CINEMA

డ్యామేజీ కంట్రోల్‌ చేసుకున్న శ్రీవల్లి

కన్నడ సినీ ఇండస్ట్రీ నుండి ప్రేక్షకులకు పరిచయం అయిన రష్మిక మందన ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుని కన్నడ సినిమా పరిశ్రమను పట్టించుకోవడం లేదంటూ కన్నడ సినీ ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ మధ్య కాంతార సినిమా పై వివాదాస్పదంగా మాట్లాడిన రష్మిక కన్నడ సినిమాల విషయంలో చిన్న చూపు చూస్తుంది అన్నట్లుగా ప్రవర్తించింది. అందుకే గత కొన్నాళ్లుగా రష్మిక మందన పై కన్నడ సినీ ఇండస్ట్రీలో అనధికారికంగా బ్యాన్‌ విధించినట్లుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా తన సొంత సినీ ఇండస్ట్రీ ప్రముఖులను ప్రసన్నం చేసుకోవడానికి డ్యామేజ్‌ కంట్రోల్ చేసుకోవడానికి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కన్నడ సినీ ప్రముఖులను కాస్త అయినా ఈ వ్యాఖ్యలతో రష్మిక కూల్‌ చేసినట్లే అన్నట్లుగా టాక్ వినిపిస్తుంది.

నటిగా ప్రస్తుతం ఇన్ని భాషల్లో నటిస్తున్నానంటే, ఇంత మంది ప్రేక్షకులను అలరిస్తున్నానంటే అది కేవలం ఇప్పటి వరకు నేను నటించిన హీరోలందరి వల్లే. ముఖ్యంగా నటిగా నేను పరిశ్రమలోకి రావడానికి రక్షిత్ శెట్టి మరియు రిషబ్ శెట్టి కారణమని వాళ్లే నాకు ఇండస్ట్రీలకు దారి చూపించారు. కనుక వారిని ఎప్పటికీ మర్చిపోలేనని రష్మిక పేర్కొంది. సోషల్ మీడియాలో తనపై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయని.. వాటిని నేనెప్పుడూ పట్టించుకోను. కానీ నా చెల్లిని మరియు కుటుంబాన్ని కూడా ఈ వివాదంలోకి లాగి కొందరు విమర్శలు చేస్తున్నారని అందుకే ఈ సమయంలో తాను స్పందించాల్సి వచ్చిందని రష్మిక పేర్కొంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి కంటే కూడా ఇప్పుడు సమస్యలు ఎక్కువగా ఉన్నాయని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.