AP

AP

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి..

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌కు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 9 స్థానాలకు 139 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పట్టభద్రుల నియోజకవర్గ స్థానాలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు తలపడ్డారు. రేపు మధ్యాహ్నం తర్వాత ఫలితాల వెల్లడి మొదలవుతుంది. పూర్తి ఫలితాలు రావడానికి మూడు రోజుల సమయం పట్టవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 13న జరిగిన 9 ఎమ్మెల్సీ స్థానాల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 3 గ్రాడుయేట్‌, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థల…

AP

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల-2023 హాల్‌టికెట్లు విడుదల..

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల-2023 హాల్‌టికెట్లు విడుదలైనట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు ఇంటర్‌ బోర్డు సెక్రెటరీ శేషగిరిబాబు మంగళవారం (మార్చి 14) ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఎస్సెస్సీ లేదా మొదటి ఏడాది హాల్‌టికెట్‌ నంబరుతో థియరీ పరీక్షల హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. రెండో ఏడాది చదివే వారు మొదటి ఏడాది లేదా రెండో ఏడాది హాల్‌టికెట్‌ నంబరుతో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు. హాల్‌టికెట్లలో ఫొటోలు, సంతకాలు, ఇతర వివరాల్లో తప్పులు…

AP

జులైలో విశాఖ వెళ్తున్నాం..–: సీఎం జగన్…

జులైలో మనం విశాఖ వెళ్తున్నాం.. ఇక ఆలోచించాల్సిన పనిలేదు.. ఇదే ఫైనల్.. అంటూ సీఎం జగన్ మంత్రివర్గ సమావేశంలో పేర్కొన్నారు. దీంతో 7స్థానాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలను గెలవాలంటూ సూచించారు. ఏం తేడా వచ్చినా.. మంత్రివర్గంలో మార్పు తప్పదంటూ సీఎం జగన్ మంత్రులను హెచ్చరించారు. మీ పని తీరు గమనిస్తున్నా.. ఇకనైనా అలర్ట్ అవ్వండి అంటూ మంత్రులకు పలు కీలక సూచనలు చేశారు. ఏడెంటికి ఏడు ఎమ్మెల్సీలు గెలవాల్సిందేనంటూ పేర్కొన్న జగన్.. పలు విషయాలపై మంత్రులకు క్లారిటీ…

AP

ఎప్పటికైనా జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం..–: పవన్ కళ్యాణ్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న జనసేన పార్టీ పదవ వార్షిక ఆవిర్భావ సభను కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఘనంగా నిర్వహిస్తోంది. ఈ భారీ బహిరంగ సభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా తరలి రానున్నారు. ఇప్పటికే రెట్టించిన ఉత్సాహంతో ప్రతి ఒక్కరు మచిలీపట్నం చేరుకుంటున్నారు.…

AP

రైతులకు జగన్ సర్కార్ మరో శుభవార్త…

అన్నదాతలు అహర్నిశలు శ్రమించి సాగుచేసిన పంటలను అమ్ముకునే క్రమంలో దళారుల చేతిలో నిలువునా మోసపోతున్నారు. మద్దతు ధర దొరక్కపోవడంతో కనీసం పెట్టుబడులు కూడా రావడంలేదంటూ రైతన్నలు కన్నీరు పెడుతున్నారు. ఇలాంటి దళారుల మోసాలకు స్వస్తి పలుకుతూ ఆంధ్రప్రదేశ్‌ రైతులకు జగన్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. ప్రస్తుతం రబీ సీజన్ లో పండించే పప్పు, ధాన్యాల కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఏపీలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా.. 99,278 టన్నుల మినుములు,…

AP

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో మరో ట్విస్ట్…

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో కోట్లాది నిధులు దారి మళ్లాయన్న వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విచారణ వేగవంతం చేస్తుంది. ఇప్పటికే ఒక వైపు సిఐడి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంపై విచారిస్తుండగా.. మనీ ల్యాండరింగ్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే.. నలుగురు నిందితులను అరెస్టు చేసిన ఈ డి… ఈ కేసులో మరింత విచారణ కోసం కోర్టులో కస్టడి పిటిషన్‌ను దాఖలు చేసింది. దీంతో నలుగురు నిందితులను ఏడు రోజుల ఈడీ…

AP

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న వైసిపి చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ ..

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న YCPపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రావారు టీడీపీ చీఫ్‌ చంద్రబాబు నాయుడు. మంత్రి ఉషశ్రీ చరణ్‌ని డబ్బుల పంపిణీపై క్యాడర్ కు, అధికారులకు సూచనలు ఇస్తున్న వీడియో బయట పడిందని గుర్తు చేశారు. వైసీపీ బోగస్ ఓట్లకు సహకరించేందుకే పోలీసులు ఈ అరెస్టులు చేస్తున్నారన్న చంద్రబాబు.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలి. పోలింగ్‌లో అక్రమాలు, వైసీపీ దౌర్జన్యాలు, అక్రమ అరెస్టులను…

AP

కాంగ్రెస్ కు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడికి పంపించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లుగా అందులో పేర్కొన్నారు. ఇదిలావుంటే, రాజకీయ అజ్ఞాతం వీడి.. కొత్త పోలిటికల్ రీఎంట్రీకి సిద్ఢమయ్యారు. సెడన్ గా తన ఆలోచన మార్చుకున్నారు. కాంగ్రెస్‌కు మరోసారి బైబై చెప్పి.. కాషాయం కండువా కప్పుకోబోతున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.  …

APTELANGANA

తెలుగు రాష్ట్రాల్లో MLC ఎన్నికల పోలింగ్‌..

తెలుగు రాష్ట్రాల్లో MLC ఎన్నికల పోలింగ్‌ మొదలైంది. ఏపీలో మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతుండగా.. 3 పట్టభద్రులు, 2 టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలున్నాయి. తెలంగాణలో ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి పోలింగ్ జరుగుతోంది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌.. సాయంత్రం 4 గంటల వరకు సాగనుంది. మొత్తం 29,720 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా.. ఎన్నికల అధికారులు 137 పోలింగ్ కేంద్రాలను…

APTELANGANA

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు..

తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్‌, ఉపాధ్యాయ MLC స్థానాలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. ఓటర్లకు తాయిలాలు పంచేందుకు ప్రధాన పార్టీలు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. సోమవారం జరిగే ఎన్నికలకోసం అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 3 గ్రాడ్యుయేట్‌, 2 టీచర్‌ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. చివరిరోజు కావడంతో ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకోవాలని అధికారపార్టీ ఉవ్విలూరుతుండగా, అటు విపక్షాలు ఆ స్థానాలను దక్కించుకునేందుకు జోరుగా…