ప్రభుత్వోన్నత పాఠశాలలో 1983-84వ సంవత్సర పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక
కాకినాడ జిల్లా కిర్లంపూడి శ్రీ కొక్కొండ రామశేషగిరి రావు పంతులు ప్రభుత్వోన్నత పాఠశాలలో 1983-84వ సంవత్సర పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఘనంగా నిర్వహించారు.ముందుగా పాఠశాలకి చేరుకొని ఆనాటి మధుర జ్ఞాపకాలను ప్రతిఒక్కరూ నెమరు వేసికొన్నారు.ఈ సందర్భంగా విద్యాబుద్ధులని నేర్పించిన గురువులకు ఘన సన్మానం చేశారు.వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో ఆద్యంతం ఆనందంగా గడిపారు.ప్రతిఒక్కరూ ఒకరి ఒకరికి పరిచయం చేసికొని ఎవరికి ఏ అవసరం వచ్చినా అండగా ఉండాలని తెలియపరచారు.ఈ సందర్భంగా విద్యా బుద్ధులు…

