చైనా ఆటకట్టు: కటిక చీకట్లో కదలికలను పసిగట్టేలా..!!
న్యూఢిల్లీ: లఢక్ (Ladhak) సమీపంలో గల వాస్తవాధీన రేఖ సహా సరిహద్దు వెంబడి తరచూ ఉద్రిక్తతలకు పాల్పడుతూ భారత్ (India)ను కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న చైనా (China) ఆటను కట్టించడానికి సరికొత్త వ్యూహాలను అమలు చేస్తోంది ఆర్మీ. దీనికోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహకారాన్ని తీసుకుంటోంది. లఢక్ మొదలుకుని సిక్కిం (Sikkim), అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) వరకూ తరచూ భారత భూభాగంపైకి చొచ్చుకుని వస్తోంది చైనా. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణానికి కారణమౌతోంది.…

