AP

AP

చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్.. జనవరి 19కి వాయిదా..

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జనవరి 19కు వాయిదా పడింది. ఈ పిటిషన్ పై గతంలోనే వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది. శుక్రవారం జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్రశర్మల ధర్మాసనం పిటిషన్ పై మరోసారి విచారణ చేపట్టింది.   స్కిల్ కేసులో 17…

AP

ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..

ఏపీ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రూప్ -1 కు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 81 పోస్టులతో గ్రూప్-1 కు నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 17న ప్రిలిమనరీ పరీక్ష జరగనుంది. జనవరి 1 నుంచి జనవరి 21 వరకూ దరఖాస్తులను స్వీకరించనున్నారు.   డిప్యూటీ కలెక్టర్ -9, డీఎస్పీలు – 26 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు చేసుకోవలసిన వారు https://psc.ap.gov.in ను చూడవచ్చు. ఏపీ సివిల్ సర్వీస్…

AP

అమెరికా కాదు అంతరిక్షం నుంచి వచ్చినా.. గుడివాడలో టీడీపీ ఎన్నారై ఇన్ ఛార్జ్ పై కొడాలి ఫైర్..

గుడివాడలో తనను ఓడించేందుకు టీడీపీ అమెరికా నుంచి వచ్చిన ఎన్నారై వెనిగండ్ల రామును ఇన్ ఛార్జ్ గా ప్రకటించడంపై వైసీపీ మాజీ మంత్రి, స్ధానిక ఎమ్మెల్యే కొడాలి నాని మండిపడ్డారు. గుడివాడలో వైసీపీని ఓడించేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలపై కొడాలి ఫైర్ అయ్యారు. గుడివాడ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రతి ఎన్నికలో డ్యూటీ ఎక్కి, దిగినట్లు ఒక అభ్యర్థి వచ్చి వెళుతూ ఉంటారన్నారు.   తన గొంతులో ప్రాణం ఉన్నంతవరకు అమెరికా నుండి కాదు…

AP

చంద్రబాబుతో పవన్ భేటీ, కీలక మలుపు – ఢిల్లీకి ప్రయాణం..!!

ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతోంది. ఇటు ఏపీలో ఎన్నికల వేడి పెరుగుతోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో జనసేనాని పవన్ భేటీ అయ్యారు. ఏపీలో ఎన్నికల కార్యాచరణ పైన చర్చించారు. చంద్రబాబు – పవన్ కలిసి జిల్లా సభల్లో పాల్గొనటం..మేనిఫెస్టో..సీట్ల ఖరారు పైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇదే సమయంలో బీజేపీతో పొత్తు పైన చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ సమయంలోనే చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారు.   కొత్త సమీకరణాలు :…

AP

ఏపీ ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు- ఈనెల 22, 23న రాష్ట్రంలో టూర్-రాజకీయ పార్టీలతో భేటీ..

ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో ఏపీతో పాటు వచ్చే ఏడాది పెండింగ్ లో ఉన్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలకు ఈసీ రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ఏపీలో ఈ నెలలో రెండు రోజుల పాటు పర్యటించబోతోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఓటర్ల నమోదు, తొలగింపు ప్రక్రియపై భారీ ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈసీ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల 22, 23 తేదీల్లో రాష్ట్రంలో ఈసీ టూర్ ఖరారైంది.     ఏపీలో…

AP

పవన్ కి బీజేపీ ఓ పాఠం..

ఓటమి గుణపాఠాన్ని నేర్పుతుందంటారు. కానీ ఓటమిని ఎవరు కోరుకోరు. దానిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఆలోచన ఎవరికీ అంతు పట్టడం లేదు. తెలంగాణలో బిజెపితో కలిసి నడిచారు. పొత్తులో భాగంగా 8 స్థానాల్లో పోటీ చేశారు. ఒక్క కూకట్ పల్లి లో మాత్రమే జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్ గరిష్టంగా 39,830 ఓట్లు దక్కించుకున్నారు. మిగిలిన చోట్ల సరాసరి 2వేల నుంచి 3000 వరకు ఓట్లు మాత్రమే వచ్చాయి. తెలంగాణ…

AP

ఏపీలో ఆ 60 మంది సిట్టింగులకు టికెట్లు లేనట్టే..

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమికి ప్రధాన కారణం ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత. దీనిని అప్పట్లో చంద్రబాబు లైట్ తీసుకున్నారు. తనపై నమ్మకంతో ప్రజలు గెలిపిస్తారని విశ్వసించారు. కానీ ఆయన ఒకటి తలిస్తే.. ఏపీ ప్రజలు మరోలా తీర్పు ఇచ్చారు. వైసీపీకి అంతులేని విజయం కట్టబెట్టారు. తెలుగుదేశం పార్టీకి 23 స్థానాలకే పరిమితం చేశారు. ఇప్పుడు తెలంగాణలో సైతం అదే సీన్ కనిపించింది. చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉంది. ఈ విషయాన్ని కెసిఆర్ సైతం…

AP

సీఎం జగన్ కీలక ఆదేశాలు..!!

ఏపీని మిచౌంగ్ తుపాన్‌ వణికిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ తుఫాను గమనం..తాజా పరిస్థితులపైన అధికారులతో సమీక్షించారు. కీలక ఆదేశాలు ఇచ్చారు. అత్యవసర ఖర్చులు కోసం ప్రతి జిల్లాకు రూ.2 కోట్లు నిధులు విడుదల చేసారు. ఖరీప్‌ పంటల కాపాడుకోవడం ప్రధానమని చెప్పారు. కలెక్టర్లు,ఎస్పీలు, ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగడానికి వీలులేదని సీఎం స్పష్టం చేసారు. ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు.   చర్యలు వేగవంతం చేయండి:మిచౌంగ్ తుపాన్‌ పట్ల ప్ర‌భుత్వ యంత్రాంగ‌మంతా…

AP

ఏపీపై తెలంగాణ ఎఫెక్ట్, ఓటరు మూడ్ క్లియర్ – ఆ పార్టీకి డేంజర్ బెల్స్..!!

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ నాయకత్వానికి ప్రజలు వీడ్కోలు పలికారు. ఇక..త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో ఫలితాల సరళి ఏపీకి ఏం సందేశం ఇస్తోంది. ఏపీ మూలాలు ఉన్న తెలంగాణ ఓటర్లు తమ మనసులో అభిప్రాయం ఓటుతో స్పష్టం చేసారు. ఈ ఫలితాలు ఏపీలో మూడు ప్రధాన పార్టీలకు హెచ్చరికలా మారింది. వైసీపీ, టీడీపీ, జనసేన ఈ ఫలితాలు కలిసొస్తాయా.. నష్టం చేస్తాయా ఏం జరుగుతోంది.   కలిసొచ్చేదెవరికి:తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది. పరోక్షంగా టీడీపీ…

APNationalTELANGANA

మూడు రాష్ట్రాలపై మిచౌంగ్ ఎఫెక్ట్.. భారీ నుంచి అతి భారీవర్షాలు..

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం మిచౌంగ్ తుపానుగా రూపాంతరం చెందింది. మంగళవారం (డిసెంబర్ 5) నాటికి ఇది తీవ్ర తుపానుగా బలపడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం లోగా నెల్లూరు – మచిలీపట్నం మధ్య కృష్ణాజిల్లాలోని దివిసీమ దగ్గరలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.   తీరందాటే సమయంలో మిచౌంగ్ తీవ్ర ప్రభావం చూపిస్తుందని, భారీ ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ముఖ్యంగా కోస్తా…