96,148.09 కోట్ల రూపాయలను లబ్ధిదారులకు అందించామన్నారు మంత్రి చెల్లుబోయిన. అనంతరం…

APTELANGANA

ఏప్రిల్ 8వ తేదీన సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందేభారత్ ట్రైన్ పరుగులు…

సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందేభారత్ ట్రైన్ పరుగులు పెట్టనుంది. ఏప్రిల్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల్లో భాగంగా హైదరాబాద్ విచ్చేయనున్న ప్రధాని మోదీ.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు రెండో వందేభారత్ రైలును గిఫ్ట్‌గా ఇవ్వనున్నారు. తొలి రోజు(ఏప్రిల్ 8) ఈ ట్రైన్ ఉదయం 11. 30 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుంది. ఆ తేదీన నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి,…

AP

వివిధ కాపు సంఘ నేతలతో చంద్రబాబు భేటీ..

ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పార్టీలు కులాల ఓట్లపై ఫోకస్ పెడుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అమరావతిలో కాపు సంఘాల నేతలతో భేటీ అవుతున్నారు. కాసేపట్లో వివిధ కాపు సంఘ నేతలతో చంద్రబాబు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబుతో భేటీకి కాపు సంఘాల ప్రతినిధులను ఆహ్వానించారు మాజీ మంత్రి చినరాజప్ప.   ప్రారంభం నుంచి కాపులు, బీసీలే టీడీపీకి అండగా ఉన్నారు…చిరంజీవి పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత కొంత గ్యాప్ వచ్చింది… గత ఎన్నికల్లో పవన్ పోటీ…

AP

ఏపీలో ఒంటిపూట బడులకు సంబంధించి ప్రభుత్వం ప్రొసీడింగ్స్ విడుదల..

ఏపీలో ఒంటిపూట బడులకు సంబంధించి ప్రభుత్వం ప్రొసీడింగ్స్ విడుదల చేసింది. ఈ నెల మూడో తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 07:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతుల నిర్వహణ ఉంటుంది. ఏప్రిల్ 30వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహిస్తారు. స్కూల్ ముగిశాక మధ్యాహ్న భోజనం అందివ్వాలని ఉత్తర్వులు జారీచేసింది విద్యాశాఖ. ఒకటవ తరగతి నుండి IX తరగతులకు ఉదయం 7.45 నుండి 12.30 వరకు HALF DAY…