AP

AP

ఏబీఎన్ ఆఫీస్ వద్ద వైసీపీ శ్రేణుల ఆందోళన..!

ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన ‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ కథనంపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హైదరాబాదులోని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‘మావిగన్’ వ్యాఖ్యలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యజమాని, ప్రముఖ పాత్రికేయుడు రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్ లో…

AP

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్… తిరిగి ప్రారంభమైన ‘ఎన్టీఆర్ వైద్య సేవ..

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది ఊరట కలిగించే వార్త. రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన ‘ఎన్టీఆర్ వైద్య సేవ’ పథకం తిరిగి ప్రారంభమైంది. బకాయిల చెల్లింపుపై ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించడంతో ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆషా) తమ సమ్మెను విరమించుకుంది. దీంతో నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో యథావిధిగా వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.   ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించడంతోనే సమ్మె విరమించినట్లు ‘ఆషా’ ప్రతినిధులు తెలిపారు. మొత్తం బకాయిల్లో భాగంగా రూ.1,000 కోట్లను 10 రోజుల్లో చెల్లించేందుకు…

AP

విశాఖలో గూగుల్ డేటా సెంటర్ కు ముహూర్తం ఖరారు..! ఎప్పుడంటే..?

ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలతో ప్రాజెక్టులు వేగంగా ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టింది ఏపీ ప్రభుత్వం . ఇప్పటికే ఆర్సెలార్‌ మిట్టల్-నిప్పన్‌ స్టీల్ ప్రాజెక్టుకు పునాదిరాయి పడింది. అక్కడ శరవేగంగా పనులు జరుగుతున్నాయి. తాజాగా ఇప్పుడు గూగుల్ వంతు అయ్యింది. గూగుల్ డేటా సెంటర్‌కు సంబంధించి పునాదిరాయి ముహూర్తం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది.   విశాఖలో గూగుల్ డేటా సెంటర్.. శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు   ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చకున్న సంస్థలు ప్రాజెక్టు ఏర్పాటు చేసేలా అడుగులు వేస్తోంది…

AP

అమరావతి ఆకాంక్ష నెరవేరిన వేళ.. కనకదుర్గమ్మ చెంతకు రాజధాని మహిళల పాదయాత్ర..

అమరావతి రాజధాని రైతుల సుదీర్ఘ పోరాటం ఫలించి, చట్టబద్ధత లభించిన శుభతరుణంలో రాజధాని ప్రాంత మహిళలు తమ భక్తిని, కృతజ్ఞతను చాటుకున్నారు. తమ కలల రాజధాని సాకారం కావాలని ఇన్నాళ్లూ పట్టువదలని దీక్ష చేసిన మహిళా రైతులు, నేడు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమరావతి ఆశయం నెరవేరినందుకు మొక్కులు చెల్లించుకోవడానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన మహిళలు, రాజధాని గ్రామాల నుండి కాలినడకన బయలుదేరి అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు.   కాలి నడకన కనకదుర్గమ్మ చెంతకు..…

AP

పుట్టపర్తి విమానాశ్రయంలో గవర్నర్‌కు ఘన స్వాగతం: మర్యాదపూర్వక భేటీ

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి శ్రీ సత్యసాయి విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ గారికి జిల్లా ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ (జేసీ), జిల్లా ఎస్పీ మరియు ఆర్డీవో తదితర అధికారులు గవర్నర్‌ను మర్యాదపూర్వకగా కలిసి పూల బొకేలను అందజేశారు. అధికారులు గవర్నర్‌కు సాదరంగా ఆహ్వానం పలుకుతూ, జిల్లాలోని ప్రస్తుత పరిస్థితులపై క్లుప్తంగా చర్చించినట్లు సమాచారం. ఈ మర్యాదపూర్వక భేటీ అనంతరం గవర్నర్…

AP

వేంపల్లి వద్ద తప్పిన పెను ప్రమాదం: ఆర్టీసీ బస్సుపై పడిన విద్యుత్ తీగలు!

వైయస్సార్ కడప జిల్లా వేంపల్లి గండి వీరన్న గట్టుపల్లి సమీపమున తలుపుల మీదగా కడపకు వెళ్లి తిరుగు ప్రయాణంలో వస్తున్న ఆర్టిసి బస్సు పై విద్యుత్ తీగలు అకస్మాత్తుగా బస్సు టాప్ పైన పడడంతో చాకచక్కంగా వ్యవహరించిన డ్రైవర్ బస్సు ఆపి ప్రయాణికులు బస్సు నుంచి దిగడంతో డ్రైవర్, కండక్టర్ కు ప్రయాణికులకు ఎవరికి ఏం కాలేదని తెలిసింది.

AP

ఉత్ఖంఠ క్రికెట్ పోటీలో కోచింగ్ క్యాంపు B జట్టు విజయం.

ఈరోజు డిగ్రీ కళాశాల మైదానం నందు జరిగిన క్రికెట్ పోటీలో మొదట బ్యాటింగ్ చేసిన కోచింగ్ క్యాంపు A జట్టు 25 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేశారు. మొహమ్మద్ 45 దేవేంద్ర 25 ప్రణయ్ 25 not అవుట్ రాణించారు. బౌలర్లు శివాజీ 2 తేజు, సన్నీ చెరో వికెట్ తీశారు. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన B జట్టు చివరి ఓవర్ చివరి బంతికి 4 పరుగులు అవసరం కాగ సాదిక్…

AP

పార్టీ పరువు తీస్తే సస్పెన్షనే.. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

ఏపీ రాజకీయాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో పాలన సాగిస్తూనే, పార్టీ అంతర్గత క్రమశిక్షణపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు వ్యవహారంపై సీఎం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ఎవరు వ్యవహరించినా, వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించే ప్రసక్తి లేదని ఆయన తేల్చి చెప్పారు. పార్టీ గౌరవానికి భంగం కలిగించే చర్యలను ఏమాత్రం సహించబోమని ఆయన స్పష్టం చేశారు.   వ్యక్తిగత…

AP

బీఆర్ నాయుడిని తొలగించాల్సిందేనని వైసీపీ నిరసనలు .

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్టను, పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన గళం విప్పింది. టీటీడీ ప్రస్తుత చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహార శైలి, ఆయనకు సంబంధించిన వివాదాస్పద అంశాలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని వైసీపీ నేతలు మండిపడ్డారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు అన్ని జిల్లాల్లోని ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, చైర్మన్ పదవి నుంచి బీఆర్ నాయుడిని తక్షణమే…

AP

జగన్‌పై మంత్రి అనిత సంచలన విమర్శలు..

అమరావతి రాజధాని విషయంలో గత ప్రభుత్వం అనుసరించిన తీరుపై హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అమరావతి రైతులు ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకున్నారు. సుమారు 1,631 రోజుల పాటు సాగిన సుదీర్ఘ పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు. రైతులు నేలపైన భోజనాలు చేస్తూ ఎన్నో అవమానాలు భరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు అమరావతి రాజధానికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత కల్పించడం…