CINEMA

#SDT17 ఫస్ట్ థండర్ వచ్చేస్తుంది.

యాక్సిడెంట్ నుంచి పూర్తిగా కోలుకున్న మెగా మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్… విరూపాక్ష సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో సినిమాలో నటించి, తన యాక్టింగ్ కి కాంప్లిమెంట్స్ అందుకున్నాడు.

ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా అప్డేట్ ని ఆడియన్స్ ముందుకి తీసుకోని రాబోతున్నాడు సాయి ధరమ్ తేజ్. రచ్చ సినిమాతో మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టిన మాస్ డైరెక్టర్ సంపత్ నందితో సాయి ధరమ్ తేజ్ ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుందనే రూమర్ వినిపిస్తుంది కానీ అఫీషియల్ గా మేకర్స్ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ థండర్ రిలీజ్ కాబోతుంది అంటూ సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.

#SDT17 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ ఫస్ట్ థండర్ రేపు ఉదయం 8:55 నిమిషాలకి రిలీజ్ చేయనున్నారు. ఈ అప్డేట్ ఇస్తూ మేకర్స్ వదిలిన పోస్టర్ లో సాయి ధరమ్ తేజ్ ఫేస్ రివీల్ చెయ్యకుండా తేజ్ మెడపై ఉన్న త్రిశూలం టాటూని మాత్రమే రివీల్ చేసారు. దేవుడి టచ్ ఉందా లేక క్యాజువల్ టాటూనా అనేది తెలియాలి అంటే ఫస్ట్ థండర్ బయటకి వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాకి ‘గంజా శంకర్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీన్ని ఫిలిం చాంబర్ లో సైతం నిర్మాతలు రిజిస్టర్ చేయించినట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే టైటిల్ ని మేకర్స్ రేపు రివీల్ చేస్తారా లేదా అనేది చూడాలి.